📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

సముద్రగుప్తుడు

Google ad

భారతదేశాన్ని పాలించిన గుప్తరాజ వంశీయులలో ప్రముఖ చక్రవర్తి సముద్రగుప్తుడు. క్రీ.శం.330 నుండి 375 వరకు ఈయన పరిపాలన సాగింది. తన తండ్రి ఒకటవ చంద్రగుప్తుని తరువాత క్రీ.శ.330 సం.లో పట్టాభిషక్తుడైనాడు.
పరాక్రమవంతుడు, వీరుడైన సముద్రగుప్తుడు ఉత్తరభారత దేశాన్ని జయించి దక్షిణిపథంవైపు తిరిగాడు. అప్పట్లో వేంగి దేశాన్ని హస్తివర్మ, కాంచీపురాన్ని విష్ణుగోపుడు పరిపాలించేవారు. వీరిని కూడా జయించాడు.
సముద్రగుప్తుడు అశ్వమేధయాగం చేశాడని దానికి గుర్తుగా బంగారు నాణాలను ముద్రించి వాటిపై రాజాధి రాజ, అప్రతిహత యోధానుయోధ అని తన బిరుదనామాలు చెక్కించాడని పండితుల ఉవాచ.


సముద్రగుప్తుడు కళాపోషకుడు. దానకళా విశారదుడని అలహాబాదు శిలాశాసనం ద్వారా తెలుస్తుంది.
సముద్రగుప్తుని కీర్తి ఆనాడే విదేశాలకు కూడా వ్యాపించింది. సముద్రగుప్తుని పట్టమహిషి దత్తాదేవి వలన రామగుప్తుడు, చంద్రగుప్తుడు అని ఇరువురు కుమారులు జన్మించారు. వీరిలో చంద్రగుప్తుడు భారతదేశ చక్రవర్తిగా పేరు పొందాడు.

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading