
గురువాయురప్పన్ దేవాలయం ఇండియాలో ప్రసిద్ధిచెందినది. ప్రతి రోజూ వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ గుడి ని భూలోక వైకుంటం అంటారు. ఈ దేవాలయంలో దేముడు బాల గోపాలన్ కృష్ణుడి శిశువు . దేవాలయం వివిధ రకాల కుడ్య చిత్రాలతో కృష్ణుని లీలలను చూపుతూ అందంగా అలంకరించ బడి వుంటుంది. దేవాలయం కర్ణాటక సంగీతం మరియు అనేక సాంప్రదాయక నృత్య శిక్షణలను నేర్పిస్తోంది. ప్రతిరోజూ భక్తులకు రోజుకు రెండు మార్లు ఉచిత భోజనాలను పెడతారు. పెళ్ళిళ్ళు జరుగాతాయి. ఈ దేవాలయంలో ఏనుగులతో జరిగే శివేలి ఉత్సవాన్ని తప్పక చూడాలి. గురువాయూరప్పన్ దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం.
ఏనుగుల శిబిరం

ఏనుగుల శిబిరం గురువాయురప్పన్ దేవాలయంకి సుమారు ౩ కి.మీ. దూరంలో పున్నతుర్ కొట్టలో కలదు. ఈ ఏనుగుల శిబిరం ఇండియాలోనే అతి పెద్దది. ఇది పున్నత్తూరు రాజులకు చెందినది. ఈ శిబిరం సుమారు పది ఎకరాలలో వుంది సుమారు 60 ఏనుగులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ శిబిరం లోని ఏనుగులు గురువాయురప్పన్ దేవాలయంకు భక్తులచే ఇవ్వబడ్డాయి .ప్రసిద్ధిచెందిన గురువాయుర్ పద్మనాభన్ మరియు గురువాయుర్ కేసవన్ లు ఈ శిబిరానికి చెందినవే. ఇవి అధిక సంఖ్యలో జనాలను ఆకర్షిస్తాయి. దేవాలయ పండుగలలో మరియు ఊరేగింపులలో దేవతలను మోస్తాయి. అంతేకాకఈ ఏనుగులు దేవాలయం నిర్వహించే పందేలలో పాల్గొంటాయి. రేసులో గెలిచిన ఏనుగును గురువాయురప్పన్ విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు.
గురువాయూర్ లో అనేక పండుగలు, ఉత్సవాలు ఎంతో ఉల్లాసంగా జరుగుతాయి. హిందూ నెల కుంభ లో పదిరోజుల ఉత్సవం పండుగ జరుగుతుంది. కేరళ ప్రజలకు విష్ణు కొత్త సంవత్సరంలో మొదటి రోజు. కొత్త సంవత్సరం రోజున గురువాయూర్ దర్శన శుభసూచకంగా భావిస్తారు. అష్టమి రోహిణి మరో పండుగ. ఇది క్రిష్ణుడి పుట్టిన రోజు. ఎంతో భక్తితో ఆచరిస్తారు. దీనినే జన్మాష్టమి అని కూడా అంటారు. మండలం, కుచేల డే, చెంబై మ్యూజిక్ పండుగ, ఏకాదశి, వైశాఖ మరియు నారాయణీయం రోజులు, ఇతర పండుగలు.
Raju's Resource Hub