📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

WORLD CANER DAY – 4th FEBRUARY

Google ad

అత్యాధునిక చికిత్సలు ఎన్నివున్నా ….ఆరోగ్యకరమైన జీవనవిధానంతోనే క్యాన్సర్‌ ముప్పు తప్పుతుంది…..

క్యాన్సర్‌ వ్యాధి ప్రాణాంతకం. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో పెను ప్రమాదం అన్న భావనలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. కాని ప్రారంభ దశలో ఉన్నపుడే తగు చికిత్సా పద్ధతులను ఖచ్చితంగా అవలంభించడం వలన చాలామటుకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. నిర్లక్ష్యం వీడితే: అన్ని ప్రాంతాలలోనూ క్యాన్సర్‌ ప్రభావం దాదాపు ఒకే రకంగా ఉంది. చాలా చోట్ల అవగాహనా రాహిత్యం, ఆరంభంలో వైద్యుల్ని సంప్రదించడంలో చేసే ఆలస్యం, సమస్య చిన్నదే కదా అన్న ధోరణి ప్రాణాపాయాన్ని అధికం చేస్తున్నాయి అంటున్నారు.

Google ad

ముందు జాగ్రత్తలు ముఖ్యం : క్యాన్సర్‌ కేవలం పెద్ద వయసువారికే వస్తుందన్నది నిజం కాదంటరు శాంత. ఏ వయసు వారయినా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పరిశుభ్రత పాటించకపోవటం, ధూమపానం చేస్తున్న వారికి సన్నిహితంగా ఉండి పొగను పీల్చడం, కొన్ని ప్రాంతాల్లో మహిళలూ పొగాకూ తీసుకోవడం.. వంటివన్నీ క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి. అయితే , వయసు పెరిగే కొద్దీ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం తప్పనిసరిగా పాటించాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్‌ఫుడ్‌లకు బదులుగా పోషకాహారం తీసుకోవడం అన్నివిధాలా మేలు అంటున్నారు.

Google ad

అంతేకాదు, నేడు పాఠశాలల్లో క్రీడా మైదానాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఇంటి నుంచి అతిస్వల్ప దూరం వెళ్లడానికిక్కూడా వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో శరీరానికి సహజ సిద్ధమైన నడక, వ్యాయామం వంటివి నిత్య జీవితంలో తగ్గిపోతున్నాయి. అది ఎన్నిరకాల శారీరక సమస్యలకు గురిచేస్తుందో ఊహించలేకపోతున్నారు అంటూ ముందు జాగ్రత్త అవశ్వకతను విశదీకరించారు.

Google ad
Google ad

అవగాహనతో ఆరోగ్యమే.. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కి సంబంధించి చాలామంది మహిళలకు అవగాహన లేదు సరికదా అపోహలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో మార్పు రావాలి అన్నారామె. ఆలస్యంగా వివాహం చేసుకోవటం, పిల్లల్ని కనడం, వారికి తల్లిపాలు పట్టకపోవడం, ఎక్కువకాలం గర్భనిరోథక మాత్రలను వాడటం, పట్టణ ప్రాంతాల్లో అధికంగా జరుగుతోంది. ఇవి రొమ్బు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంచుతాయి. కనీసం ఆరు నెలల పాటయినా పిల్లలకు పాలివ్వడం తల్లికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక పెద్ద సంఖ్యలో గ్రామీణ మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో సతమతమవుతున్నారు.

చాలామంది దాని బారిన పడ్డట్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం ప్రధాన సమస్య. పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండదు. నెలసరి సమయంలో శానిటరీ న్యాప్‌కిన్లు వాడాలి. మల, మూత్ర విసర్జన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిన్న చిన్న పద్ధతులు గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ నుంచి రక్షణను ఇస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న దీనిబారిన పడితే అది ప్రాణాంతకమనేనని చాలామంది ప్రాణాలపై ఆశలు వదులుకొంటారు. ఇది సరికాదు. ఆరంభదశలో దీనిని గుర్తించగలిగితే కోలుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. అక్కడి దాకా ఎందుకు ఏడాదికొకసారి పాప్‌స్మియర్‌ పరీక్షను చేయుంచుకోవడం వల్ల దానిని ముందే గుర్తించవచ్చు.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading