ప్రకృతి సౌందర్యం, సంస్కృతి కలబోత ఈ దేశం. కొండలలో నెలకొని ఉన్న వియత్నాం సాహస క్రీడలకు చిరునామాగా నిలుస్తోంది. గిరిజన గ్రామాలు కోకొల్లలు. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా గిరిజనులే కావడం విశేషం. వారి సంప్రదాయాలు, జీవనశైలి అడుగడుగునా ఆశ్చర్యపరుస్తాయి. సముద్ర తీరాలు, గుహలు, పర్వత పంక్తులు, కొండల వాలులో మెట్లు మెట్లుగా ఏర్పాటు చేసిన పంటపొలాలు ఆహ్లాదాన్నిస్తాయి.
వియత్నాం ఆసియా ఖండానికి చెందిన దేశం. ఈ దేశ రాజధాని హానోయ్. వీరి భాష వియత్నీమీస్. వీరి కరెన్సీ డాంగ్. దేశ జనాభా మొత్తం గిరిజన జాతులకు చెందినవారే
‘స్వతంత్రం-స్వేచ్ఛ-సంతోషం’ ఇదీ వియత్నాం దేశ నినాదం. ఒకప్పుడు ఫ్రెంచ్ వలసవాదుల పాలనలో ఉండేది. యుద్ధాలు, అస్థిరత నుంచి బయటపడిన వియత్నాం.. వినూత్న పర్యాటక కేంద్రంగా రూపొందింది.
వియత్నాం రాజధాని హానోయ్ జనాలతో కిటకిటలాడుతుంటుంది. నగరంలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి హాలాంగ్ సముద్రతీరం యునెస్కో హెరిటేజ్ సెంటర్గా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతి పొడవైన సన్డూంగ్ గుహ వియత్నాంలో ప్రత్యేక ఆకర్షణ. వియత్నాం వీసా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వాతావరణం: మేలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు నమోదవుతాయి. వియత్నాంలో చూడవలసినవి
హానోయ్ సిటీ , హాలాంగ్ బీచ్, మేకాంగ్ డెల్టా, మ్యూనీ బీచ్, సన్డూంగ్ గుహ
టూర్ ఆపరేటర్ల ప్యాకేజీ ధరలు రూ.21,000- రూ.57,000 (ఒక్కరికి) దాకా ఉంటాయి.
వియత్నాం పర్యాటకం
Google ad
Google ad
Google ad
Google ad
Google ad