Logo Raju's Resource Hub

అరుణ్ జైట్లీ

Google ad

అరుణ్ జైట్లీ(1952–2019)

అరుణ్ జైట్లీ ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవాది. జైట్లీ డిసెంబర్ 28, 1952లో ఢిల్లీలో ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ, రత్న ప్రభ దంపతులకు జన్మించారు. జైట్లీ విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలో ఉన్న ప్రముఖ విద్య సంస్థల్లో పూర్తి చేశారు, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యను పూర్తి చేసి అనంతరం లాయర్ గా పని చేసి అతితక్కువ కాలంలోనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేసి అనంతర కాలంలో సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో పేరు నమోదు చేసుకుని 2014 వరకు పలువురు ప్రముఖులు తరుపున వాదించారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఎబివిపి తరుపున విద్యార్థులు పరిషత్ కు నాయకుడిగా ఎన్నికయ్యి ఆరోజుల్లో సంచలనం సృష్టించారు, ఎందుకంటే అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం ఎస్.వైఫ్.ఐ ఆధీనంలో ఉన్న విద్యార్థుల పరిషత్ ఎబివిపి కైవసం చేసుకుంది.1990లలో బీజేపీ పార్టీలో చేరిన నాయకుల్లో జైట్లీ అందరికంటే చిన్న వయస్కులు, 2000లో బీజేపీ పార్టీ తరుపున రాజ్య సభకు ఎన్నికయ్యి వాజపేయి గారి మంత్రివర్గంలో సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రిగా, న్యాయ శాఖ మంత్రిగా, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. 2006లో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యి 2009లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా 2014 వరకు ఎన్నికయ్యారు.2014లో నరేంద్రమోడీ మంత్రివర్గంలో రక్షణ, ఆర్థిక శాఖల మంత్రిగా 2019 వరకు పనిచేసారు.ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా మరియు పార్టీలో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి, అలాగే గోద్రా అల్లర్ల కారణంగా మోడీ మీద పార్టీలో వ్యక్తమైన వ్యతిరేకతను తొలగిచేందుకు కృషి చేసారు . 2002లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేసారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపికపై ముందుగా మీడియాలో చర్చలకు తెరతీశారు.

దేశ రాజకీయాల్లో జైట్లీ పాత్ర ప్రత్యేకమైన పాత్ర పోషించారు, పార్టీలో ఉన్న లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఎంపిక వివరాలు ఎప్పటికప్పుడు గోప్యంగా ఉంచడానికి కృషి చేయడమే కాకుండా ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు, 2006లో దక్షిణ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడంలో ముఖ్య పాత్ర పోషించారు. దేశంలో ఆర్థిక మరియు న్యాయ శాఖల మీద సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తుల్లో ఒకరు.

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading