📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

సీఈసీ ఇంటర్

ఇంటర్‌లో సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు బీకాం రెగ్యులర్, బీకాం కంప్యూటర్స్‌తో పాటు బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు.
  1.  ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి కొంత కష్టమైనా ప్రొఫెషనల్ కోర్సులైన చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), సీఎంఏ వంటివి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.
  2.   ముఖ్యంగా కంపెనీల్లో, వ్యాపార వాణిజ్య రంగాలలో ఉజ్వల అవకాశాలున్న కోర్సు  చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ). ఈ కోర్సును ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, అన్ని ప్రధాన నగరాల్లో శాఖలు ఉన్నారుు. సీఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్ (ఐపీసీసీ), సీఏ ఫైనల్స్ స్థారుులు ఉంటారుు. ప్రణాళిక ప్రకారం చదివితే నిర్ణీత వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఈ కోర్సు చేసినవారు ట్యాక్స్ కన్సల్టెంట్, ఆడిటర్, సలహాదారు, ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సేవలు అందించవచ్చు. సీఏ చదివినవారు కార్పొరేట్ రంగంలో ప్రవేశించవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ సైతం చేసుకోవచ్చు. 
  3.   సీఈసీ విద్యార్థులకు అనుకూలమైన మరో ప్రొఫెషనల్ కోర్సు.. కంపెనీ సెక్రటరీ (సీఎస్). ఈ కోర్సును ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. కంపెనీ సెక్రటరీ సంస్థ పర్యవేక్షణతో పాటు అన్ని ఆర్థిక వ్యవహాలు చూసుకుంటాడు. అంతర్గత న్యాయ నిపుణుడిగా పనిచేస్తారు. సీఎస్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. త్వరగా ఉద్యోగం లేదా ఉపాధి పొందలంటే చాలామంది కామర్స్ విద్యార్థులు తమ తొలి ప్రాధాన్య కోర్సులుగా సీఏ, సీఎస్‌ను ఎంచుకుంటున్నారు.
  4.   అలాగే సీఈసీ విద్యార్థులు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ) కోర్సులోనూ చేరొచ్చు.  ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులకు దీటుగా సీఎంఏలకు అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఈ కోర్సును అందిస్తోంది. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్.. ఇలా మూడు దశల్లో కోర్సు ఉంటుంది.
    ఐటీ రంగంలో కెరీర్ ఎంచుకోవాలకున్నవారికి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌‌స (ఎంసీఏ) సరైన కోర్సుగా పేర్కొనొచ్చు. ఎంసీఏతో సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్, బ్యాంకింగ్, నెట్‌వర్కింగ్, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.  ఈ కోర్సు చేయాలంటే తొలుత డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ లేదా బీసీఏ పూర్తి చేయాలి. తర్వాత ఐసెట్ వంటి ఎంట్రన్‌‌స టెస్ట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంసీఏ చేయవచ్చు. సీఈసీ అభ్యర్థులు ఎవర్‌గ్రీన్ కోర్సు అరుున ఎల్‌ఎల్‌బీ కూడా చేయవచ్చు. ఇటీవల కాలంలో నైపుణ్యాలున్న లా అభ్యర్థులకు కార్పొరేట్ రంగంలోనూ అవకాశాలు లభిస్తున్నాయి.
Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading