📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

అభిషేకములు :: వాటి ఫలములు

తంజావూరు బృహదీశ్వర లింగం
Image may contain: 2 people

ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. అభిషేకాల ద్వారా ఆలయాల్లో శుద్ధి చేయడం పరిపాటి. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఆలయాల్లో జరిగే అభిషేకాల ద్వారా లభించే ఫలితాలేంటో పరిశీలిస్తే.. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.
ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది. పంచదారలో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు. విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది. శంఖువు ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు. చందనం, పనీర్‌లను కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది. మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది. స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి. పంచామృతం (కలకండ, పంచదార, నెయ్యి, పండ్లు, తేనె)తో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కొబ్బరి బొండాంతో అభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలుండవు.
చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది పచ్చిబియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది. చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది. నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది(ద్వేషం తగ్గుతుంది).
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
వినాయకుడు – ఆదివారం
పరమేశ్వరుడు – సోమవారం
సుబ్రహ్మణ్య స్వామి – మంగళవారం
విష్ణుమూర్తి – బుధవారం
గురు భగవానుడు. సాయి నాథునికి – గురువారం
అమ్మవారికి – శుక్రవారం
శ్రీ కృష్ణుడికి – శనివారం
నవగ్రహాలకు – ఆదివారం
దుర్గాదేవికి – మంగళవారం అభిషేకాలు చేయించాలని పురోహితులు చెబుతున్నారు.
ఇంత అహారాన్ని వృథా చేయకుండా ఆహారం లేని పేదలకు దానం చేయవచ్చు కదా అనుకుంటారు కొంతమంది… మన ఆలయాలలో పూజ నిర్వహించిన తర్వాత ఆ అభిషేకనీటిని తిరిగి మనం స్వీకరిస్తున్నాం.. ఈ నీరు ఎంతో ఔషధవిలువలు కూడుకుని ఉంటుంది… ( దీనికి ఏ సైద్ధాంతిక నిరూపణలు చేయనవసరం లేదు)…ప్రసాదాలు అందరికీ వితరణ చేయటం అనేది ప్రతి దేవాలయంలో ప్రతి రోజు చేసే నిత్య కృత్యం… ప్రతి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్ణీత రోజులలో క్రమం తప్పక జరగటం ఆనవాయితీ….. ఇవి ప్రాచీన కాలంనుండి కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ…
ఉదాహరణకు… కోటప్పకొండ, అమరావతి, పొన్నూరు, యాగంటి, తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, తిరుపతి, ద్రాక్షారామం, ద్వారకా తిరుమల, జోగులాంబ, విజయవాడకనకదుర్గ… ఇలా అన్ని ప్రసిద్ధ దేవాలయాలల్లో ఈ వితరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంది..
Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading