
శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో కిడ్నీలు కూడా ఉంటాయి. అవి సరిగ్గా పని చేయగలిగితేనే మనం సరిగ్గా పని చేయగలుగుతాం. కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి, పనికిరాని వాటిని పక్కకి తీసేసి, బాడీలో ఫ్లూయిడ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తాయి. ఎక్కువగా ఉన్న నీటిని బ్లాడర్ లోకి పంపించి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. అయితే, ఏ కారణం చేతనైనా కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అక్కర్లేని వాటిని బయటికి పంపించలేకపోతే కిడ్నీల్లో క్రిస్టల్స్ ఏర్పడుతాయి. వాటినే కిడ్నీల్లో రాళ్ళు అంటూంటాం. ఈ రాళ్ళు చిన్నవీ, పెద్దవీ ఉంటాయి. చిన్న వాటిని ఈజీగానే క్యూర్ చెయ్యచ్చు. ఇక్కడ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి గల కారణాలూ, లక్షణాలూ, సహజంగా ఈ సమస్యని అధిగమించే పద్ధతులూ ఉన్నాయి.
కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయంటే..

కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ముఖ్య కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం. దాంతో పాటు యూరిన్లో ఎక్కువ యాసిడ్ ఉండటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా ఈ సమస్యకి దారి తీస్తాయి. తొందరగా కనుక్కుంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా క్యూర్ చేయొచ్చు.
మనం తిన్న ఆహార పదార్ధాలు జీర్ణం అయిన తరువాత కిడ్నీ లో వడకట్ట బడతాయి. కిడ్నీ లోని కొన్ని వ్యర్ధాలు రసాయనక చర్యలు ద్వారా స్పటికీకరణ చెంది రాళ్లు గా ఏర్పడ తాయి ( ఇవి కాల్షియం, ఆక్సలేట్స్, యూరేట్, సిస్టీన్, క్సాoధీన్, ఫాస్ఫేట్..) మూత్రం acedic అయితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న రాళ్లు తగినంత నీరు తాగితే మూత్ర మార్గం ద్వారా బయటకు వెళ్లి పోతాయి.మూత్రం చిక్క బడితే రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.
చిన్న సైజ్ వి అయితే మందుల తో తగ్గి పోతాయి. పెద్ద సైజ్ వి, కరగని వి అయితే ఆపరేషన్ చెయ్యాలి.ఇప్పుడు కొత్త విధానాల ద్వారా ఆపరేషన్ లేకుండా ప్రత్యేక పద్ధతులలో రాళ్లను చిన్నవి చేయటం తొలగించడం చేస్తున్నారు.
దీనికి అసలైన మందు ఎక్కువగా నీరు త్రాగటం.నీరు ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. చిన్న చిన్న రాళ్లు ఉంటే నీటిలో కరిగిపోతాయి.తక్కువ నీరు తాగటమే వ్యాధి రావడానికి కారణం. ఇప్పుడు నేను ఏమి చేస్తున్నాను అంటే ఉదయం లేచిన వెంటనే అర లీటర్ నీళ్లు తాగుతాను. అరగంట తర్వాత ఇతర కార్యక్రమాలు.
తినకూడని పదార్ధాలు. టమాటాలు, ములక్కాడలు
కిడ్నీ లో రాళ్లకు మందు. ఇందులో పోటాషియం సిట్రేట్, మెగ్నీషియం సిట్రేట్ ఉన్నాయి. ఇవి రాళ్లను కరిగిస్తాయి. ఏర్పడనివ్వవు.
లక్షణాలు

కడుపులో, నడుం కింద భాగం లో నొప్పి, యూరిన్ ఆపుకోలేకపోవడం, ఒక్కోసారి యూరిన్ లో బ్లడ్ పడడం, వికారంగా ఉండడం, వాంతులు కావడం, చెమటలు లేదా చలి…ఇవన్నీ కిడ్నీ లో రాళ్ళు ఉంటే కనిపించే లక్షణాలే. అయితే ఇవన్నీ పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కువగానో తక్కువగానో ఉంటాయి. పైగా ఈ సమస్య ఉన్న ప్రతివారిలోనూ ఈ లక్షణాలన్నీ కనిపించాలన్న రూల్ కూడా లేదు.
కిడ్నీ బీన్స్ / రాజ్మా

రాజ్మా చూడడానికి కూడా కిడ్నీల లాగానే ఉంటాయి. ఇవి కిడ్నీలని క్లెన్స్ చేసి కిడ్నీ లో రాళ్ళని కరిగిస్తాయని అంటారు. రాజ్మా లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు గా ఉన్న మినరల్స్, బీ విటమిన్స్ కిడ్నీలని శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి.
2. యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోనూ, యూరిన్ లోనూ ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది. రెగ్యులర్ గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరం లోని అక్కర్లేని పదార్ధం బైటికి పోతూ ఉంటుంది.
3. దానిమ్మ రసం

దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో ఏర్పడే క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది. ఇందులో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాల వల్ల కిడ్నీల్లో ఉన్న టాక్సిన్స్ బైటికి వెళ్ళిపోతాయి.
4. డాండలియన్ రూట్

డాండలియన్ టీ కిడ్నీలని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఈ టీ కిడ్నీలకి టానిక్ లాగా కూడా పని చేస్తుంది. అరుగుదలకు తోడ్పడి అక్కర్లేని వాటిని బైటికి పంపడంలో ఉపకరిస్తుంది.
తులసి

తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారౌతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ లోని రాళ్ళు చిన్న చిన్న ముక్కలు గా విడిపోయి యూరిన్ ద్వారా బైటికి పోయేలా చేస్తుంది. బేసిల్ పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది.
6. లెమన్, ఆలివ్ ఆయిల్

లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు స్మూత్ గా బైటికి వెళ్ళిపోతాయి.
7. పుచ్చకాయ

పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఎసిడిక్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసం లో చిటికెడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి ఈజీ గా చెక్ పెట్టచ్చు.
8. ఖర్జూరాలు

ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. దీని వల్ల కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. వీటితో పాటూ, కీరదోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోయేలా చేస్తాయి. అయితే, ఈ పద్ధతులు పాటించే ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి మొదలు పెట్టాలి.
Raju's Resource Hub