
ఉత్తరదేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నాట్యం కథక్. రాధాకృష్ణుల గాధలను ప్రదర్శించటం ద్వారా శృంగార రసాన్ని అందిస్తుంది. రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.
పూర్వకాలంలో కథకులు పురాణాల నుంచీ ఇతిహాసాలకు చెందిన కథలను వేదికపై చెప్పడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమించింది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో ఈ కథకులకు సంబంధించిన ప్రస్తావన ఉంది.
Google ad
Google ad