Logo Raju's Resource Hub

Inspiring Personalities

ఆర్కిమెడీస్

ఒకానొక రోజు సిసిలీలోని సిరాకూస్‌కు నియంత అయిన హైరోన్ తన కంసాలిని పిలిచి దేవుళ్ళకు సమర్పించేందుకొక బంగారు కిరీటం చెయ్యమని పురమాయించాడు. అయితే కంసాలిపై అనుమానంతో అతను చేసేది కల్తీ లేని బంగారు కిరీటమా కాదా అని కనుగొనటానికి ఆర్కిమెడీస్‌ను పిలిపించాడు. సరేనన్న ఆర్కిమెడీస్ అక్కడి నుండి ఒక సార్వజనిక స్నానవాటికకు వెళ్ళాడు (అప్పట్లో పబ్లిక్ బాత్స్ సర్వసాధారణ వాడుక). అక్కడ ఒక నీటి తొట్టిలో కూర్చుంటూ కొంత నీరు బయటకు పొంగటం చూశాడు. తను నీటిలో […]

ఆర్కిమెడీస్ Read More »

సోనూసూద్‌

వేసేది విలన్‌ పాత్రలు. బయట మాత్రం ఆయన రియల్‌ హీరో. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు, డబ్బులు, తినడానికి తిండి అన్ని ఉన్నవారి పరిస్థితి ఆ టైంలో బాగానే ఉంది. కానీ పొట్టకూటి కోసం అయిన వారందరిని వదిలి ఎవరూ తెలియని చోటుకు వచ్చి బతికే  వలస కూలీల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం అందించే సాయం అందకా, రైళ్లు,బస్సులు లేక సొంత గూటికి  చేరలేక, ఉన్నచోట

సోనూసూద్‌ Read More »

లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్

నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం.. ఎందరో మహోన్నత వ్యక్తుల త్యాగాల ఫలితం. స్వాతంత్ర పోరాటంలో సమిధలుగా మారి.. ప్రస్తుత సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. అటువంటి వారిలో బాలగంగాధర్‌ తిలక్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌.. ఒకరు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అంటే, ఇంకొకరు స్వరాజ్య సాధన కోసం జీవితాన్నే త్యాగం చేశారు. తిలక్‌ తన మాటలతో యువతలో స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన దిశగా సాధారణ ప్రజలను సైతం ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని

లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్ Read More »

రోషిణి నాడార్

HCL పగ్గాలు చేపట్టిన రోషిణి నాడార్ 2017 నుంచి ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల్లో ఒకరు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత మహిళా ధనవంతురాలు ఆమే. భారతదేశ చరిత్ర లో ఒక మహిళ, ఒక ఐటీ కంపనీ పగ్గాలు చేపట్టి చైర్మన్ అవ్వటం ఇదే తొలిసారి. HCL (హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్) ని స్థాపించిన శివ నాడార్ ఏకైక కుమార్తె రోషిణి, తండ్రి చాటు బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా తండ్రితోనే వెళ్తుంది. తండ్రి మాట జవ దాటదు

రోషిణి నాడార్ Read More »

కందుకూరి వీరేశలింగం పంతులు

సంఘ సంస్కర్త, వైతాళికుడు, ఆధునిక సాహిత్యయుగ సంఘ వైతాళికుడు వీరేశలింగం పంతులుగారు 1848 సం. ఏప్రియల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయిడు. ఈయనకు 1861 సం.లో రాజ్యలక్ష్మి గారితో వివాహం జరిగింది. పంతులుగారు కొంతకాలం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడుగా పనిచేసి 1874 సం.లో ధవళేశ్వరంలోని ఆంగ్లభాషా పాఠశాలలో ప్రధానోపాధ్యుడుగా నియమింపబడ్డాడు. 1876 సం.లో వివేకవర్దిని అనే పత్రిక స్థాపించి అధికర వర్గాలలో అవినీతిని, లంచగొండితనాన్ని ధైర్యంగా బయటపెట్టేవాడు. ఆంధ్రదేశంలో స్త్రీల సమస్యలను

కందుకూరి వీరేశలింగం పంతులు Read More »

సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందారు. (నైటింగేల్ ఆఫ్ ఇండియా ) సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి కూడా. ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి డా.అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు హైదరాబాదు కాలేజికి, (నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ

సరోజినీ నాయుడు Read More »

పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాకరూపకర్త.పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో జన్మించాడు. తల్లిదండ్రులు హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లిలోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబోవెళ్లాడు. 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా

పింగళి వెంకయ్య Read More »

టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రినిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 50లలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడుప్రకాశంగారి పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని

టంగుటూరి ప్రకాశం పంతులు Read More »

పొట్టి శ్రీరాములు

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్షతో, ప్రాణాలర్పించి, అమరజీవి, మహావ్యక్తి పొట్టి శ్రీరాములు .పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు.

పొట్టి శ్రీరాములు Read More »

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్ ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ. పుల్లెల గోపీచంద్ ఈమె శిక్షకుడుసైనా నెహ్వాల్ సైనా నెహ్వాల్. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి 2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి

సైనా నెహ్వాల్ Read More »

రజియా సుల్తాన్

రజియా సుల్తాన్ అసలు పేరు రజియా ఆల్ దీన్. కానీ చరిత్రలో రజియా సుల్తాన్ లేదా రజియా సుల్తానాగా ప్రసిద్ ఈమె ఢిల్లీ సింహాసనంపై కొద్దికాలం మాత్రమే ఉంది. క్రీ.శ. 1236 నుండి 1240 వరకు. ఈమె సెల్జుక్ వంశానికి టర్కిష్ మహిళ, ఈమె సైనిక విద్య, కవాతు, ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్నది. టర్కిష్ చరిత్రలోనూ మరియు ముస్లింల చరిత్రలోనూ ప్రథమ మహిళా చక్రవర్తి. ఈమె తండ్రి షంసుద్దీన్ అల్తమష్ (“ఇల్‌టుట్ మిష్”) తరువాత, ఇతని

రజియా సుల్తాన్ Read More »

మేధా పాట్కర్

మేధా పాట్కర్ సామాజిక ఉద్యమకారిణి. నర్మదా బచావో ఉద్యమంతో ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మేధా పాట్కర్ డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్. వీరు కూడా సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది.2014 ఎన్నికలలో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈశాన్య ముంబయి లోక్ సభ స్థానానికి పోటీ చేసారు, కాని

మేధా పాట్కర్ Read More »

కిరణ్ బేడీ

కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ పి యస్ అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది కిరణ్ బేడి 1949, జూన్ 9వ తేదీన పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించింది. తండ్రి ప్రకాశ్ రావ్, తల్లి ప్రేమలత. డిగ్రీవరకు అమృతసర్ లో చదువుకుంటుంది. పంజాబ్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రం చదువుకుంది. ఉద్యోగంలో చేరినతరువాత ఢిల్లీ

కిరణ్ బేడీ Read More »

కల్పనా చావ్లా

కల్పనా చావ్లా ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.కల్పనా చావ్లా, భారత దేశంలో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులకు సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా “మోంటు” అని పిలుచుకుంటారు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది

కల్పనా చావ్లా Read More »

పి.టి. ఉష పరుగుల రాణి

పి.టి. ఉష క్రీడారంగంలో భారత దేశపు క్రీడారంగంలో పరుగుల రాణి పేరు పొందింది.ఉష కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో 1964 మే 20 న జన్మించింది.1979 నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమెను పయోలి ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు. పి.టి.ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. 1979లో ఉష జాతీయ స్థాయి

పి.టి. ఉష పరుగుల రాణి Read More »

కోనేరు హంపి

కోనేరు హంపి భారతదేశంలో పేరుపొందిన మహిళా చదరంగ క్రీడాకారిణి.హంపి 1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించినది. కోనేరు 2007 అక్టోబర్ లో ఫైడ్ ఎలో రేటింగ్ లో 2600 పాయింట్లను దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది. కేవలం 15 సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. 2001లో హంపి ప్రపంచ జూనియర్ బాలికల చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం

కోనేరు హంపి Read More »

అశ్వనీ నాచప్ప

అశ్వనీ నాచప్ప భారతీయ క్రీడాకారిణి. మహిళల పరుగుపందెములో 1980వ దశకపు ప్రధమార్ధంలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది. ఈమెకు 1988లో అర్జున అవార్డు ప్రదానం చేయబడింది.నాచప్ప జన్మస్థలం కర్ణాటక రాష్ట్రం కూర్గ్ . నాచప్ప క్రీడా రంగము నుండి తొలిన తర్వాత 1994 అక్టోబర్ 2 న ఇండియన్ ఏయిర్‌లైన్స్ జట్టు హాకీ ఆటగాడు దత్త కరుంబయ్యను వివాహము చేసుకొంది. వీరికి అనీషా, దీపాలీ కుమార్తెలు నాచప్ప హీరోయిన్ గా రెండు తెలుగు సినిమాలు

అశ్వనీ నాచప్ప Read More »

శోభానాయుడు – ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి.

శోభానాయుడు విశాఖ జిల్లా అనకాపల్లి లో 1956 లో జన్మించారు. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. స్వచ్చమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు అలాగే నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్రీయ మరియు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. శోభానాయుడు కూచిపూడి కళను ప్రదర్శించడంలో అమెకు ఆమె

శోభానాయుడు – ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి. Read More »

శకుంతలా దేవి

శకుంతలా దేవి ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్తఈమెను అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది లెక్కలను చేయటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో నవంబర్ 4, 1929 జన్మించారు. ఆమె తండ్రి ఒక సర్కస్ కంపెనీలో తాడుతో చేసే విన్యాసములు చేసే ఉద్యోగి. 1977లో

శకుంతలా దేవి Read More »

రుద్రమదేవి

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక మణిగా వెలిగిన మహారాణి కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేనందువలన రుద్రాంబకు రుద్రదేవుడని పేరుపెట్టి యుద్ధవిద్యలు, గుర్రస్వారీ నేర్పుతాడు. తర్వాత రుద్రాంబను తూర్పు చాళుక్యరాజు నిడవద్యపురం (నేటి నిడదవోలు) పాలకుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలుగుతారు. తన తండ్రి గణపతిదేవుని తరువాత

రుద్రమదేవి Read More »

లతా మంగేష్కర్

లతా మంగేష్కర్ ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా.లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ మొదటి సంతానం. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా అనేవారు పుడతారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతవారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే

లతా మంగేష్కర్ Read More »

మేరీ కాం

మేరీ కాం అని పిలవబడే మాంగ్టే చుంగ్నీజంగ్ మేరీకాం భారతదేశం మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళా బాక్సర్, ఈమె ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌చే ప్రోత్సాహంను పొందుతున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైన మేరీ కాం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా వరుసగా ఐదుసార్లు విజయాన్ని పొందారు. రెండు సంవత్సరాల విరామ అనంతరం, తన నాల్గవ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ పసిడి పతాకాన్ని సాధించటానికి 2008లో తిరిగి ఆడారు. ఆమె ఇందులో కనపరచిన ప్రదర్శన, AIBA ఆమెను ‘మాగ్నిఫిషియంట్(దేదీప్యమానమైన) మేరీ’

మేరీ కాం Read More »

దుర్గాబాయి దేశ్ ముఖ్

దుర్గాభాయి దేశ్ ముఖ్ ఒక పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు ఒక సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909 న కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌లో), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.న్యాయశాస్త్రం చదివి మద్రాసులో

దుర్గాబాయి దేశ్ ముఖ్ Read More »

ఆశా భోస్లే

ఆశా భోస్లే ప్రముఖ బాలీవుడ్ గాయని. ఈమె సెప్టెంబర్ 8, 1933లో మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే గ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. తండ్రి దీనానాధ్ మంగేష్కర్ తల్లి సుధామతి. ఈమె తండ్రి నటుడు మరయు గాయకుడు. ఆశాకు ముగ్గురు చెల్లుళ్లు, ఒకసోదరుడు ఉన్నారు. తొమ్మిది సంవత్సరల వయసులో తండ్రి మరణిస్తాడు. అప్పటికి వీరి కుటుంబం బీదరికంతో బాధపడుతుంది. వీరు బొంబాయి చేరుకొని అక్కడ సినిమాలలో పాడటం మొదలు పెడతారు. ఈమె మొదట బెంగాలీ

ఆశా భోస్లే Read More »

అరుంధతీ రాయ్

సుజాన్నా అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ గా ప్రసిద్ధి, ఈమె భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి నవంబర్ 24 1961 న మేఘాలయ లోని షిల్లాంగ్ జన్మించింది. తండ్రి బెంగాలీ మరియు తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమెకు 1997లోతన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజు వచ్చింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. మరియు 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. ఈమె తన బాల్యం కేరళలో

అరుంధతీ రాయ్ Read More »

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతరా. ఈమె జన్మించిన సంవత్సరం గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నవి.. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక. ముద్దు పేరు మను. ఝాన్సీ తల్లి

ఝాన్సీ లక్ష్మీబాయి Read More »

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతరా. ఈమె జన్మించిన సంవత్సరం గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నవి.. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక. ముద్దు పేరు మను.

ఝాన్సీ లక్ష్మీబాయి Read More »

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – విప్లవవీరుడు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – విప్లవవీరుడు. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పది సంవత్సరాల ముందే, బ్రిటిషు వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారావు. అల్లూరి సీతారామరాజుకు ముందే చెంచులను, బోయలను కూడాకట్టుకొని బ్రీటీష్ వారి ఖజానాను కొల్లగొట్టిన విప్లవవీరుడు. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – విప్లవవీరుడు Read More »

Google ad
Google ad
Scroll to Top