📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

రాజరాజ చోళుడు

చోళ రాజవంశ చక్రవర్తులలో ప్రముఖుడు రాజరాజ చోళుడు. క్రీ.శ. 985 సం.లో తంజావూరు (నేటి తమిళనాడులోని) రాజధానిగా చోళ సింహాసనాన్ని అధిష్టించి 1018 సం. దాకా పరిపాలించాడు.
చేర, పాండ్య, తూర్పు చాళుక్య (వేంగి), ఓఢ్ర దేశాలను జయించి బెంగాల్ నుండి సింహళం వరకు తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు. రాజరాజ చోళుడు దేశ భాషలను ఆదరించి, స్థానికసంస్కృతులను ఆదరించి, దేవాలయ వాస్తు శిల్ప కళను పోషించి పేరుపొందాడు.


తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇతని కాలంలో నిర్మించినదే. రాజరాజ చోళుని పరిపాలనలో దేశం సుభిక్షమై ప్రజలు సుఖజీవనం గడిపినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading