📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

గురజాడ అప్పారావు

Google ad

ఈయన ఆ రోజు ల్లో చక్కటి భాషలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం సాహితీ లోకం లో ఒక ప్రత్యేకమైనది. ఈ కన్యాశుల్కం నాటకం ఎంత గానో ప్రసిద్ధి చెందినది. ఇది నిజంగా సుస్థిర స్థానం దక్కించుకుంది నిజంగా ఈ నాటకం లో గిరీశం మధురవాణి రామప్పంతులు వంటి పాత్రలు ఎంత గానో ప్రఖ్యాతి చెందాయి.
 
ఈయన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం లో జన్మించారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యం లో వాడుక భాష ఒర వడికి కృషి చేశారు. ఈయనకు కవి శేఖర అనే బిరుదు కూడా వచ్చింది రచయితగా సంఘ సంస్కర్తగా సాహిత్యకారుడిగా హేతువాదిగా అభ్యుదయ కవి గురజాడ ప్రసిద్ధి చెందారు. తెలుగు భాష మహా కవి గా ప్రజల మన్ననలను పొందాడు.
 
గురజాడ అప్పారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన రచనలు నిజంగా సమాజంలో మార్పు తెచ్చాయి. గిడుగు రామ్మూర్తి గారు తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ఆ తర్వాత ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు. ప్రబలంగా వున్న కన్యాశుల్కం వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. నిజంగా అప్పటి దురాచారాల పై నాటకం వ్రాసి దానినే కథావస్తువుగా తీసుకుని నాటకపు తొలి ప్రదర్శన కూడా జరిపించారు. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. ఆ తర్వాత 1909 లో రెండవ కూర్పును కూడా ఆయన రచించారు.
 
20వ శతాబ్దంలో తొలి నాళ్లలో జరిగిన వ్యవహారిక భాష ఉద్యమం లో గురుజాడ అప్పారావు తన సహాధ్యాయి అయిన గిడుగు రామ్మూర్తి గారి తో కలిసి పోరాటం చేసారు. వీరిద్దరూ పత్రికల్లో సభల్లో మద్రాస్ విశ్వవిద్యాలయం లో గ్రాంథిక భాషా వాదుల తో అలసట ఎరుగకుండా తలపడ్డారు ఈ భాషోద్యమం వ్యవహారిక భాషోద్యమానికి వినియోగ పడింది.
 
” దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్”
 
అంటూ ఆయన రాసిన ప్రముఖ గేయం ఎందరో మందిని బాగా ఆకర్షించింది. ఈయన రాసిన గేయాల్లో పుత్తడిబొమ్మ పూర్ణమ్మ సుప్రసిద్ధ గేయం…
 
” కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ”
 
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది దీన్ని వృత్తాంతం కూడా కన్యాశుల్కం దురాచారమే.
 
ఇలా గురుజాడ అప్పారావు పూర్ణమ్మ , నీలగిరి పాటలు, ముత్యాలసరాలు, కన్యక, సుభద్ర, సంస్కర్త హృదయం, మతము విమతము ఇలా అనేక రచనలు చేశారు గురజాడ-వెలుగుజాడ. చక్కటి రచనల తో గురజాడ సమస్యల తో అందించారు ఈ రచనలని.
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading