
భరతనాట్యం దక్షిణ భారతేదేశపు ఒక శాస్త్రీయ నృత్య విధానం. భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. ఇందులో అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలుంటాయి. ఈ నాట్యం ఎక్కువగా దేవాలయాలలో ప్రదర్శించేవారు.
భావం, రాగం, తాళం – ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు కఠినంగా ఉంటాయి.
పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడి ఉన్నాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని “తంజావూరు”లో ‘నట్టువన్నులు’ మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు. ఈ నృత్యంలో విస్తృతమైన భంగిమలు ఈ ధరించే వస్త్రాలు అత్యంత మనోహరం గా ఉండాలి. శృంగారమేఈ నృత్యానికి మూలం. మగవారు కూడా ఈ నృత్యం చేస్తారు. కానీ స్త్రీలు మాత్రమే ఈ నృత్యంలో నిష్ణాతులుగా పేరుపొందారు
ప్రముఖ భరతనాట్య కళాకారులు
రుక్మిణీ అరండేల్, బాలసరస్వతి, యామిని కృష్ణమూర్తి, మృణాళిని సారాబాయి, పద్మా శుబ్రహ్మణ్యం, వైజంతిమాలా
Raju's Resource Hub