Logo Raju's Resource Hub

Draksharamam / ద్రాక్షారామం

Google ad

ఈ పవిత్ర క్షేత్రం పంచారామాలలో మెదటిది. మరియు త్రిలింగ క్షేత్రాలలో ఒకటి . ద్రాక్షారామం(తూర్పుగోదావరి). దక్షప్రజాపతి యజ్ఞం చేసిన పుణ్యస్థలం మరియు పార్వతీదేవి జన్మస్థలం. సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అలాగే ద్రాక్షారామం కూడా ప్రకాశిస్తుందని చెబుతాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. శివలింగం సగం నలుపు రంగులో సగం తెలుపు రంగులో ఉంటుంది. శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామివారిని అర్చించడానికి సప్తర్షులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని అందుకే అంతర్వాహినిగా ప్రవహించే గోదావరిని సప్తగోదావరి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. శాతవాహనుల రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి అన్న ప్రాకృత భాషా కావ్యంలో వ్రాశారు.

భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర శివలింగాలు దర్శనమిస్తాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిక్కులో ఉన్న గోపురాలను ఒక్కో అమ్మవారు పర్వవేక్షిస్తున్నట్లుగా స్థలపురాణం వివరిస్తుంది. భీమేశ్వరునికి ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని చెబుతారు. తూర్పున కోలం, పడమరన వెంటూరు, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయాన దంగేరు, నైరుతిన కోరుమిల్లి, పశ్చిమాన సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమళ్ళలో ఈ అష్ట సోమేశ్వరాయాలున్నవి.

ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబా దేవి. శ్రీచక్రంతో విరాజిల్లుతుంది. ఇక్కడ స్వామివారి దేవేరి పార్వతీదేవి, అష్టాదశ పీఠాలో 12వ పీఠం మాణిక్యాంబా పీఠంగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో శ్రీడుండి విఘ్నేశ్వరుడు, అశ్వర్థనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నటరాజు, వీరభద్రుడు, మహిషాసురమర్ధని, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఆంజనేయస్వామి వారిని కూడా దర్శించవచ్చు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. శ్రీనాధ కవిసౌర్వభౌముడు తన భీమేశ్వరపురాణంలో ఈ క్షేత్రం గురించి విశేషంగా వర్ణిస్తాడు. దుష్యంతుడు, నలమహారాజు, భరతుడు, నహుషుడు ఈ ఆలయాన్ని దర్శించారని వ్రాశాడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమేశ్వరుడు క్రీ॥శ॥ 7-8 శతాబ్దాల మధ్య కట్టించాడు. ఇంకా అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి వివరించారు. ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.

ఆలయం తెరచే వేళలు :
ప్రతిరోజు ఉదయం గం.06-00 ఆలయం తెరవబడుతుంది.
ఉ.గం.06-00 నుండి మ॥ గం.12.00వరకు సర్వదర్శనం, అభిషేకాలు, అర్చనలు
మ.గం.12-15 ని. నుండి సా.గం.03-00 వరకు విరామం
సా। గం.03-00 నుండి రాత్రి గం.08-00 గంట వరకు సర్వదర్శనం, అభిషేకాలు, అర్చనలు
రాత్రి గం.08-00 కు గుడి మూసివేస్తారు.

Google ad

ఎలా వెళ్లాలి ? : ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉన్నది. రాజమండ్రికి 62 కి.మీ. కాకినాడకు 32 కి.మీ దూరంలో ఉంది. రాజమండ్రి నుండి బస్సులలో వెళ్లవచ్చు.

అయితే ఈ ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామము ఇది కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలోని రాజమహేంద్ర వరం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది ద్రాక్షారామం చూడదగ్గ ప్రదేశం ఇది మండల కేంద్రమైన రామచంద్రాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది . ద్రాక్షారామం లో శ్రీ భీమేశ్వరుడు ఎనిమిది దిక్కుల్లో 108 శివలింగాలను స్వయంగా ప్రతిష్టించాడని విశ్వసించబడుతుంది. తూర్పున కోలంక పడమర వెంటూరు దక్షిణాన కోటపల్లి ఉత్తరాన ఆగ్నేయంలో దంగేరు నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ఇక్కడ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి అలానే ఇక తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ దిశగా ఉన్న ఒక్కొక్క గాలి గోపురం యొక్క అమ్మవారు పర్యవేక్షిస్తున్నారు స్థల పురాణం వివరిస్తుంది ద్రాక్షారామం లో శివుడు భీమేశ్వరుడు స్వయంభువు గా అవతరించాడు.

శ్రీ లక్ష్మీనారాయణ ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు త్రిలింగ క్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటి అలానే పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఈ క్షేత్రం గురించి శ్రీనాథ కవిసార్వభౌముడు తన కావ్యాలలో పేర్కొన్నాడు. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయడానికి సప్తరుషులు కలిసి గోదావరి తీసుకువచ్చారని పురాణ కధనాలు వర్ణిస్తున్నాయి అందువల్ల అంతర్వాహినిగా ప్రవహించే గోదావరి సప్తగోదావరి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలానే అమరావతిలో ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి అమరేశ్వరస్వామిగా అయ్యాడు. అలానే ఇక్కడ చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి సోమేశ్వర స్వామి గా వెలసే భీమవరంలో. పాలకొల్లు లో శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్టించాడు కాబట్టి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి గా వెలిశాడు సామర్లకోట లో ఆత్మలింగాన్ని ఛేదించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామి స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించిన కాబట్టి కుమారారామ భీమేశ్వర స్వామి ఇక్కడ వెలిశాడు. ప్రతీ ఏకాదశీ పర్వదినముల లో ఏకాంతసేవ, పవళింపు సేవ జరుగుతుంది. అలానే ప్రతీ మాస శివ రాత్రి పర్వదినముల లో గ్రామోత్సవం కూడా ఇక్కడ జరుపుతారు. అంతే కాక్ ప్రతీ కార్తీక పూర్ణిమ తో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం ఇక్కడ జరుపుతారు. ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం ఇక్కడ జరుగుతుంది.  ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు అంగరంగ వైభవముగా ఇక్కడ జరుగుతుంది. ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం కూడా ఎంతో ఘనంగా ఈ ఆలయం లో జరుగుతుంది. ప్రతీ మహా శివ రాత్రి పర్వదినము లో శివరాత్రి ఉత్సవాలు జరుగును. శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) – ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు – జ్వాలా తోరణం (కార్తీక పున్నమి నాడు) సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు ఇక్కడ అతి వైభవముగా జరుగుతాయి.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading