📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

పృధ్వీరాజ్

Google ad

ఢిల్లీని కేంద్రంగా పాలించిన చివరి హిందూ రాజు. పృధ్వీరాజు చౌహాన్ వంశీయుడు. క్రీ.శ. 1179 సం.లో సింహాసనం అధిష్టించాడు. అప్పట్లో కనౌజ్ ను పరిపాలిస్తున్న జయచంద్రుని కుమార్తె రాణీ సంయుక్తను అపహరించి వివాహమాడాడు. ఘోరీ మహ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు స్థానేశ్వరానికి సమీపంలో ఉన్న తరాయి అనే ప్రాంతం వద్ద రాజపుత్ర యోధుల సాయంతో ఘోరీ మహ్మద్ సేనలను ఒడించాడు.

కానీ తరువాత సంవత్సరం ఘోరీ మహ్మద్ దాదాపు 1,20,000 సైన్యంతో దండెత్తి వచ్చినపుడు ఓడిపోయి బందీగా చిక్కాడని తెలుస్తుంది. తరువాత ఘోరీ ఫృధ్వీరాజ్ కళ్లను పొడిపించాడాని కానీ ఫృధ్వీరాజ్ తన మిత్రుడైన చంద్రవర్దాయ్ అనే కవి సాయంతో తనకు వచ్చిన శబ్ధభేది విద్య ద్వారా ఘోరీని బాణప్రయోగంతో చంపాడని, తరువాత చంద్రవర్ధాయ్, ఫృధ్వీరాజ్ ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారని కొందరి అభిప్రాయం.

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading