📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

దోసెలు బాగా రావాలంటే

దోసలు బాగా రావాలంటి మొదట 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాస్ లు బియ్యం నీళ్ళలో 9 గంటలు నాన పెట్టాలి. 4 చెంచాలు మెంతులు కూడా వేయాలి. తరువాత మెత్తగా రుబ్బాలి. గట్టిగా కాకుండా గరిట జారుడు గా వేసుకుంటే దోసెలు చాలా బాగా రుచి కరముగా వస్తాయి. రుబ్బేటప్పుడు 10 నిమిషాలు నాన పెట్టిన అటుకులు వేస్తే దోసెలు బాగా మెత్తగా వస్తాయి. పచ్చి సెనగ పప్పు వేసి రుబ్బిన దోస ఎర్రగా కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది. కరకర లాడుతూ దోసెలు కావాలంటే 1 మినపప్పు, 3 గ్లాసులు బియ్యం వాడాలి . అదే మెత్తగా దోసలు కావలంటే 1 గ్లాసు మినపప్పు 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి.

నాన్ స్టిక్ పెనం అయితే ఈజీగా వస్తాయి. ఇనప పెనం మీద దోసలు రావటం ఇబ్బంది పెడితే ఆనపకాయ పై ముచ్చుక కోసి నూనెలో ముంచి పెనం మీద అంతా రాసి అప్పుడు దోస వేస్తే సులువుగా ఉంటుంది .

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading