📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

జై ప్రకాష్ నారాయణ

Google ad

జై ప్రకాష్ గారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు, వీరి తండ్రి గారు రైల్వే లో పనిచేసేవారు. గుంటూరు మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ, 1975లో విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి గుంటూరు నగరంలో పోరాటం చేశారు.

1980 సివిల్స్ అల్ ఇండియాలో 4 వ ర్యాంకు సాధించి ఐ. ఏ.యస్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపికయ్యారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేసి జిల్లా అభివృద్ధి మరియు పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రంలో సహకార , ఇరిగేషన్ రంగాలు మెరుగైన ఫలితాలు సాధించడంలో వీరి పాత్ర కీలకం. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు పిలిచి మరీ తన కార్యదర్శిగా నియమించుకున్నారు , తరువాత మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణ కాంత్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో కూడా వారికి కార్యదర్శిగా పనిచేసారు.

Google ad

1996లో తన పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకర్తగా మారారు. ప్రజలకు సుపరిపాలన అందించడానికి , ఓటింగ్ మీద అవగాహన, అవినీతి రహిత సమాజం వంటి పలు అంశాలపై లోక్ సత్తా ఉద్యమం చేపట్టారు, తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమై దేశవ్యాప్తంగా విజయవంతంగా విస్తరించింది. యువత లో రాజకీయ స్పృహ కలిగించడమే లక్ష్యంగా ఏన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించబడుతున్న “యూత్ పార్లిమెంట్ ” ప్రోగ్రాం రూపకల్పన చేసింది ఆయనే.

Google ad

2006లో లోక్ సత్తా ఉద్యమన్ని రాజకీయ పార్టీగా నిర్మించాలనే తలంపుతో “లోక్ సత్తా ” పార్టీని స్థాపించారు. 2008లో జరిగిన 4 అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీ మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జె.పి గారు కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. జె.పి గారు ఎన్నికల్లో సంస్కరణలు అమలు చేయాలని కోరుతూ అనేక సార్లు ఎన్నికల కమిషన్, ప్రధాన మంత్రి, రాష్ట్రపతికి ఎన్నో సార్లు లేఖలు రాశారు.

Google ad
Google ad

2010లో “సురాజ్యం” పేరుతో స్థానిక సంస్థల్లో సుపరిపాలన లక్ష్యంతో ఉద్యమం విజయవంతంగా చేపట్టారు. “ప్రజాస్వామ్య పీఠం”(foundation for democratic reforms) పేరుతో ఒక మేధో మదన సంస్థను స్థాపించి రాజకీయ, పరిపాలన వ్యవస్థ వంటి పలు అంశాలపై చర్చలు నిర్వహిస్తూనే ఆ కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేశారు. రాజకీయాల్లో లేదా పరిపాలన వ్యవస్థ లోకి వెళ్లాలనుకునే వారికి(యువత) ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నషిప్ లు నిర్వహిస్తుంది.

మౌలిక వసతులు నుంచి పారిశుద్ధ్యం వరకు అనేక అంశాలపై సున్నితంగా చర్చించగలరు. జె.పి గారు సామాజిక సేవలో చేస్తున్న కృషికి గాను ప్రముఖ సామాజిక సంస్థలు ఆయన అనేక పురస్కారాలుతో సత్కరించారు. జె.పి గారు లాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వారు కావడం మన తెలుగు ప్రజలకు గర్వకారణం.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading