📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Yanam Updates 20-02-2026

గోలగాబత్తులవారి వీధిలోని పుదుచ్చేరి కోఆపరేటివ్ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్. కార్తికేయన్ (53) గుండెపోటుతో మృతి చెందారు. ఇంటి నుంచి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన పుదుచ్చేరి నుంచి ఈ నెల 11న యానాం వచ్చి విధుల్లో చేరారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పుదుచ్చేరి వెళ్లేందుకు బుధవారం ఈ నెల 28 వరకు సెలవు పెట్టారు. బుధవారం (ట్రైన్ టికెట్ దొరకకపోవడంతో) గురువారం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఐ పాండవ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యానాం ప్రజా పనుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎన్. సుందరి పుదుచ్చేరి ప్రజా పనుల శాఖకు విభాగానికి బదిలీ చేశారు. చీఫ్ సెక్రటేరియట్ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కారైకల్ కార్యాలయ ప్రజాపనుల శాఖలో ఏఇ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం. బాలసుబ్రహ్మణ్యం స్థానంలో యానాం ఈఈ బాధ్యతలు అప్పగించారు.

పీడబ్ల్యూడీ ఎన్ మ్ ర్ లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల నిరసనలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శరవణన్‌ను తక్షణం విధుల నుంచి తొలగించాలని కోరుతూ గురువారం యానాం సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా పీడబ్ల్యూడీ శాఖలో పనిచేస్తున్న తమ విధులను పర్మనెంట్ చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పుదుచ్చేరి శాసనసభ సమావేశంలో నిరసన తెలిపిన శరవణన్‌పై చర్యలు తీసుకోవడం సరైంది కాదన్నారు. తమ అధ్యక్షుడు శరవణన్‌ను అరెస్టు చేయడం తక్షణం విరమించి విధుల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading