📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ

Google ad

భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు.  ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. అత్యంత ధైర్యవంతుడు, ప్రతిభావంతుడైన సంతోశ్ గురించి ఆయన తల్లిదండ్రులు కీలక వివరాలు తెలిపారు.

samayam telugu
తల్లిగా బాధగా ఉంది.. కానీ, నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది.. గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో అమరులైన కల్నల్ సంతోశ్ బాబు తల్లి మంజుల చెబుతోన్న మాట ఇది. ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. అయినా.. ఆ తల్లిదండ్రుల్లో ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. వారిలో ఆ జవాన్ నింపిన ధైర్యం అలాంటిది. ఇండియన్ ఆర్మీ పవర్ అలాంటిది. తనకు మరణం ఏ సమయంలో, ఏ రూపంలో వచ్చినా కుంగిపోవద్దని తల్లిదండ్రులకు, భార్యకు ధైర్యం నూరిపోశాడు. తన కుమారుడు ఇచ్చిన బలంతోనే ఆ మాతృమూర్తి.. ఉబికివస్తున్న కన్నీళ్లను కూడా దిగమింగుకొని ధైర్యంగా నిల్చున్నారు. మీడియాతో మాట్లాడారు. తన కుమారుడి సాధించిన విజయాలను ఆ తల్లిదండ్రులు మీడియాతో చెప్పారు.. 

అమ్మా త్వరలో హైదరాబాద్ వచ్చేస్తా..

samayam telugu

‘అమ్మా.. హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయిందిగా, ఇంకో నెల రోజుల్లో వచ్చేస్తా’ అని తన కుమారుడు చెప్పాడని సంతోశ్ బాబు తల్లి తెలిపారు. చివరిసారిగా ఆదివారం (జూన్ 14) తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు ఇప్పటికే హైదరాబాద్ రావాల్సి ఉన్నా.. కరోనా లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైందని, అక్కడికి రావాల్సిన బలగాలు ఇంకా చేరుకోకపోవడం వల్ల అక్కడే ఉండిపోయాడని ఆమె తెలిపారు. సంతోశ్ మరణవార్తతో ఆయన అత్తగారు కుప్పకూలిపోయారు. ఆమెను తరలించారు. సంతోశ్ సతీమణి తన పిల్లలతో ఢిల్లీలో ఉన్నారు. సంతోశ్ బాబు భార్య పేరు సంతోషి. వీరికి కుమార్తె అభిజ్ఞ (9), కుమారుడు అనిరుధ్‌ (4) ఉన్నారు.

నా కలను కొడుకు రూపంలో చూసుకున్నా..

samayam telugu

దేశం కోసం సైనికుడిగా పనిచేయాలని తనకు బలంగా ఉండేదని సంతోశ్ బాబు తండ్రి తెలిపారు. కొన్ని కారణాల వల్ల తాను ఆ అవకాశం పొందలేకపోయానని వివరించారు. బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ‘సైన్యంలో పనిచేయాలనేది నా కల. నా కలను కొడుకు రూపంలో చూసుకున్నాను. అతడిని ముందు నుంచే ఆ లైన్లో తయారు చేశాను. కోరుకుండ సైనిక్ స్కూల్లో చదివించాను. అతడి కోసం నేను 800 కి.మీ. ట్రాన్స్‌ఫర్ చేయించుకొని అక్కడికి వెళ్లాను’ అని ఆయన చెప్పారు.

Google ad

రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..

Col Santosh Babu Fought the Chinese in Galwan Valley and led his troops - Sakshi

కల్నల్‌ సంతోష్‌ బాబు వీరోచిత పోరాటం
వెల్లడించిన ఆర్మీ వర్గాలు
దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్‌ సంతోష్‌బాబు వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయ సైనికుల్ని ముందుండి నడిపించిన ఆయనలో నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి జై కొట్టాలి. సంతోష్‌బాబు ఎంతటి తెగువ చూపించారో ఒక ఆర్మీ అధికారి జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. కల్నల్‌ ఎలా ముందుకు సాగారంటే….
ఇండియన్‌ ఆర్మీ 16 బిహార్‌ బెటాలియన్‌కు సంతోష్‌ బాబు కమాండింగ్‌ ఆఫీసర్‌ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 6న ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో గల్వాన్‌ లోయలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 దగ్గర నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా తన శిబిరాన్ని తీసేసి సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ హఠాత్తుగా జూన్‌ 14 రాత్రి మళ్లీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే సంతోష్‌ బాబు, చైనా కమాండింగ్‌ ఆఫీసర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాక మళ్లీ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి మళ్లారన్న సమాచారం అందింది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కల్నల్‌ స్వయంగా గల్వాన్‌ లోయకు బయల్దేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మేజర్‌ ర్యాంకు అధికారిని పంపి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పి ఉండొచ్చు. కానీ సంతోష్‌బాబు ఆ పని చేయలేదు. డ్రాగన్‌ సైన్యం వెనక్కి వెళ్లి ఉండదన్న అనుమానంతో సైనికుల్ని తీసుకొని వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు చైనా సైనికుల కొత్త ముఖాలు కనిపించాయి. ఎంతో మర్యాదగానే కల్నల్‌ సంతోష్‌ బాబు వారితో సంభాషణ మొదలు పెట్టారు. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి జవాబుగా సైనికులు సంతోష్‌ బాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాల సేపు ఘర్షణలు జరిగాయి.
చైనా శిబిరాల్ని భారత జవాన్లు నాశనం చేశారు. ఈ దాడుల్లో సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయలేదు. గాయపడిన ఇతర జవాన్లను వెనక్కి పంపేస్తూ తానే సింహంలా ముందుకు ఉరికారు. అంతలోనే అటువైపు నుంచి మరికొందరు ఇనుప రాడ్లతో, కొత్త తరహా ఆయుధాలతో భారతీయ సైనికులపై దాడి చేశారు. కల్నల్‌ అనుమానం నిజమైంది. చైనా పథకం ప్రకారమే సైన్యాన్ని అక్కడ దింపిందని అర్థమైంది. మళ్లీ ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద రాయి వచ్చి కల్నల్‌ తలకి గట్టిగా కొట్టుకోవడంతో ఆయన గల్వాన్‌ నదిలో పడిపోయారు. పోరు ముగిశాక సంతోష్‌బాబుతో సహా చాలా మంది జవాన్లు నిర్జీవంగా నదిలో ఉన్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండిచేశాయి. చాలాసేపు అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణమే నెలకొందటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి వివరించారు.

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ కుమార్ భార్య సంతోషికి ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట వెళ్లి ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. గ్రూప్-1 ఉద్యోగంలో భాగంగా సంతోష్ బాబు భార్య సంతోషి ఇకపై కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కనిపించనున్నారు. దీనికి సంబంధించి సంతోషిని ఆ ఉద్యోగంలో నియమిస్తూ సీఎస్ సోమేశ్‌ కుమార్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంతోషికి రూ.4 కోట్ల చెక్కును, తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంగతి తెలిసిందే.

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading