📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

రాజ్ కచోరీ తయారీ విధానం

Google ad

ముందుగా ఒక కప్పుడు మైదా పిండి తీసుకుని జల్లించుకోవాలి. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, సరిపడ ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి కలపాలి. ఇప్పుడు రెండు చెంచాల వంట నూనె వేసి బాగా చపాతీ పిండిని కలిపినట్టు కలపాలి. అలా కలిపాక ముప్పావు కప్పు గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా పోసి కలుపుతూ చపాతీ పిండిలాగా ఉండ చేయాలి, బాగా మద్దించాలి. ఈ పిండిని తడిబట్టలో చుట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి.

ఈ అరగంటలో, ఒక కప్పుడు బఠాణీలు క్యారెట్ లు ఉడకబెట్టుకుని నీళ్లు వడబోయాలి, ఇందులో అల్లం పచ్చి మిరపకాయలు వేసి మిక్సీ లో రుబ్బుకోవాలి.. అవసరం అయితే రెండు మూడు చెంచాల నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బఠాణీలు ముద్దని మూకుట్లో వేసి రెండు చెంచాల నూనె పోసి వేయించాలి. వేయించేటప్పుడు, ఉప్పు ,కారం, ఆమ్ చూర్, గరం మసాలా , జీలకర్ర, ధనియాలపొడి, కొత్తిమీర తరుగు ,వేసి కలపాలి. ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చేదాకా 5 -7 నిమిషాల పాటు కలుపుతూ వేయించి, ఆ ముద్దని పక్కన పెట్టుకోవాలి.

Google ad

ఇప్పుడు మైదా పిండిని తడి బట్టలోనించి తీసి 2 నిమిషాలు మద్దించి రోల్ చేసి…సమానం గా అయిదు ఉండలు చేసుకోవాలి. ఒకొక్క ఉండని అరచేతిలో వేసి వెడల్పుగా నొక్కి, అంచులు పట్టుకుని, గిన్నె ఆకరంలోకి పైకి ఎత్తి , బఠాణీల ముద్దని కొద్దిగా ఈ గిన్నె లాంటి మైదా పిండి లో పెట్టి అన్నివైపుల నించీ మోసేయ్యాలి.

Google ad

అయిదు ఉండలనీ ఇలా చేసుకున్నాక మళ్లీ అరచేతిలో వేసి, వెడల్పు అయ్యేదాక ,నొక్కాలి, మరీ పల్చబడిపోకండా గమనించుకోవాలి..

Google ad
Google ad

ఇప్పుడు ఒక లీటర్ వంట నూనెని మూకుట్లో పోసి, 5–7 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. నూనె కాగాక, ఈ అయిదు రాజ్ కచోరీలనీ నూనెలో వేసి వేయించాలి. నిమిషానికొకసారి అటు ఇటు చట్రం తో తిప్పుతూ వేయించుకోవాలి.కొద్దిగా పొంగి, బాగా బంగారు వర్ణంలోకి వచ్చాక వెడల్పాటి పళ్ళెంలో, టిష్యూ పేపర్స్ వేసి ఈ రాజకచోరీలని మూకుట్లోంచి తీసి, పేపర్ మీద పెట్టాలి.

ఇది పుదీనా చట్నీ, టమాటో సాస్ లతో బాగుంటుంది. 

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading