📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

ముప్పవరపు వెంకయ్యనాయుడు

యం.వెంకయ్య నాయుడు (1949)

వెంకయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, చవటపాలెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి దేశటానకు వెళ్లడంతో అమ్మమ్మ, తాతయ్య సంరక్షణ లో పెరిగారు. నెల్లూరు లో ఉన్న ప్రముఖ వి.ఆర్.కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు.

ఆర్.ఎస్.ఎస్ నెల్లూరు జిల్లా ఇంఛార్జిగా ఉన్న సోమేపల్లి సోమయ్య, ముఖ్య శిక్షక్ గా ఉన్న భోగాది దుర్గాప్రసాద్ గార్ల ప్రోత్సాహంతో ఆర్.ఎస్.ఎస్ లో చేరి, అనంతరం ఆర్.ఎస్.ఎస్ అనుబంధ విద్యార్థుల సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ లో ప్రవేశించి అనతి కాలంలోనే నెల్లూరు పట్టణ ఎబివిపి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎబివిపి తరుపున విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు.

Google ad

విద్యార్థులు నాయకుడిగా ఉన్న సమయంలో జై ఆంధ్ర ఉద్యమం జరగడం, ఆ ఉద్యమనికి మద్దతు గా విశాఖపట్నం జిల్లాలో ఆనాటి ప్రముఖ నాయకులు తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖ నాయకులతో పాటుగా పాల్గొన్నారు. ఉద్యమం లో అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు వంటి ఎందరో యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు, అనంతరం ఆ ఉద్యమం లో పాల్గొన్న విద్యార్థులు కొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.

1977లో జనతాపార్టీ అభ్యర్థిగా ఒంగోలు పార్లిమెంట్ నుంచి పోటి చేసి ఓటమి చవిచూసిన, 1978,1983లలో జనతాపార్టీ , బీజేపీ పార్టీ ల నుంచి ఉదయగిరి నుంచి ఎన్నికయ్యారు, 1984లో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1985లో బీజేపీ అభ్యర్థిగా ఆత్మకూరు అసెంబ్లీ నుంచి, 1989లో బాపట్ల లోక్ సభ నుంచి, 1996లో హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు, అలా మూడు సార్లు లోక్ సభకు పోటీ చేసి ఓటమి చెందడంతో లోక్ సభ్యుడిగా పార్లిమెంట్ కు ఎన్నికవ్వాలన్న ఆయన కోరిక కలగానే మిగిలింది. 1998 నుంచి 2016వరకు కర్ణాటక రాష్ట్రం నుంచి మూడు సార్లు రాజ్యసభకు, 2016లో నాలుగో సారి రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు.

2000నుంచి 2002 వరకు వాజపేయి మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా పనిచేసారు,2014 నుంచి2017 వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఇలా రెండు పరస్పర సారూప్యత గల మంత్రి పదవులు చేపట్టిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

2017 నుంచి ప్రస్తుతం వరకు దేశ ఉపాధ్యక్షుడిగా, రాజ్యసభ అధ్యక్షుడిగా సభను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ వంటి అంశాలపై ఎక్కువ మక్కువ చూపుతారు. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయలు అన్న వల్లమాలిన అభిమానం కనబరుస్తూ ఉంటారు, అందుకనే ప్రతి యేటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఢిల్లీలో ఉన్న నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.

వెంకయ్య నాయుడు గారు రాజకీయాల్లో ఎంత ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తి, రాజకీయాల్లో తన ఉన్నతికి కారణమైన గురువులను, ప్రతి వ్యక్తిని గురించి ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీ లకు మారుపేరు గా నిలిచారు. వెంకయ్యనాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి, ఆదర్శ నాయకులు మన తెలుగు నెలకు చెందిన వారు కావడం రెండు తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు ప్రజలందరికీ గర్వ కారణం.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading