
కృష్ణానది మధ్యలో 130 ఎకరాలో విస్తరించి ఉన్న భవానీద్వీపం మంచి పిక్నిక్ స్పాట్. మీటింగ్ లకు, వివాహాది శుభకార్యక్రమాకు అనుకూలం. సమావేశాలకు ఎ పి టి డి సి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోనే నదీ ద్వీపాలలో ఉన్న పెద్ద దీవి భవానీ ద్వీపం. వారాంతపు సెలవులు కుటుంబాలతో గానీ, స్నేహితులతో గడపటానికి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. బోట్ లో విహారం ఒక మరపురాని అనుభూతి. వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎ పి టి డి సి వారి హరితా కాటేజ్ మంచి వసతి సౌకర్యం కల్పిస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి దగ్గరలో ఉన్న ఈ దీవికి కృష్ణానది ఒడ్డు నుండి బోటులో వెళ్ళవసి ఉంటుంది.
Google ad
Google ad