Google ad
కావలసినవి
సగ్గు బియ్యం – అర కప్పు
బెల్లం పొడి – అర కప్పు
పాలు – 3 కప్పులు
నీళ్లు – ఒకటిన్నర కప్పులు ఏలకుల పొడి – పావు టీ స్పూను
కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను
జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూను
నెయ్యి – ఒక టేబుల్ స్పూను
తయారు చేసేవిధానం
సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, కుక్కర్లో ఉంచి ఉడికించుకోవాలి వేరోక పాత్రలో పాలు, నీళ్లు పోసి బాగా కాగిన తరువాత సగ్గుబియ్యం వేసి బాగా తిప్పాలి. బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం పొడి లేదా పంచదార జత చేసి మరోమారు కలపాలి. ఏలకుల పొడి, డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలిపి దించేయాలి.
Google ad
Raju's Resource Hub