📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

బాల్ థాకరే

బాల్ థాకరే(1926–2012)

బాల్ థాకరే గారి పూర్తి పేరు బాలసాహెబ్ కేశవ్ థాకరే.

థాకరే తండ్రి గారు కేశవ్ సీతారాం థాకరే గారు మరాఠీ భాషలో ప్రముఖ రచయిత, పాత్రికేయులు, సంఘ సేవకుడు మరియు సంయుక్త మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమం చేసిన నాయకుల్లో ముఖ్యులు. థాకరే గారు ప్రారంభ దశలో ఒక ప్రముఖ పత్రికలో కార్టూనిస్ట్ గా 1960 వరకు పనిచేశారు.1960లో సోదరుడుతో కలిసి “మార్మిక్” అనే తొలుత కార్టూన్ పత్రికగా మొదలై అనంతరం సామాజిక స్పృహ కలిగిన అంశాలపై వ్యాసాలు రావడం ప్రారంభమై మంచి ఆదరణ లభించింది.

Google ad

1966లో మరాఠీ ప్రజల కోసం మరాఠాల అభిమాన చక్రవర్తి శివాజీ మహరాజ్ పేరు మీద బొంబాయి కేంద్రంగా “శివ సేన” అనే సామాజిక సంస్థ ను ఏర్పాటు చేశారు. బొంబాయి నగరం లో మరాఠీ బాష పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టి విజయం సాధించారు. “భూమి పుత్రుల సిద్ధాంతం” పేరుతో బొంబాయి నగరం లో ఇతర రాష్ట్రాల ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కకుండా కేవలం మహారాష్ట్ర వాసులకే ప్రథమం అని ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

అప్పటి వరకు ఉద్యమ వేదికగా ఉన్న శివ సేన ను పార్టీగా ఏర్పాటు చేశారు. అనంతరం మహారాష్ట్ర మొత్తం విస్తరించారు. 1971లో జరిగిన బొంబాయి నగర మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో శివ సేన గెలవడం, మేయర్ పీఠం సొంతం చేసుకుంది, అప్పట్నుంచి ఇప్పటి వరకు నగరంలో సేన పార్టీకి ఎదురులేకుండా ఆధిపత్యం చెలాయించగలిగింది. సేన పార్టీ క్రమంగా హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ గా మారడంతో పార్టీకి దేశవ్యాప్తంగా హిందూ మతం నుండి విశేషంగా ఆదరణ లభించింది, ముఖ్యంగా హిందూ మతం మైనార్టీ ఉన్న ప్రాంతాల్లో. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రక్రియలో శివ సైనికులు పాల్గొన్నారు, అంతే కాకుండా హిందూ ప్రజల కోసం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజల్లో మంచి ప్రాధాన్యత లభించింది ముఖ్యంగా హిందూ సమాజ పరిరక్షణకు కృషి చేస్తున్న నాయకుడిగా “హిందూ హృదయ సామ్రాట్” గా బిరుదును పొందారు, చివరి వరకు అలాగే ఉన్నారు.

1995లో బీజేపీ తో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి పదవి వరించిన తిరస్కరించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన అదుపులో ఉంచుకుని “బొంబాయి” పేరును ” ముంబై” గా మార్చారు.

ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మనవుడు ఆదిత్య థాకరే ప్రస్తుతం మంత్రి.

పదవులతో సంబంధం లేకుండా దేశ రాజకీయల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా హిందూ ప్రజానీకానికి పెన్నిధి బాలసాహెబ్ థాకరే గారు.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading