📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

యోగి అదిత్యనాథ్

Google ad

యోగి అదిత్యనాథ్(1972)

యోగి అదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్. ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(ప్రస్తుతం ఉత్తరాఖండ్) లోని పౌరి గర్వాల్ జిల్లా పంచుర్ గ్రామంలో జన్మించారు. గర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి బియస్సీ గణితంలో పూర్తి చేసి పోస్టుగ్రాడ్యుయేషన్ లో చేరి మధ్యలో నే ఆపేశారు.

Google ad

1990లో రామాజన్మభూమి ఉద్యమం లో పాల్గొన్నారు, ఉద్యమ నిర్వహించిన గోరఖ్ పూర్ ఆలయ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ గారి పరిచయం అయినను సాధువు గా మారడానికి ఉపకరించింది, 1993లో అవైద్యనాథ్ గారి పర్యవేక్షణలో సన్యాసం స్వీకరించి “యోగి అదిత్యనాథ్” గా పేరుతో గోరఖ్ పూర్ మఠంలో చేరారు ,2014లో తన గురువు నుంచి మఠం మరియు గోరక్ పూర్ ఆలయ పీఠాధిపతి గా పూర్తి స్థాయిలో నియమితులయ్యారు.

Google ad

1998,1999,2004,2009,2014లలో గోరఖ్ పూర్ నుంచి వరుసగా ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. మొదటి సారి లోక్ సభకు ఎన్నికైన సమయంలో ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే.

Google ad
Google ad

2017లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో, ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరించమని కోరారు, ఆ విధంగా భాద్యతలు స్వీకరించి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నారు.ముఖ్యమంత్రి గా ఎన్నికైన తరువాత 36 శాఖల భాద్యతలు మూడు నెలలు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి గా రాష్ట్ర పరిపాలన లో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత సాధించిన వ్యక్తి యోగి గారు.

రాజకీయాల్లోకి రాకముందు గోరఖ్ పూర్ పట్టణంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకున్నారు, “హిందూ యువవహిని” అనే సంస్థను ఏర్పాటు చేసి పూర్వాంచల్ ప్రాంతంలో హిందువుల మీద జరుగుతున్న దాడులను ఎదురించి వారికి అండగా నిలిచారు. పూర్వాంచల్ ప్రాంత ప్రజానీకానికి ఆయన నడిచే ప్రత్యేక్ష దైవం ఆయన మాట వేదవాక్కు.ఆ ప్రాంతంలో మఠం తరుపున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే చేపడుతున్నారు.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading