Logo Raju's Resource Hub

మమతా బెనర్జీ

Google ad

మమతా బెనర్జీ(1955)

మమతా బెనర్జీ గారు బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా లో జన్మించారు. 17 ఏళ్ళు వయస్సు లో తండ్రి అకాల మరణంతో కుటుంబ భాద్యతలు స్వీకరించారు. ఒకవైపు చదువుకుంటూనే కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్కూల్ టీచర్ గా పనిచేసారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

1976లో లోక్ నాయక్ జె.పిని కలకత్తా నగరంలో కి రాకుండా అడ్డుకున్న బృందానికి నాయకత్వం వహించారు. 1976 నుంచి 1984 వరకు బెంగాల్ మహిళా కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలిగా పనిచేసారు. 1984 లోక్ సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ స్థానం నుంచి పోటీ చేసి దిగ్గజ కమ్యూనిస్టు నాయకులు సోమనాథ్ ఛటర్జీ గారి మీద విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 1991,1996,1998,1999,2004,2009 లలో వరుసగా మొత్తం 8 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

1991లో పి.వి.నరసింహ రావు ప్రభుత్వం లో యువజన క్రీడా శాఖ సహాయ మంత్రిగా1996 వరకు, 1999 నుంచి 2000 వరకు వాజపేయి ప్రభుత్వం లో రైల్వే శాఖ కేబినెట్ మంత్రిగా, 2004 లో వాజపేయి ప్రభుత్వంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా, 2009 నుంచి 2011 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.

Google ad

1997లో కాంగ్రెస్ పార్టీతో విభేదాలు కారణంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 14 సంవత్సరాలకు బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2011లో 34 ఏళ్ళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి చరమగీతం పాడిన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.2011 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.

“మా , మాటి, మనుష్” ఉద్వేగానికి లోను చేసే నినాదాన్ని పలికిన మొదటి వ్యక్తి బెనర్జీ గారే. బెంగాలీ ప్రజలు ఆమెను “దీదీ(పెద్ద అక్క)” అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆమె 44 ఏళ్ళు రాజకీయ ప్రస్థానంలో ఎక్కువగా పోరాటలు చేయడానికే సరిపోయింది. దేశంలో ఉన్న బలమైన మహిళా రాజకీయ నాయకురాళ్ల లలో మమతా బెనర్జీ గారు ముందుంటారు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading