📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ (1948)

లాలూ ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో ప్రస్తుత గోపాల్ గంజ్ జిల్లాలో ఫుల్వారియా గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. గోపాల్ గంజ్, శరన్, పాట్నా ప్రాంతాల్లో ఎస్.ఎల్.సి, పియూసీ , డిగ్రీ(లా) ,పాట్నా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్, పిహెచ్ డి పూర్తి చేసి కొంత కాలం పశువైద్య కళాశాలలో బంట్రోతు గా పనిచేశారు.

పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో రబ్రీ దేవి గారితో వివాహం వీరికి 9 మంది సంతానం. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్ గారు విద్యార్థి సమయంలో మంచి స్నేహితులు, విశ్వవిద్యాలయం వసతి గృహంలో వీరిద్దరూ ఒకే గదిలో ఉండేవారు, అలాగే లాలూ రాజకీయ జీవితంలో అనేక విజయాల్లో నీతిశ్ కుమార్ గారి పాత్ర కీలమైనది.

Google ad

లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో లాలూ ప్రసాద్ గారు ముందువారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్ట్ చేయడంతో తన పెద్ద కుమార్తెకు పేరు మీసా పేరు పెట్టారు.

1977,1989,1998,2004,2009లలో లోక్ సభకు ఎన్నికయ్యారు, 1980,1985,1995లలో మూడు సార్లు బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, అలాగే 1990 నుంచి 1995 వరకు బీహార్ శాసనసభ మండలికి ఎన్నికయ్యారు. 1985 నుంచి 1989 వరకు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, 1990 నుంచి 1997 వరకు రెండు సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా, 2004 నుంచి 2009 వరకు కేంద్ర యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.

1989, 1996 లలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటు లో కీలకమైన పాత్ర పోషించారు. 1990లో బీహార్ ముఖ్యమంత్రి గా దేశవ్యాప్తంగా రథయాత్ర లో భాగంగా బీహార్ లోకి ప్రవేశించిన బీజేపీ అధ్యక్షుడు అద్వానీ గారిని అరెస్ట్ చేయించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. వివాదాస్పద మండల్ కమిషన్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తరువాత దేశంలో మొదటగా బీహార్ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి లాలూ గారు.

1997లో జనతాదళ్ పార్టీని చీల్చి నూతనంగా రాష్ట్రీయ జనతా దళ్ పార్టీని స్థాపించారు. బీహార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో దాణా కుంభకోణంలో అరెస్ట్ అయ్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు జీవితాంతం అర్హత కోల్పోయిన మొదటి రాజకీయ నాయకుడు. నిరక్షరాస్యురాలు తన భార్య రబ్రీ దేవిని బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా గెలిపించారు.కుమారులు తేజ్ ప్రతాప్ , తేజస్వి లు మాజీ మంత్రిలుగా పనిచేశారు, చిన్న కుమారుడు తేజస్వి గారు ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత.

పదిహేనేళ్ల తన పార్టీ పాలనలో అగ్రవర్ణ ప్రజలను అత్యంత అవమానకర రీతిలో హింసించడం, అవినీతి, కుటుంబ పాలన మొత్తం ఆటవిక రాజ్యానికి నమూనా గా బీహార్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ గారు మాత్రం బీహార్ లో అత్యధిక జనాభా కలిగిన యాదవులు, ముస్లింలు వీరికి, వీరి పార్టీకి బలమైన మద్దతు దారులు.

లాలూ ప్రసాద్ ఒక సారి ఇవి

“జబ్ తక్ సమోసా మే ఆలు ,టబ్ తక్ బీహార్ రాజనీతి మే లాలూ” ( సమోసాలో ఆలుగడ్డ ఉన్నట్లు బీహార్ రాజకీయాల్లో లాలూ ఉంటాడు).

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading