📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

నదులు

𝐊𝐮𝐦𝐚𝐫 𝐁𝐡𝐚𝐬𝐤𝐚𝐫 𝐕𝐚𝐫𝐦𝐚 𝐒𝐞𝐭𝐮 (Assam, India)

𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 Narendramodi of India 𝐢𝐧𝐚𝐮𝐠𝐮𝐫𝐚𝐭𝐞𝐬 𝐊𝐮𝐦𝐚𝐫 𝐁𝐡𝐚𝐬𝐤𝐚𝐫 𝐕𝐚𝐫𝐦𝐚 𝐒𝐞𝐭𝐮 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐭𝐡𝐞 𝐑𝐢𝐯𝐞𝐫 𝐁𝐫𝐚𝐡𝐦𝐚𝐩𝐮𝐭𝐫𝐚 on 14-02-2026, 𝐛𝐮𝐢𝐥𝐭 𝐚𝐭 𝐚 𝐜𝐨𝐬𝐭 𝐨𝐟 𝐚𝐫𝐨𝐮𝐧𝐝 𝐑𝐬 𝟑,𝟎𝟑𝟎 𝐜𝐫𝐨𝐫𝐞. The 6-lane extradosed Prestressed Concrete (PSC) bridge connects Guwahati with North Guwahati and is the first extradosed bridge in Northeast India. It will cut travel time between Guwahati-North Guwahati to […]

𝐊𝐮𝐦𝐚𝐫 𝐁𝐡𝐚𝐬𝐤𝐚𝐫 𝐕𝐚𝐫𝐦𝐚 𝐒𝐞𝐭𝐮 (Assam, India) Read More »

స్వర్ణముఖీ నది

స్వర్ణముఖీ నది జన్మస్ధానం తిరుపతి చంద్రగిరి మధ్యవున్న తొండవాడ సమీపంలోని కొండప్రాంతం. ఈ నది జీవనది కాదు. అక్టోబర్‌ నుండి డిసెంబర్‌ దాకా మాత్రమే ప్రవహిస్తుంది. ఈ నది భీమానది, కళ్యాణి నదులలో కలిసిపోయి తొండవాడలో త్రివేణిసంగమంగా మారి ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి ఈ నదీతీరంలోనే ఉన్నది.

స్వర్ణముఖీ నది Read More »

వంశధారా నది

వంశధారా నది జన్మస్ధానం ఒరిస్సాలోని నియమగిరి పర్వతపానువు. నది మొత్తం పొడవు 230 కి.మీ. 150 కి.మీ. ఒరిస్సాలో ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. వంశధారా నది శ్రీకాకుళం జిల్లాకు ప్రధాన నీటివనరు. శ్రీకాకుళం జిల్లాలో గొట్టాల వద్ద ఈ నదిమీద ఆనకట్ట నిర్మించబడినది.

వంశధారా నది Read More »

మూసీనది

వెలికొండలోని డొక్కశ ఈ నది జన్మస్థానం. మార్కాపూర్‌, దర్శి, పొదిలి, కొండేపి, కోరు ఉప్పపాడు, కొత్తపట్నం మండలాల గుండా ప్రవహించి కొత్తపట్నంలోని మదనూరు మండలం దగ్గర బంగాళాఖాతంలో కుస్తుంది.

మూసీనది Read More »

సీలేరు

శబరి నదికి ఉపనది. మాచ్‌కుంద్‌ అనికూడా ఈ నదిని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకనుమమలో పుట్టి ఒరిస్సా సరిహద్దుగుండా ప్రవహిస్తుంది. ఒరిస్సా సరిహద్ధులో జాలాపుట్‌ రిజర్వాయర్‌ ఈ నదిమీద కట్టబడినది. తరువాత ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌, ఒరిస్సా సరిహద్దులలో శబరినదిలో కలుస్తుంది.

సీలేరు Read More »

శబరి

శబరి గోదావరి నది యొక్క ముఖ్య ఉపనది. ఒరిస్సా రాష్ట్రంలో పుట్టి చత్తీస్‌గడ్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి పశ్చిమగోదావరి, కూనవరం దగ్గర గోదావరిలో కలుస్తుంది

శబరి Read More »

పెన్నా నది

పెన్నా నది (పెన్నార్‌, పెన్నేరు) కర్నాటక రాష్ట్రంలో (చికబల్లాపూర్‌ జిల్లా) కోలార్‌ సమీపంలో నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండలో పుట్టి నంది శ్రేణులగుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం నుండి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. అక్కడనుండి నెల్లురు జిల్లాలో ప్రవేశించి నెల్లూరుకు ఈశాన్యంగా ఉన్న ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా నది మొత్తం పొడవు 597 కి.మీ.

పెన్నా నది Read More »

కొరింగానది

తూర్పుగోదావరి జిల్లాలోని ఈ నది గౌతమి నదియొక్క ఉపనది గౌతమి నది ఉపనది ఆత్రేయ నదికి ఉపనది. గుండ్లకమ్మ : ఈ నది కేవల వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది. జన్మస్థానం తూర్పుకనుమలోని నల్లమల కొండలు. అర్ధవీడు, ప్రకాశం జిల్లాలలో నుండి ప్రవహిస్తుంది. కొండమీద నుండి వచ్చే అనేక కాలువలను కలుపుకొని కంబంలో ప్రవేసిస్తుంది. తరువాత మార్కాపురం మరియు కోరమండలం తీరం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నల్లమల పర్వతాలలో పుట్టే నదులలో గుండ్లకమ్మ పెద్ద నది. గజపతులు కాలంలో

కొరింగానది Read More »

నాగావళి నది

నాగావళి నది ఒరిస్సా రాష్ట్రంలోని కహంది జిల్లాలోని తూర్పుకనుమలలో ప్రారంభమవుతుంది. నది మొత్తం పొడవు 256 కి.మీటర్లు. అందులో 161 కి.మీ. ఒరిస్సా రాష్ట్రంలో ప్రవహిస్తుంది. 2 కి.మీ. ఒరిస్సా ఆంధ్రా సరిహద్దులో, 93 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది.విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో నాగావళినది ప్రవహిస్తుంది. నాగావళి నది మీద తోటపల్లి మరియు నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించబడినవి. నాగావళి నది శ్రీకాకుళం పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఉన్న కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో

నాగావళి నది Read More »

తుంగభద్ర నది

తుంగభద్ర కృష్ణానదికి ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడ్డది. ఈ నది జన్మస్థం కర్నాటకలోని పడమటి కనుమలు. తుంగ, భద్ర అనే రెండు నదులుగా ప్రవహిస్తూ కర్నాటకాలోని షిమోగా జిల్లా కూడ్లీ వద్ద రెండునదులు కలసి తుంగభద్రగా పేరుపొందింది. అక్కడనుండి కర్నాటకలోని శృంగేరీపీఠం, హంపీ మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లా, కౌతాం మండలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. కర్నూలుజిల్లా మంత్రాలయం గుండా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసి పోతుంది. తుంగభద్రా నది ఆంధ్రప్రదేశ్‌లోని

తుంగభద్ర నది Read More »

కృష్ణా నది

కృష్ణానది జన్మస్థానం పశ్చిమ కనుమలలోని మహారాష్ట్రలో (జార్‌ గ్రామం నుండి వెయ్‌ తాలూకా, సతారా జిల్లా) మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్‌ పర్వతశ్రేణిలో చిన్న ధారగా జన్మించి అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్నాటక తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి దివిసీమలోని హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 1400 కి.మీ. ఈ నదిని కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని నదులో 4వ పెద్దనది. మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ నది కొయునా,

కృష్ణా నది Read More »

గోదావరి నది

భారతదేశంలోని గంగ, సింధునది తరువాత అతి పెద్ద నది గోదావరి. ఈ నది జన్మస్థానం మహారాష్ట్రలోని నాశిక్‌ దగ్గర త్రయంబకేశ్వరం వద్ద అరేబియా సముద్రానికి 80 కి.మీ దూరంలో ఉన్నది. మహారాష్ట్రలో నుంచి తెంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లా, బాసర వద్ద ప్రవేశిస్తుంది. ఆ తరువాత నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం గుండా ప్రవహించి తరువాత తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలలో ప్రవహించి పశ్ఛిమ గోదావరి, నర్సాపూర్‌ దగ్గరలో బంగాళాఖాతంలో కలుస్తుంది. . రాజమండ్రి, ధవళేశ్వరం నుండి ఈ నదిని

గోదావరి నది Read More »

గోదావరి నది

గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం

గోదావరి నది Read More »

Advertisement
Scroll to Top