📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

శశి థరూర్

శశి థరూర్(1956)

శశి థరూర్ గారు లండన్ లో జన్మించారు, ఆయన తండ్రి భారత విదేశాంగ శాఖ లో ఉన్నతాధికారి, అలాగే థరూర్ కుటుంబ నేపథ్యం చాలా బలమైనది, సంపన్న మైనది. దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో, విదేశాల్లో ఉన్న ఉన్నతమైన విద్య సంస్థల్లో తన విద్యను పూర్తి చేసి ఐక్యరాజ్య సమితి లో 1978 నుంచి 2009 వరకు వివిధ స్థాయిల్లో పనిచేశారు.

2006లో ఐక్యరాజ్య సమితి కార్యదర్శిగా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో దక్షిణ కొరియా కు చెందిన బాకీ మూన్ చేతిలో ఓటమి పాలయ్యారు, లేకుంటే సమితి కార్యదర్శిగా ఎన్నికైన మొదటి భారత దేశానికి వ్యక్తిగా థరూర్ ప్రపంచ చరిత్రలో నిలిపోయేవారు.

Google ad

2009 నుంచి ప్రస్తుతం వరకు కమ్యూనిస్టు పార్టీల కంచుకోట తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు సార్లు గెలిచిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. 2009 నుంచి 2010 వరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి గా, 2012 నుంచి 2014 వరకు మానవవనరుల శాఖ సహాయ మంత్రిగా మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పనిచేశారు.

థరూర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా బహుళ్యంలో ఉన్న అనేక సమస్యలకు అధికార ప్రభుత్వాలకు పరిష్కారాలు సూచించారు ,పార్లిమెంట్ లో ఆయన లేవనెత్తిన సమస్యలను అన్ని పార్టీల సభ్యులు ఆసక్తిగా వింటారు. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ విమర్శకుల్లో థరూర్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

రాజకీయ నాయకుడిగా కంటే థరూర్ గారికి మంచి రచయితగా పేరుంది, ఆయన రచనలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వం నుంచి కూడా రచయిత గా అవార్డులు అందుకున్నారు. ఆంగ్ల భాష మీద ఉన్న పట్టు ఆయన్ను యువతకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించింది, థరూర్ వాడుక ఇంగ్లీష్ భాషలో అనేక కొత్త పదాలకు సృష్టికర్త.

థరూర్ స్వేచ్ఛ జీవి, మంచి రచయిత అలాగే దేశ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది, కానీ భారత దేశ ప్రజలు మాత్రం ఆయన ఒక మంచి రచయిత గానే పరిగణనలోకి తీసుకుంటున్నారు తప్పించి రాజకీయ నాయకుడిగా మాత్రం కాదు.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading