📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

మడావి హిడ్మా – మావోయిస్టు

1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం ఆయన సొంతూరు. ఆ గ్రామం నుంచి దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు.

ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నారు. తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఆయన చదివింది మాత్రం 7వ తరగతే. ”హిడ్మాను 2000వ సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించారని చెబుతారు.

ఆయుధాల తయారీ, రిపేర్లు చేసేవాడు. గ్రనేడ్లు, లాంఛర్లు స్థానికంగా తయారు చేయించాడు. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో ఎదిగారు హిడ్మా. తరువాత మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో చేరారు.

Google ad
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌

2001-2007 ఏడు మధ్య హిడ్మా సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడుగానే ఉన్నారు. కానీ బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుం ఎదుగుదల హిడ్మాను మరింత యాక్టివ్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిందంటారు మావోయిస్టు కార్యకలాపాలను విశ్లేషించిన వారు. 1990ల మధ్యలో ఒక దశలో బస్తర్‌లో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ మళ్లీ తిరిగి లేవడానికి ఒక రకంగా సల్వాజుడుంపై స్థానికుల్లో ఏర్పడ్డ ప్రతీకారేచ్ఛ కారణమని వారి విశ్లేషణ.

సరిగ్గా ఇదే పాయింట్ హిడ్మా విషయంలో కూడా పనిచేసింది అంటారు. ”తన వారిపై జరుగుతోన్న దారుణాలు అతణ్ణి అలా తయారు చేసి ఉండొచ్చు.” అని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యులు ఒకరు అన్నారు. 2007వ సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇందులో 24 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు మరణించారు. హిడ్మా నాయకత్వంలో ఈ దాడి జరిగిందని చెబుతారు.

”సీఆర్పీఎఫ్ వారు అక్కడ ఒక గ్రామాన్ని తగలబెట్టారు. ఆ విషయం తెలుసుకున్న హిడ్మా బృందం వారిని మార్గంలో అడ్డగించడానికి వెళ్లింది. తిరిగి వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ బృందంపై హిడ్మా బృందం దాడికి దిగింది. ఈ ఘటనకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అప్పటి వరకూ మావోయిస్టులు ల్యాండ్ మైన్ (మందు పాతర)లపై ఎక్కువగా ఆధారపడేవారు. కానీ, మొదటిసారి తుపాకులతో తలపడి, ఎదురు ఎదురుగా యుద్ధానికి దిగిన పెద్ద ఘటనగా దీన్ని చెబుతారు. మావోయిస్టులను మందు పాతరల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో హిడ్మాది కీలక పాత్రగా చెబుతారు.

”నిజానికి హిడ్మా దూకుడు పార్టీ నాయకత్వనికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తరువాత కూడా ఆయన ఆ దూకుడును కొనసాగించాడు. అందుకే పార్టీ ఆయనకు పెద్ద బాధ్యతలు ఇస్తూ పోయింది.” అని ఒక మాజీ మహిళా మావోయిస్టు వివరించారు. 2008-09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అప్పుడే ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్‌కి కమాండర్ అయ్యారు హిడ్మా. ఈ ఫస్ట్ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది. తరువాత 2011లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటిలో సభ్యుడు హిడ్మా సభ్యుడయ్యారు. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసులు మరణించారు. 2017 మార్చిలో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో హిడ్మా పాత్ర ఉందని చెబుతారు. హిడ్మా అనేక పోరాటాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొన్నా, స్వయంగా తూటాలు పేల్చేది తక్కువ. దగ్గరుండి మిగిలిన మావోయిస్టులను నడిపిస్తారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప తన దగ్గరున్న తుపాకీ ఉపయోగించడు. ఆయన నాయకత్వంలోని దళం చాలా చురుగ్గా పని చేస్తుంది.

హిడ్మా బస్తర్ స్థానికుడు. అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. స్థానికులతో కలిసిపోతారు. వారితో సత్సంబంధాలు ఉంటాయి. అతనికి స్థానిక యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. ”అక్కడి వారు అతణ్ణి ఓ దేవుడిలా చూస్తారు. ప్రస్తుతం అతని తలపై లక్షల రివార్డు ఉంది. 

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading