Google ad
ఉప్పుడు బియ్యం – 1 కప్పు
మినప పప్పు – 1/2 కప్పు
సగ్గుబియ్యం – 1/4 కప్పు
రాగి పిండి – 1 కప్పు
మెంతులు – 1/4 టీ స్పూన్
ఉప్పు- తగినంత
నూనె – తగినంత
తయారు చేసే విధానం:
ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం కలిపి 4-5 గంటల వరకు నానబెట్టాలి. మినప పప్పు, మెంతులు కలిపి 3-4 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం ను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న మినప పప్పు, మెంతుల్ని కూడా మెత్తగా రుబ్బుకుని ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని, దానిలోనే రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. పిండిని పులియబెట్టి, దోసెలు వేసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Google ad
Raju's Resource Hub