📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

సారనాథ్

Google ad

సారనాథ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. బౌద్ధమత పరంగా సారనాధ్ పేరుపొందినది. ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన జింకల పార్క్ లోనే గౌతమ బుద్దుడు మొదటి ధర్మాన్ని బోధించాడు మరియు మొదటి సంఘం స్థాపించబడిన ప్రదేశము. సారనాధ్ భారతదేశంలో ఉన్న నాలుగు ప్రధాన బౌద్ధ స్థలాలలో ఒకటి.

అశోక చక్రవర్తిచే నిర్మింపబడిన అనేక స్థూపాలు సారనాధ్ లో ఉన్నాయి. వీటిలో అశోక స్థూపం ప్రసిద్ధి చెందినది. ఈ స్థూపంలో ఉన్న నాలుగు సింహాల బొమ్మ నేడు భారతదేశం యొక్క జాతీయ చిహ్నంలో ఉంటుంది. ఈ స్థూపంలో ఉన్న చక్రం భారత జాతీయ జెండా మధ్యభాగంలో ముద్రించబడినది.

Google ad

సారనాధ్ లో అనేక బౌద్ధమత నిర్మాణాలు మరియు స్మారక కట్టడాలు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం కాలం నాటివి. సారనాధ్ కు వచ్చే వారిలో బౌద్ధమత యాత్రికులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడకు వచ్చే ఎక్కువ మంది సందర్శకులకు బుద్ధుడు మొదట బుద్ధ ధర్మాన్ని బోధించిన జింకల పార్క్ ఆకర్షిస్తుంది. వాస్తవానికి జింక పార్క్ లో ఉన్న ధమేఖ్ స్థూపం వీరికి బుద్ధుని బోధనలను గుర్తుకు తెస్తుంది.

Google ad

చుఖంది స్థూపంలో బుద్దుని ఎముకలు ఉంచబడ్డాయి. ఈ ప్రాంతంలో పురావస్తు త్రవ్వకాలలో అశోక స్థంభంతో సహా ఆ కాలంలోని అనేక పురాతన కట్టడాలు బయటపడ్డాయి. సారనాధ్ మ్యూజియం కూడా త్రవ్వకాల సమయంలోనే కనిపెట్టబడింది. ఈ మ్యూజియంలో అనేక కళాఖండాలు ఉన్నాయి. ములగంద కుటివిహార్ లో 1931లో మహా బోధి సమాజం నిర్మించబడింది . ఇటీవల థాయ్ ఆలయం మరియు కగ్యు టిబెటన్ ఆశ్రమం కూడా నిర్మించడ్డాయి.

Google ad
Google ad

సారనాధ్ రోడ్డు మరియు రైలు మార్గాలతో అనుసంధానించబడింది
నవంబర్ నుండి మార్చి వరకు సారనాధ్ ను చూడటానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వేసవిలో వాతావారణం వేడిగా మరియు పొడిగా ఉంటుంది.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading