తెలుగు కవులు

కందుకూరి వీరేశలింగం పంతులు – సంస్కరణ శీలి ..సంస్కారధీశాలి

ఆయనో సాహితీ శిఖరం.. సంస్కరణలకు ప్రతిరూపం.. అఖండ గోదావరి తీరాన ఊపిరిపోసుకుని.. తెలుగు జాతి జాగృతికి ఊపిరిలూదిన చైతన్యఝరి.. కొత్త వెలుగులకు తెరదీసి.. సమాజాన్ని నిద్రలేపి.. మెలకువ దారుల్లో నడిపించిన నవయుగ వైతాళికుడు.. మూఢ నమ్మకాలు.. సాంఘిక దురాచారాలపై అలుపెరగక పోరాడిన యోధుడు.. తెలుగునాట సామాజిక, సాహిత్య రంగాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన బహుముఖ సాహితీ పండితుడు.. మగువల అభ్యున్నతికి శ్రమించిన స్త్రీ జనోద్ధారకుడు.. యావదాస్తిని సమాజ అభ్యున్నతికి ధారపోసిన త్యాగధనుడు.. శతాబ్దాల ముందుచూపున్న దార్శనికుడు.. …

కందుకూరి వీరేశలింగం పంతులు – సంస్కరణ శీలి ..సంస్కారధీశాలి Read More »

విశ్వనాధ సత్యనారాయణ

ఆధునిక యుగంలో మొదటి తెలుగు మహాకవి, జ్ఙానపీఠ్ అవార్డు అందుకున్న మహాకవి. కవిసామ్రాట్, పద్మభూషణ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులతో సత్కరింపబడిన వాడు. 1966 నుండి 1976 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి. కవిగా, కథకుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడుగా, మహావక్తగా, కావ్యగాయకుడుగా సుమారు 60 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలను అలరించారు. కృష్ణాజిలా నందమూరు గ్రామంలో శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు 1895 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. విశ్వనాథ గారు రచించిన వాటిలో వేయి పడగలు …

విశ్వనాధ సత్యనారాయణ Read More »

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే)

జ్ఙానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు కవి, సినిమా గేయ రచయిత నారాయణ రెడ్డి. ఈయన 1931 నవంబర్ 15వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జన్మించారు. ఉస్యానియా యూనివర్శిటీలో విద్యాభ్యాసం సాగించి ‘‘ఆధునికాంధ్ర కవితత్త్వం పై పరిశోధనలు జరిపి ధీసిస్ వ్రాసినందువలన డాక్టరేట్ బిరుదు లభించినది. 1954సం .లోఈయన రచించిన నవ్వని పువ్వు 1954లో అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు, నాగార్జునా సాగరము, రామప్ప వంటి సంగీత రూపకాలు, దివ్వెల మువ్వలు, విశ్వనాధుడు వంటి …

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే) Read More »

రాయ్రపోలు సుబ్బారావు

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని’’అనే సుప్రసిద్ధ గేయాన్ని వ్రాసిన రాయ్రపోలు సుబ్బారావు 1914 సం.లో శాంతినికేతనంలో రవీంద్రనాథ్ టాగోర్ అంతేవాసిగా చదువుకున్నాడు. భావకవిత్వం ప్రారంభించి అశువుగా చెప్పసాగాడు. భజగోవిందం శ్లోకాలను, సౌందర్యలహరి శ్లోకాలను తెలుగులోనికి అనువదించాడు.ఉమర్ ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషు నుండి మధుకలశంగా తెలుగులోనికి అనువాదం చేశారు. ఈయన చేతిలో గోల్డ్ స్మిత్ రచన హెర్మిట్ ను లలిత గానూ టెనిసన్ రచన డోరాను అనుమతి గానూ తెలుగు కావ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. తృణకంకణం …

రాయ్రపోలు సుబ్బారావు Read More »

మొల్ల

అతుకూరి మొల్ల (1440-1530) కవయుత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును వ్రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శైలి చాలా సరళమైనదని మరియు రమణీయమైనదని ప్రసిద్ధి. కడపజిల్లా గోపవరం ప్రాంతానికి చెందినదని అంటారు. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఇక్కడ ఉన్నది. గ్రామస్తులు ఈ బండకు పూజలు కూడా చేస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరు గ్రామానికి చెందివుందటారని అంటారు. మొల్ల …

మొల్ల Read More »

అన్నమయ్య

అన్నమయ్య లేక తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదట వాగ్గేయకారుడు. వాగ్గేకారుడుకి అర్థం సాధారణ భాషలో గేయాలను కూర్చేవాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య జివితకాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో …

అన్నమయ్య Read More »

బమ్మెర పోతన

బమ్మెర పోతన 15వ శతాబ్ధంలో వరంగల్‌ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ, కేశన దంపతులకు జన్మించాడు. వ్యవసాయం చేసేవాడు. ప్రధమ రచన భోగినీ దండకం. సింగభూపాలుడు అనే రాజుకు అంకితం చేశాడు. తరువాత తన రచనలన్నీ భగవతర్పణం గావించాడు. బమ్మెర పోతనపోతన కవి, కవిసార్వభౌముడైన శ్రీనాధుని బంధువని అంటారు. శ్రీరాముని ఆనతి మేరకు సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతాన్ని ”ఆంధ్రమహాభాగవతము” అనే పేరున తెనిగించాడు. పోతన ఇతర రచనలు వీరభద్ర విజయము, నారాయణ శతకం మొదలగునవి. …

బమ్మెర పోతన Read More »

శ్రీనాధుడు

శ్రీనాధ మహాకవి (1365-1441) 15వ శతాబ్ధంలో కాల్పట్టణం అనే గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు భీమాంబ, మారయ్య దంపతులు. కవిత్రయం తరువాత సమకాలికుడైన కవి. కొండవీటి రాజైన పెదకోమటి వేమారెడ్డి దగ్గర విద్యాశాఖాధికారిగా పని చేశాడు. ప్రధమార్థంలో చాలా విలాసవంతమైన జీవితం గడిపాడు చివరి దశలో బీదరికంతో బాధపడ్డాడు. విజయనగర రాజైన రెండవ దేవరాయల కాలంలో డిండిమభట్టు అనే పండితునితో వాదించి నెగ్గి కవిసార్వభౌమ అనే బిరుదు పొందాడు. శ్రీనాధుని రచనలు శృంగారనైషధం, పల్నాటి వీరచరిత్రము, నందనందన చరిత్రము, …

శ్రీనాధుడు Read More »

ఎఱ్ఱన

ఎఱ్ఱన 14వ శతాబ్ధంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు పోతమ్మ సూరన్న దంపతులు. కవిత్రయంలో చివరివాడు. నన్నయ్య వదలివేసిన అరణ్యపర్వంను పూర్తిచేశాడు. రెడ్డిరాజయిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో (1325-1353) కవిగా ఉన్నాడు. సంస్కత గంథ్రాలైన హరివంశము, రామాయణములను తెలుగులో వ్రాసి తన రాజైన ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. నరసింహపురాణమును రచించాడు. ఎఱ్ఱనను ఎఱ్ఱాప్రగడ అని కూడా పిలుస్తారు.

తిక్కన

తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకడు. క్రీ.శ. 1205 నుండి 1288 వరకు జీవించాడు. తిక్కన నన్నయ మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మహాభారతంలోని అరణ్యపర్యమును వదలి మిగతా 15 పర్యాలు రచించాడు. జన్మస్ధలం గుంటూరు (గుంటూరు జిల్లా). కాకతీయుల కాలం నాటివాడు. అప్సటి నెల్లూరు రాజు మనుమసిద్ధి దగ్గర ముఖ్యమంత్రిగా చేశాడు. దాయాదుల వలన రాజ్యం కోల్పోయిన మనుమ సిద్ధికి, కాకతీయ మహారాజు గణపతిదేవుని సహాయంతో తిరిగి రాజ్యాన్ని కట్టబెట్టాడు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే …

తిక్కన Read More »

నన్నయ

పంచమ వేదమైన వ్యాసభారతాన్ని తెలుగులో వ్రాయుటకు పూనుకొని అందులోని ఆదిసభా పర్యాలను పూర్తి చేసి అరణ్య పర్వంలోని చతుర్థాశ్యాసంలో 141వ పద్యం వరకు మాత్రమే పూర్తిచేసి పరమపదించాడు. ఆ తరువాత భాగాలను తిక్కన, ఎఱ్ఱనలు పూర్తి చేసారు. అందుకే వీరి ముగ్గురిని కవిత్రయం అంటారు. నన్నయ జన్మస్థలం పశ్చిమ గోదావరిలోని తణుకు. చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని (క్రీ. శ. 1022-1063) ఆస్థానకవి. నన్నయకు ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలవు. ఇతర రచనలు ఆంధ్రశబ్ధ చింతామణి.

గురజాడ అప్పారావు

ఈయన ఆ రోజు ల్లో చక్కటి భాషలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం సాహితీ లోకం లో ఒక ప్రత్యేకమైనది. ఈ కన్యాశుల్కం నాటకం ఎంత గానో ప్రసిద్ధి చెందినది. ఇది నిజంగా సుస్థిర స్థానం దక్కించుకుంది నిజంగా ఈ నాటకం లో గిరీశం మధురవాణి రామప్పంతులు వంటి పాత్రలు ఎంత గానో ప్రఖ్యాతి చెందాయి.   ఈయన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం లో జన్మించారు. …

గురజాడ అప్పారావు Read More »

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, …

తాళ్ళపాక అన్నమాచార్యులు Read More »