Logo Raju's Resource Hub

విశ్వనాధ సత్యనారాయణ

Google ad

ఆధునిక యుగంలో మొదటి తెలుగు మహాకవి, జ్ఙానపీఠ్ అవార్డు అందుకున్న మహాకవి. కవిసామ్రాట్, పద్మభూషణ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులతో సత్కరింపబడిన వాడు. 1966 నుండి 1976 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి. కవిగా, కథకుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడుగా, మహావక్తగా, కావ్యగాయకుడుగా సుమారు 60 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలను అలరించారు.

కృష్ణాజిలా నందమూరు గ్రామంలో శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు 1895 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. విశ్వనాథ గారు రచించిన వాటిలో వేయి పడగలు నవలకు ఆంధ్ర విశ్వకళాపరిషత్ నిర్వహించిన పోటీలో బహుమతి రాగా, శ్రీమద్రామాయణ కల్పవృక్షమునకు 1970 సంవత్సరంలో జ్ఙానపీఠ అవార్డు వచ్చింది. స్వర్గానికి నిచ్చెనలు, చెలియలికట్ట, ఆంధ్రప్రశస్తి, కోకిలమ్మ పెళ్లి, కిన్నెరసాని పాటలు, ఏకవీర గిరికుమారుని ప్రేమగీతాలు, భ్రమరగీతాలు, మధ్యాక్కరలు విశ్వనాథగారి రచనలతో ప్రధానమైనవి.

వరలక్ష్మీ త్రిశతి ఆయన వ్రాసిన విలాపకావ్యం. చారిత్రకములు, సామాజికముల పౌరాణికాలు కలిపి దాదాపు 66 నవలలను, 20 వేల పైగా పద్యాలను వివిధ పత్రికలలో వందలకొద్దీ ఖండ కావ్యాలను రచించారు.

సంస్కృత భాషలో ‘అమృత శర్మిష్టమ్’, గుప్త పాశుపతమ్’ వంటి నాటకాలను రచించారు. 1936 సం.నుండి 1959 సం. వరకు విజయవాడ ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రశాఖాధిపతిగా పనిచేశారు. తరువాత కరీంనగర్ కలాశాల ప్రిన్స్ పాల్ గా పనిచేసి 1963 సంలో పదవీ విరమణ చేశారు. 1976 అక్టోబర్ 18వ తేదీన గుండె జబ్బుతో కీర్తిశేషులైనారు.

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading