📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

వరంగల్: చారిత్రాత్మక ప్రాధాన్యత కల అద్భుతమైన ప్రదేశం

వరంగల్ భారతదేశంలో తెలంగాణా  రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉండెను. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నగరం. పురాతన కాలంలో వరంగల్ను ‘ఓరుగల్లు’ లేదా ‘ఓంటికొండ’ అని కూడా  పిలిచేవారని దీనికి సాక్ష్యాధారంగా  ఒక పెద్ద కొండ రాయిమీద ఈ పేర్లు చెక్కి ఉండటం కనిపిస్తుంది. వరంగల్ నగరం వరంగల్ జిల్లాలో ఉంది,దీనితోపాటుగా హన్మకొండ మరియు కాజీపేట్ కూడా ఉన్నాయ్.   వరంగల్ కోట వంటి వివిధ వాస్తుకళా కళాఖండాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి మరియు ప్రోల రాజు  (కాకతీయ వంశం యొక్క) ఈ సుందరమైన నగరం నిర్మించారు అని నమ్ముతారు. మార్కో పోలో, ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు, అతని ప్రయాణ డైరీలలో మరియు ఆయన రచనల్లో వరంగల్ గురించి ప్రస్తావించినప్పుడు కాకతీయరాజుల సాంస్కృతిక మరియు పరిపాలన దక్షత గొప్పతనం ప్రతిబింబిస్తాయి.

చరిత్రపరంగా ఇంతకు ముందు చెప్పినట్లుగా కాకతీయ రాజులు 12నుండి14వ శతాబ్దం A.D.వరకు వరంగల్ పరిపాలించారు. ప్రతాప రుద్ర యొక్క ఓటమి తరువాత, ముసున్రి నాయక్ ల యాభై సంవత్సరాల చట్టం స్థాపించబడింది. దీనివలన వివిధ నాయక్ రాజుల మధ్య నమ్మకం, సంఘీభావం లేకపోవడం, పరస్పర పోటీ ఏర్పడ్డాయి మరియు నగరం యొక్క పరిపాలనా నియంత్రణను బహమనీలు తీసుకున్నారు. ఔరంగజేబు, మొఘల్ చక్రవర్తి, 1687 సంవత్సరం లో గోల్ద్కండా సుల్తానేట్ మీద విజయం సాధించాడు. (వరంగల్ ఒక భాగమై ఉంది ) మరియు 1724 వరకు అలానే కొనసాగింది. హైదరాబాద్ స్టేట్ 1724 లో ఉనికిలోకి వచ్చింది మరియు1948 లో వరంగల్ కూడా  మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఒక  భాగం అయ్యింది. హైదరాబాద్ భారతీయ రాష్ట్రం అయింది మరియు 1956 లో ఈ రాష్ట్రానికి ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఇచ్చివేశారు.  

చుట్టుప్రక్కల ప్రాంతాలు వరంగల్ నగరానికి గల చారిత్రక ప్రాధాన్యత, అనేక రకాల శిల్పకళ, అభయారణ్యాలు మరియు ఆకట్టుకొనే విధంగా ఉన్న దేవాలయాలు ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులు  పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పాకాల సరస్సు,వరంగల్ కోట,వేయి స్తంభాల గుడి మరియు రాక్ గార్డెన్ మొదలైన ఆకర్షణలను వరంగల్ జిల్లాలో చూడవచ్చు. ఇతర దేవాలయాలు,పద్మాక్షి ఆలయం మరియు భద్రకాళి ఆలయం సమాజంలోని అన్నిరకాల భక్తులను ఆకర్షిస్తూన్నాయి. వరంగల్ ప్లానిటోరియం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నది. ఇక్కడ ఇంకా అనేక సరస్సులు,ఉద్యానవనాలు ఉన్నాయి.

Google ad

వరంగల్ కోట

warangal fort

వరంగల్ నగరంలో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు మచ్చుతునక ఈ కోట. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు క్రీ.శ 1199 సం. లో కోట నిర్మాణం మొదలు పెట్టాడు అతని కుమార్తె రాణి రుద్రమ దేవి 1261 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ కోట శిధిలాలను మాత్రమే ఇక్కడ చూడవచ్చు. ఈ కోట నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలు కలిగిఉన్నది. చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నవారికి ఈ కోట సందర్శనీయమైనది. రాతిపై చెక్కబడిన సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు కళాకారుల ఆ నాటి కళాకారుల పనితనానికి నిదర్శనం.

కాకతీయుల నాటి పురాతనమైన రాతి కట్టడాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్న ఖిలావరంగల్‌ కోట ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత దీనిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణా పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్‌ మధ్య కోటలోని నాలుగు కాకతీయ కళాతోరణాల మధ్య రూ.4కోట్లతో సౌండ్స్‌, లైటింగ్‌, లేజర్‌షోను ఏర్పాటు చేశారు.

ఈ కోటను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ కోటలోని శిధిలాలను మాత్రమే దర్శించవచ్చు. దేవతల విగ్రహాలు, కోట గోడలు, కోటలోని భాగాలను చూడవచ్చు. కోట చుట్టూ కట్టబడిని మట్టి గోడ, రాతి గోడను కూడా చూడవచ్చు.రుద్రమదేవి కాలంలో అసమానంగా వెలుగొందిన ఈ కోట తరువాత రుద్రమదేవి మనుమడు రెండవ ప్రతాప రుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానాయకుడు మాలిక్ కపూర్ లక్ష సైన్యంతో ఈ కోటమీదకు దండెత్తి వచ్చాడు. ఈ ఆక్రమణలో కోట నాశనం చేయబడింది. తరువాత కూడా చాలాసార్లు ఢిల్లీ సుల్తానుల ఆక్రమణలకు ఈ కోట గురైంది. అక్కడనుండి దీని ప్రాభవం కోల్పోయింది.

ఎలా వెళ్లాలి …?
చారిత్రాత్మకమైన ఈ ఓరుగల్లు కోట వరంగల్ రైల్వేస్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్ లలో లేక ఆటోలలో వెళ్లవచ్చు.

రామప్ప చెరువు

Ramappa Lake….రామప్ప చెరువు

మానవ నిర్మితమైన, ఈ అద్భుతమై చెరువు కాకతీయ రాజులకు వ్యవసాయంపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం.13వ శతాబ్ధంలో కాకతీయరాజైన గణపతి దేవుని కాలంలో ఈ చెరువు నిర్మించబడినది. 85 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మించబడింది. చుట్టూ పచ్చని చెట్లతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

మంచి పర్యాటక కేంద్రం కూడా. వారాంతపు సెలవులు గడపటానికి పిల్లలకు, పెద్దలకు మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. మోటార్ బోటింగ్ సౌకర్యం కలదు. ఇక్కడ టీ, స్నాక్స్ మరియు వాటర్ బాటిల్స్ మాత్రమే అమ్మబడతాయి.

పర్యాటకులు ఇక్కడకు వచ్చేటపుడు దగ్గరలోని హనుమకొండ, వరంగల్ నుండి ఆహారం తెచ్చుకొంటే ప్రశాంతంగా రామప్ప చెరువు విహారం పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 5 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ విహరించవచ్చు.

ఎలావెళ్లాలి…?
తెలంగాలోని వరంగల్ జిల్లా పాకాలలో ఈ చెరువు ఉంది. వరంగల్ నుండి బస్సులలో వెళ్లవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప గుడికి కేవలం 1 కిలో మీటర్ దూరంలోనే ఉంది. రామప్ప గుడికి, రామప్ప చెరువుకు శని, ఆదివారాలలో ప్రత్యేక బస్ లు నడుపబడుచున్నవి. ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. వరంగల్ హనుమకొండ బస్ స్టాండ్ నుండి బస్ సౌకర్యం కలదు.
State Tourism Department – +91 (040) 23450444
Warangal Tourism Officer: 0870 – 2459201     వరంగల్ లో రెండు సంవత్సరాలకి ఒకసారి సమ్మక్క-సారక్క జాతర (సమ్మక సారలమ్మ జాతర అని కూడా అంటారు) జరుగుతుంది. ఈ జాతర పది మిల్లియన్ల ప్రజలను ఆకర్షిస్తున్నది. కాకతీయ రాజ్యంలో అమలుపరిచిన అన్యాయమైన చట్టాలను ఎదిరిస్తూ ఒక తల్లి-కూతురు జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండుగ (జాతర)ను జరుపుకుంటారు.  కుంభమేళా తరువాత ఆసియ ఖండంలో రెండవ అతిపెద్ద జాతర ఇది.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading