
ప్రధాన పదార్థం
- 1 కప్ రాగి పిండి
- 2 Numbers కోయబడినవి ఉల్లిపాయలు
ప్రధాన వంటకానికి
- 1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర
- అవసరాన్ని బట్టి కోయబడినవి కరివేపాకు
- అవసరాన్ని బట్టి కోయబడినవి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
- అవసరాన్ని బట్టి ఉప్పు
- అవసరాన్ని బట్టి నీళ్ళు
Step 1:
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో రాగిపిండిని వేయండి. ఇప్పుడు అందులో నీరు పోసుకుని దోశపిండిలా వచ్చేలా కలుపుకోండి పిండిని.
Step 2:
ఇప్పుడు కలుపుకున్న దోశ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి. ఇప్పుడు పదార్థాలన్ని బాగా కలిసేలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి.

Step 3:
దోశ పాన్ తీసుకుని మీడియం మంటపై పెట్టి వేడి చేయండి. ఇప్పుడు రాగి పిండిని తీసుకుని దోశలా వేయండి. ఇది మామూలు దోశపిండిలా వేయడానికి కుదరదు. కాబట్టి మీరు దోశ వేసుకునేటప్పుడే దోశ ఆకారంలో పిండిని వేయండి.

Step 4:
దోశని నెయ్యితో రెండు వైపులా 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చండి. అంతే ఎంతో హెల్దీ అంతే టేస్టీ రాగి దోశ సిద్ధమైనట్లే. ఈ దోశ ఏదైనా చట్నీతో, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది.
Raju's Resource Hub
