Logo Raju's Resource Hub

Regular and better Mensus

Google ad

ఒకమ్మాయికి నెలసరి వచ్చే రెండు రోజుల ముందు నుంచే విపరీతమైన కడుపునొప్పి, నడుం నొప్పి, మరొకమ్మాయికి నెలసరే ప్రతి నెలా రాదు. నెలా ఇరవై రోజులకో, రెండు నెలలకో వస్తుంది. దాంతో ఏదో చికాకు… ఇంకొకామెకు నెలకి రెండుసార్లు నెలసరి వస్తుంది. వస్తే పదిరోజుల దాకా ఆగదు. దాంతో విపరీతమైన నీరసం, చికాకు!
ఇలా ప్రతి స్త్రీలో చక్కగా సాగవలసిన ఋతుచక్రంలో ఎన్నో ఆవాంతరాలు. వీటి అవర్తన వికృతు (మెనుస్ట్రల్‌ ఇర్రెగ్యు లారిటీస్‌) అంటారు. గర్భాశయంలోనో, లోపలి పొరలలోనో, శరీరంలో ఇతర వ్యాధులవలనో, హార్మోన్ల హెచ్చుతగ్గుల వలనో జననేంద్రియాలో ఏర్పడే గడ్డల వలనో ఈ ఋతుస్రావంలో బాధు, మార్పులు కలుగుతూ వుంటాయి.
హార్మోన్ల ప్రభావం వలన : స్త్రీ శరీర ఆకృతి ఆమె స్వభావసిద్ధమైన ప్రకృతి, ఆమెలో ఉన్న వాత, పిత్త, కఫ శక్తులలో సంభవించే హెచ్చుతగ్గులు వీటికి కారణం. అంతర్గత స్వాభావిక మార్పు వలన ప్రతి నెల 28 రోజుల కొకసారి యోని నుండి ప్రసవించే ఈ ముదురు ఎరుపు రంగుతో ఉండే రక్తం చిన్న చిన్న ముద్దలాంటి పొరలనే ఋతుస్రావం అంటారు. ఆ స్రవించే మూడు నుండి అయిదు రోజుల కాలపరిమితిని ఋతుకాలం మెనుస్ట్రువల్‌ పిరియడ్‌ అంటారు. ఆ సమయంలో స్త్రీని ఋతుమతి అంటారు. ఆ సమయంలో స్త్రీ తన ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలను ఋతుమతి ధర్మాలు అంటారు. వాటిలో కొన్నిటిని అయినా పాటిస్తే భవిష్యత్తులో బాధలు లేకుండా ఉంటాయి.
నెలసరి రావటంలో హెచ్చుతగ్గులు ఆరంభంలో కాస్త ఎక్కువగానూ, మధ్యలో ఇబ్బంది కరంగానూ, చివరిలో శారీరక, మానసిక మార్పులతో రావటం చాలావరకు హార్మోన్ల ప్రభావం వల్ల జరుగుతుంది. 24 రోజు నుండి 32 రోజుల మధ్యలో రావటం అసహజం కాదు కాని, నెలకి రెండు సార్లు లేదా రెండు మూడు నెలలకి ఒకసారి రావటం అసహజమే కాదు వ్యాధి కూడా.
హార్మోన్ల హెచ్చు తగ్గులే కాదు, ఆ హార్మోన్లు మెదడుకు, మిగతా చోట్ల ఇచ్చే సంకేతాలతో మార్పులు కూడా వ్యాధికి కారణమవుతాయి.
పిట్యూటరీ గ్రంథిలోనూ, ఓవరిస్‌లోనూ నిలవ ఉండే ఈస్ట్రోజెన్‌, ప్రాజెస్టిరోన్‌ అనే హార్మోన్లు నెలసరి చక్కగా రావటానికి దోహదపడతాయి. నెలసరి వచ్చేముందు ఈ గ్రంథులు ఒకదాని కొకటి పంపుకునే సంకేతాలలో మార్పుల వలన నెలసరిలో హెచ్చుతగ్గలు మార్పులు సంభవిస్తాయి. గర్భం రావటం, ఆహారంలో సమగ్రత లోపించడం, పోషకాహార లోపాలు, యాభై ఏళ్ళ వయస్సు తర్వాత ఆగిపోయే హార్మోన్ల కారణంగా ఈ మార్పులు వస్తాయి. అలా శాశ్వతంగా ఆగిపోయే నెలసరి స్థితిని క్షీణార్తవం మెనోపాజ్‌ అంటారు.అలాగే పదహాళ్ళు దాటాక పిల్లలలో నెలసరి వస్తూ హఠాత్తుగా మూడునెలలు రాకపోతే అనార్తనం అంటారు. నాలుగ్ను నెలలకొకసారి ఒకటి రెండు బొట్లు కనిపించి మానేసే, దాన్ని స్వత్విర్తావం అంటారు.కొంత మంది స్త్రీలో నభై ఏళ్ళు రాకముందే ఓవరీ సామర్థ్యం ఆగిపోయి నెలసరి ముందుగానే ఆగిపోతుంది. దాన్ని పి ఓ ఎఫ్‌ అంటారు.
అలాగే గర్భాశయం లోపలా బయటా గడ్డలు (ఫైబ్రాయిడ్స్‌) ఏర్పడటం, గ్నర్భాశయం లోపలి పొర వాయటం, పాండు, టి బీ లాంటి శోషవ్యాధులు కూడా ఈ ఆవర్తన వికృతులకు కారణం అవుతాయి. నెలసరి వచ్చేటపుడు, ఉన్నపుడు విపరీతమైన కడుపునొప్పి, నడుము నొప్పి, వాంతులు, తలనొప్పి వంటివి వచ్చి బాధాకరమైతే దాన్ని కష్టార్తవం అంటారు.
అధికంగా ఒళ్ళు ఉండటం వలన లేదా రోజురోజుకీ బరువు పెరగటం సాంక్రమిక వ్యాధులు, గ్నర్భాశయంలో మెలికు పోలిప్స్‌. క్యాన్సరు వంటి తీవ్ర వ్యాధులు కూడా నెలసరి ఉపద్రవాకి కారణమవుతాయి.
తగిన ఆహారం : మూత్రం మంటగా ఉన్నా, గర్భం తోందరగా రాకుండా ఉన్నా, తరచూ జ్వరం వస్తున్నా ఎప్పటికీ తగ్గని నడుం నొప్పి ఉన్నా, సంభోగ సమయంలో బాధగా ఉన్నా, నెలసరి సరిగా రానివారు మరింత జాగ్రత్త పడాలి. నెలసరి ఇబ్బందులు శాకాహారులకన్నా మాంసాహారులలో తక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువగా లావు అవుతుంటే ఇదీ మరీ పెరుగుతుంది. అందుకే మందులు తీసుకోవటం కన్నా ఆహారం, నడవడిక ఆలోచనలో మార్పు ముందు నుంచే కొంచెం జాగ్రత్త పడితే ఈ బాధలు రావు. పాప పన్నెండో సంవత్సరంలో అడుగిడుతుంటే సాయంత్రం చిమ్మిరి వుండలు రెండు తినిపించడం మంచిది. మినప గారెలు ఆహారంలో ఇవ్వడం మంచిది. అలాగే ఇంగువ కూరల్లోన్లూ, పచ్చళ్ళలోనూ వేయటం మరచిపోకండి. అలాగే తెల్లని బ్రెడ్‌ కన్నా ఎర్రని బ్రెడ్‌ నెలసరిని సరిగ్గా ఉంచే ఆహారం.
ఎక్కువ కారం, శనగపిండి వస్తువులు తినకండి. తాజా ఆకుకూరలు, పళ్ళు ముఖ్యంగా బొప్పాయి, జామ, దానిమ్మ పళ్ళు నెలసరిని సరిగ్గా ఉంచే ఆహారం.
పళ్ళు, చిక్కుళ్ళు, గోరుచిక్కుళ్ళు అని వయస్సుల ఆడవారికి మంచివి. మాంసాహారం తినేవాళ్ళు చేపలు, గ్రుడ్లు తినడం మంచిది. ఆలివ్‌ ఆయిల్‌, నువ్వునూనె వంటకి వాడటం నెలసరి సరిగ్గా ఉంచే చక్కటి నూనెలు. ఇవి గర్భాశయపు నరాల శక్తిని స్థిరపరుస్తాయి. ప్రతి రోజూ రాగి చెంబులో నీళ్ళు ఎక్కుగా తాగడం మంచిది. క్యారట్‌ రసం ప్రతి రోజూ తీసుకుంటే నెలసరి సమస్యలు రావు.
ములక్కాడ, గుమ్మడి వడియాలు, పొట్లకాయ కూర, పచ్చి బొప్పాయి కూర ప్రతి ఆడపిల్ల తీసుకుంటే నెలసరి సమస్యలు తగ్గుతాయి. సంవత్సరానికి మూడుసార్లు మధ్య వయస్సువారు పంచకర్మ చికిత్స చేయుంచుకుంటే అన్ని దోషాలు పోయి నెలసరి చక్కగా సాగుతుంది.
ఆయుర్వేద చిట్కాలు : నెలసరి సరిగ్గా రాని వారు రోజూ ద్రాక్షారసం ఒక గ్లాసు తాగడం మంచిది. రెండు చిటికెల పసుపు, ఒక ,చెమ్చా ధనియాులు రెండు లవంగాలు, రెండు మిరియాులు కలిపి అన్నం మొదటి ముద్దలో తింటే నెలసరి సమస్యు తగ్గుతాయి.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading