📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

రెండవ ప్రతాప రుద్రుడు

కాకతీయ రాణి రుద్రమ దేవి మనుమడు. రుద్రమదేవికి పుత్ర సంతానం లేకపోవటంతో పెద్ద కుమార్తె ముమ్మడమ్మ పుత్రుడైన ప్రతాప రుద్రుని దత్తపుత్రునిగా స్వీకరించింది. ఇతని తండ్రి మహాదేవరాయలు. రుద్రమదేవి మరణానంతరం 1295 లో సింహాసనం అధిష్టించాడు. అప్పటికి ఇతని వయస్సు 35 సంవత్సరాలు.

పరిపాలనా విధానాన్ని కట్టుదిట్టం చేసి 77 గురు నాయకులు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల పరిపాలనా బాధ్యతలను వారికి అప్పగించాడు. ప్రతారుద్రుని సైన్యం చాలా శక్తివంతమైనది. ఢిల్లీ నుండి అల్లావుద్దీన్ ఖల్జీ ఏడు సార్లు దండెత్తినా ఏడుసార్లు కూడా వారిని వెనకకు తరిమివేశారు. కానీ ఎనిమిదవ సారి ఓడిపోయి సంధి చేసుకున్నాడని తెలుస్తుంది.


1323 సం.లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడైన ఉలమ్ ఖాన్ ఓరుగల్లు మీద దండెత్తి కోటను స్వాధీనం చేసుకున్నాడు ప్రతారుద్రుణ్ణి బందీగా ఢిల్లీ పంపించాడు. కానీ ప్రతాపరుద్రుడు దారిలోనే మరణించాడు.

Google ad

ప్రతాప రుద్రుడు గొప్ప సాహిత్యపోషకుడు. సంస్కృతం, తెలుగు రెండు భాషలను ఆదరించాడు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో సంస్కృత కవులలో సాకల్య మల్లభట్టు ‘‘ఉదాత్త రాఘవం’’ ‘నిరోష్ఠ్య రామాయణం’ అనే రెండు కావ్వాలను వ్రాశాడు. 1320 సం.లో ‘జైనేంద్ర కళ్యాణాభ్యుదయం’ అనే సంస్కృత కావ్యాన్ని రచించిన జైన కవి అప్పారాయుడు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడే.

తెలుగులో ‘క్రీడాభిరామం’ అనే వీధి కాటకానికి మూలం ఐన సంస్కృత ‘ప్రేమాభిరామం’ రచించిన రావిపాటి త్రిపురాంతకుడు ప్రతాపరుద్రుని సమకాలికుడని చరిత్రకారుల అభిప్రాయం.
అలంకార శాస్త్రంలో ప్రామాణిక గ్రంధంగా చెప్పబడుతున్న ‘ప్రతాపరుద్ యశోభూషణం’ రచించిన విద్యానాధుడు కూడా ప్రతాపరుద్రుని ఆస్థానపండితుడు. పాల్కురుకి సోమనాధుడు రచించిన ‘అనుభవ సారం’, ‘చతుర్వేదసారం’, ‘సోమనాధ భాష్యం’, ‘రుద్రభాష్యం’ గ్రంథాలు ఈ కాలంలోనే వెలువడ్డాయి. ప్రతాప రుద్రుడు కూడా ‘నీతిసారము’ అనే రాజనీతి శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఇతనికి ‘‘విద్యాభూషణ’’ అనే బిరుదు కలదు.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading