Logo Raju's Resource Hub

బొబ్బట్లు

Google ad

కావాలిసిన పదార్ధాలు

కిలో మైదాపిండి
ముప్పావు కిలో బెల్లం
కొద్దిగా నూనె
10 గ్రాముల యాలకులు
100 గ్రాముల నెయ్యి
అరకిలో పచ్చిశెనగ పప్పు.

తయారుచేసే పద్ధతి :
పచ్చిశెనగపప్పును శుభ్రంగాకడిగి కొద్దిగానానబెట్టి మొత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన శెనగ పప్పులో బెల్లం ముక్కలు, యాలకులు కలిపి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిజావగా ఉండకూడదు. గట్టిగా ఉండాలి.

మైదాపిండిలో తగినంత ఉప్పు నీరు, కొద్దిగానూనె కలిపి పూరీల పిండిమాదిరిగా కలుపుకోవాలి. మైదా పిండిని ఉండగా చేసే మధ్యలో కొద్దిగా శెనగపిండి మిశ్రమాన్ని ఉంచి చిన్న చపాతీలాగారోల్ చేసుకోవాలి. లేదా మైదాపిండిని పూరీల లాగా ఒత్తుకొని రెండు పూరీల మధ్య శెనగపిండి మిశ్రమాన్ని సమానంగాపరచి అంచులు గట్టిగా ఒత్తుకోవాలి.

Google ad

ఇపుడువీటిని పెనంమీద నెయ్యి లేదా నూనె వేసి వేడెక్కిన తరువాత రెండువైపులా కాలనివ్వాలి. అంతే రుచికరమైన బొబ్బట్లు తయారవుతాయి.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading