ఉప్పు సత్యాగ్రహం
ఉప్పు సత్యాగ్రహం అనగానే ఆంగ్లేయులు అవహేళన చేశారు. పిల్లచేష్టలంటూ పగలబడి నవ్వారు. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇదేం ఉద్యమమంటూ మహాత్ముడిని అనుమానించారు. వద్దని వారించారు. 61 ఏళ్ల ఆయన మాత్రం 386 కిలోమీటర్ల పాదయాత్రకు బయల్దేరారు. ఉప్పు ఉప్పెనలా మారితే… నవ్విన నోళ్లే మూతబడ్డాయి. వద్దన్నవారే వెంటవచ్చారు. గాంధీజీ ఉప్పును ఎంచుకోవటానికి నేపథ్యముంది. భారత్ నుంచి వివిధ ముడి సరకులు తీసుకొని లండన్ వెళ్లిన ఓడలు కొన్ని తిరిగివచ్చేప్పుడు ఖాళీగా రావాల్సి వచ్చేది. అలా రావటంతో నష్టమేగాకుండా… సముద్రంలో ఓడలకు ప్రమాదాలు జరిగేవి. వీటిని నివారించటానికి భారత్ లో విపరీతమైన మార్కెట్ గల ఉప్పును ఓడల్లో నింపి దిగుమతి చేయటం మొదలెట్టారు ఆంగ్లేయులు. లాభాలు ఆర్జించడానికి భారత్ లో ఉప్పు తయారీ, అమ్మకాలపైనా ఆంక్షలు, అధిక పన్నులు వేశారు. సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టారు. గాలి, నీరు…
Read More
You must be logged in to post a comment.