📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

అరుంధతీ రాయ్

arundhati rai

సుజాన్నా అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ గా ప్రసిద్ధి, ఈమె భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి నవంబర్ 24 1961 న మేఘాలయ లోని షిల్లాంగ్ జన్మించింది. తండ్రి బెంగాలీ మరియు తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమెకు 1997లోతన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజు వచ్చింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. మరియు 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది.

ఈమె తన బాల్యం కేరళలో గడిపారు. ఉన్నతవిద్య ఢిల్లీలో చేసారు. అక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డాకున్హాను కలిసారు. రాయ్ తన రెండవ భర్త, సినీ నిర్మాత ప్రదీప్ కిషన్ ను 1984లో కలిసారు, ఇతను నిర్మించిన అవార్డు పొందిన చిత్రం “మస్సీ సాహిబ్”. ఈమె నవల “ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్” వల్ల ఈమె ఆర్థిక స్థితి మెరుగు పడటం జరుగుతుంది.

ఆ తరువాత ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్స్ లో ‘ఏరోబిక్స్ క్లాసెస్’ నడుపుతూ ఢిల్లీలోనే నివాసం ఏర్పరచుకున్నారు. ఈమె సమీప బంధువు ప్రణయ్ రాయ్ ప్రసిద్ధ టీవీ యాంకర్, NDTV లో ప్రధాన పాత్రధారిగా పనిచేస్తున్నాడు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, “నర్మదా బచావో” ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన “ది గ్రేటర్ కామన్ గుడ్” రచన వివాదాస్పదంగా మారినది.

ఈమెకు సిడ్నీ శాంతి బహుమతి మే 2004 లో లభించింది. తన రచన వ్యాసాలుద ఆల్‌జీబ్రా ఆఫ్ ఇన్‌ఫినైట్ జస్టిస్కు సాహిత్య అకాడెమీ అవార్డు 2006 లో లభించింది. కానీ భారత ప్రభుత్వం అమెరికా అడుగుజాడలలో నడుస్తోంది అని ఈ అవార్డు స్వీకరించడానికి నిరాకరించింది.

Google ad
Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading