📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Amararamam / అమరారామం

Google ad

అమరారామం లేక అమరావతి చారిత్రక ప్రసిద్ధిచెందిన శైవ పుణ్యక్షేత్రం. గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరుకు 35 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో ఉన్నది. ఇక్కడి స్వామివారు అమరేశ్వరుడు. అమ్మవారు బాలచాముండి. ఈ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. అమరారామంలో శివలింగం ఎత్తు 15 అడుగులు ఉంటుంది. శివలింగం చుట్టూ రెండు అంతస్తులు ఉంటాయి. అభిషేకాలు పైఅంతస్తు నుండి జరుపుతారు.

ఇక్కడి శివలింగం దేవతల రాజైన ఇంద్రునిచే ప్రతిష్టించబడినదంటారు. ఈ దేవాలయం కొద్ది ఎత్తులో ఉన్న క్రౌంచగిరి అనే శిల మీద ఉంటుంది. దేవత గురువు బృహస్పతి మరియు రాక్షసుల గురువు శుక్రాచార్యులు ఇక్కడ శివభగవానుడిని సేవించారు. ఈ దేవాలయానికి నాలుగు ప్రక్కలా ద్రవిడ శిల్పరీతిలో కట్టబడిన ఎత్తయిన గోపురాలున్నాయి. విజయనగర రాజు ఈ దేవాలయ అభివృద్ధికి కృషిచేశారు. అమరావతికి దగ్గరలో ఉన్న ఇప్పుడు ధరణికోట అని పిలువబడే ధాన్యకటకం శాతవాహనుల రాజధాని. 2వ శతాబ్ధంనుండి 3వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతం శాతవాహనుల పరిపానలో ఉంది. అమరావతిలో అమరావతి స్ధూపంగా పేరుపొందిన బౌద్ధస్థూపాన్ని మరియు గుడికి దగ్గరలో ఉన్న మ్యూజియంను కూడా చూడవచ్చు.

Google ad

ప్రయాణసదుపాయాలు : గుంటూరు పట్టణానికి 35 కి.మీ. దూరంలో అమరారామం ఉన్నది. గుంటూరు బస్‌స్టాండ్‌ నుండి నాన్‌స్టాప్‌ బస్సులు దేవాలయం వరకు వెళతాయి.
విజయవాడ నుండి కూడా బస్సు సౌకర్యం కలదు. దగ్గరలోని రైల్వేస్టేషన్లు గుంటూరు, మరియు విజయవాడ.

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading