Logo Raju's Resource Hub

భూమి గుండ్రంగా ఉందని ఎవరు నిరూపించారు, రుజువు కోసం వారు ఎంచుకున్న పద్ధతి ఏమిటి?

Google ad
అలెగ్జాండ్రియా కి చెందిన ఎరటోస్థెనెస్(eratosthenes)
మొట్ట మొదట మూడవ శతాబ్దం బిసిలో భూమి గుండ్రంగా ఉంటుంది అని మరియు భూమియొక్క చుట్టుకొలతని కనుగొన్నారు . ఎరటోస్థెనెస్ ఒక ఖగోళశాస్త్రవేత్త , చరిత్రకారుడు, భౌగోళిక శాస్త్రవేత్త, తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఒక కవి . ఆయన అలెగ్జాండ్రియా యొక్క గ్రేట్ లైబ్రరీ కి డైరెక్టర్ . ఒకసారి ఆయన లైబ్రరీ లోని పాపిరస్(papyrus) పుస్తకంలో సైనీ (syene) ( ఇప్పుడు ఆస్వాన్ అని పిలుస్తున్నారు) అనే ప్రాంతంలో మధ్యాహ్నం నిలువుగా వున్న కర్రలకు నీడలు వుండవు అని చదివాడు . అపుడు ఆయనకి ఒక సందేహం వచ్చింది అదే సమయంలో అలెగ్జాండ్రియా లో కర్రలకు నీడ వుంటుందా లేదా అని . ఆయన అలెగ్జాండ్రియా లో తాను వున్న ప్రాంతంలో కర్రలు నిలువుగా ఉంచి గమనించారు. కానీ సైనీ లో కర్రలకు నీడలు లేని సమయంలో అలెగ్జాండ్రియా లో ఉంచిన కర్రలకు నీడలు ఉండటం గమనించారు . అప్పటికాలంలో భూమి ఫ్లాట్ గా ఉంటుంది అని అనుకునేవారు . ఒకవేళ భూమి ఫ్లాట్ గా ఉంటే అన్ని చోట్ల వస్తువులకు నీడలు ఒకేలా ఉండాలి కానీ ఇలా నీడల్లో తేడాలు ఎందుకు వచ్చాయి అని ఎరటోస్థెనెస్ ఆలోచించారు అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ప్రపంచాన్ని మార్చేసింది .
భూమి కర్వ్ గా ఉండటం వల్ల నీడల్లో తేడాలు వున్నాయి అని కనుగొన్నారు . కర్వ్ ఎంత పెద్దగా ఉంటే నీడల్లో అంత ఎక్కువ తేడాలు ఉంటాయి అని కనుగొన్నారు . ఆయన ఒక గణిత శాస్త్రజ్ఞుడు కాబట్టి సైనీ మరియు అలెగ్జాండ్రియా లో వున్న నీడల తేడాలు 7 డిగ్రీలు వున్నాయి అని కనుగొన్నారు .
అయన ఒక వ్యక్తిని సైనీ నుండి అలెగ్జాండ్రియా ఎంత దూరంలో వుంది అని లెక్కించడానికి నియమించారు . అపుడు సైనీ కి అలెగ్జాండ్రియా 800 కిలోమీటర్లు అని తెలిసింది . 7 డిగ్రీ అంటే 360 డిగ్రీస్ లో 1/50 వంతు . 800*50=40,000 కిలోమీటర్లు .
అయన అప్పుడు ఉపయోగించినవి కర్రలు, కళ్ళు మరియు ఆలోచనలు వాటితో ఆయన వున్న ప్రాంతం నుండే 2,200 సంవత్సరాల ముందు భూమి యొక్క చుట్టుకొలతను కనుగొన్నారు .
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading