
ఇతను భారత రసాయన శాస్త్ర పితామహుడు 1861లో ప్రస్తుత బంగ్లదేశ్లో జన్మించాడు. 1887లో రసాయన శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు (ఇంగ్లాండ్) ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకునిగా చేరాడు.
ప్రఫుల్ల చంద్రరే పరిశోధనలు
మెర్కురస్ నైట్రేట్ అనే రసాయనం కనుగొన్నాడు. నైట్రజజ్ గ్యాస్ తయారుచేసే సుభ విధానం కనుగొన్నాడు. దీనిని ఎక్కువగా వ్యవసాయరంగంలో ఉపయోగిస్తారు. భారత రసాయన చరిత్ర – History of Hindi hemistryI,II అనే పుస్తకాన్ని ప్రచురి`ంచాడు. దీనితో భారత రసాయన శాస్త్రవిజ్ఞానం ప్రపంచానికి తెలిసి వచ్చింది. 1901లో The Bengal Chemicals & Pharmaceutical Works అనే తొలి మందుల కంపెనీని స్థాపించాడు. బహురంగాలలో రసాయన సంబంధ పరిశ్రమము స్థపించడానికి ఎందరినో ఇతను ప్రోత్సహించాడు. రసాయన శాస్త్రంలో ఎంతో ఉన్నతి సాధించి చంద్రరే తన సంపాదననంతా సమాజసేవకు, విద్యార్థులకు, శిష్యులకు, రసాయన శాస్త్ర వ్యాప్తికి వినియోగించారు. ఇతని శిష్యులు జ్ఞానఘోష్, థార్, శిశిర్ కుమార్ మిత్ర, ఫ్రొ. సహా, సత్యేంద్రనాధ్ బోస్, రే మొదలగు వారు ప్రసిద్ధులు.
Raju's Resource Hub