📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

శోభానాయుడు – ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి.

sobha naidu

శోభానాయుడు విశాఖ జిల్లా అనకాపల్లి లో 1956 లో జన్మించారు. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. స్వచ్చమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు అలాగే నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్రీయ మరియు జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

శోభానాయుడు కూచిపూడి కళను ప్రదర్శించడంలో అమెకు ఆమె సాటి అన్న ప్రఖ్యాతి గడించింది. ఈమె వెంకటనాయుడు మరియు సరోజిని దేవి దంపతులకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించింది. ఆమె బాల్యంలో తన నాట్యకౌశలంతో అనేకమంది హృదయాలను మంత్రముగ్ధులను చేసింది. ఈమెకు 1990 – సంగీత నాటక అకాడమీ పురస్కారం మరియు 2001 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించాయి.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading