తెలుగు సాహిత్యం

కందుకూరి వీరేశలింగం పంతులు – సంస్కరణ శీలి ..సంస్కారధీశాలి

ఆయనో సాహితీ శిఖరం.. సంస్కరణలకు ప్రతిరూపం.. అఖండ గోదావరి తీరాన ఊపిరిపోసుకుని.. తెలుగు జాతి జాగృతికి ఊపిరిలూదిన చైతన్యఝరి.. కొత్త వెలుగులకు తెరదీసి.. సమాజాన్ని నిద్రలేపి.. మెలకువ దారుల్లో నడిపించిన నవయుగ వైతాళికుడు.. మూఢ నమ్మకాలు.. సాంఘిక దురాచారాలపై అలుపెరగక పోరాడిన యోధుడు.. తెలుగునాట సామాజిక, సాహిత్య రంగాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన బహుముఖ సాహితీ పండితుడు.. మగువల అభ్యున్నతికి శ్రమించిన స్త్రీ జనోద్ధారకుడు.. యావదాస్తిని సమాజ అభ్యున్నతికి ధారపోసిన త్యాగధనుడు.. శతాబ్దాల ముందుచూపున్న దార్శనికుడు.. …

కందుకూరి వీరేశలింగం పంతులు – సంస్కరణ శీలి ..సంస్కారధీశాలి Read More »

రెంటికీ చెడ్డ రేవడు – సామెత

రేవడు అంటే చాకలి లేదా రజకుడు. నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఉతికిన బట్టలు ఎగువన తెరపగా ఉన్న చోట ఆరేసి మిగిలిన బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇంతలో దూరంగా నదకి ఉధృతంగా నీరు రావడం చూసి, గబగబా ఆరవేసిన గుడ్డలు తీయడానికి పరుగెత్తాడు. అతడు ఆరవేసిన బట్టలు సేకరించే లోపలే ఆ ధౌతవస్త్రాలు వరదనీటిలో కొట్టుకొని పోతున్నాయి. దిగువన ఉతకవలసిన బట్టలనైనా కాపాడుకొందామని కిందకు పరుగులు తీశాడు. అతనికంటే ముందే వరద ప్రవాహంలో అవీ కొట్టుకొని పోయాయి. …

రెంటికీ చెడ్డ రేవడు – సామెత Read More »

గొంతెమ్మ కోరికలు

పాండు రాజు మొదటి భార్య అయిన కుంతీ దేవి యొక్క వికృతి నామం గుంతి, గొంతీ. ఆ “గొంతీ” కి గౌరవ వాచకం గొంతి+అమ్మ = గొంతెమ్మ . కురుక్షేత్ర యుద్ధం సమయంలో , కర్ణుడితో ఆమె మాట్లాడే సమయాన ఆమె “కర్ణుడూ బ్రతకాలి, అర్జునుడూ బ్రతకాలి” అని కోరుకున్నది, కానీ అది అసంభవము, అయితే ఇద్దరిలో ఒకరే ఉండగలరు తప్ప ఇద్దరు ఉండాలి అంటే అది సాధ్య పడని పని అని కర్ణుడు చెపుతాడు. కాబట్టి సాధ్యపడని కోరికలను గొంతెమ్మ కోర్కెలు అని అంటారు “అవ్వా కావాలి , …

గొంతెమ్మ కోరికలు Read More »

సింగి నాదం -జీలకర్ర

ఇది ఒక తెలుగు సామెత. ఎప్పుడో చదివిన కథ. బ్రిటిషు వారు వర్తకమునకు మన దేశమున అనుమతి పొంది, మెల్ల మెల్లగా మన రాజుల అంతఃకలహాలను ఆసరా చేసుకొని వారి సూత్రం ఉందికదా “విభజించి పాలించు” దానితో వారు తగువులు పెంచి వారిని ఆశ్రయించేటట్టుగా తయారు చేసారు. దొరలు నెమ్మదిగా తమ సిపాయలను రాజుల కు ఇచ్చి, వారి రాజ భటులను తొలగించే పన్నాగం పన్నారు. దానితో రాజ భటులకు ఉపాధి లేక దొంగ తనాలు మొదలుబెట్టి …

సింగి నాదం -జీలకర్ర Read More »

విశ్వనాధ సత్యనారాయణ

ఆధునిక యుగంలో మొదటి తెలుగు మహాకవి, జ్ఙానపీఠ్ అవార్డు అందుకున్న మహాకవి. కవిసామ్రాట్, పద్మభూషణ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులతో సత్కరింపబడిన వాడు. 1966 నుండి 1976 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి. కవిగా, కథకుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడుగా, మహావక్తగా, కావ్యగాయకుడుగా సుమారు 60 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలను అలరించారు. కృష్ణాజిలా నందమూరు గ్రామంలో శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు 1895 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. విశ్వనాథ గారు రచించిన వాటిలో వేయి పడగలు …

విశ్వనాధ సత్యనారాయణ Read More »

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే)

జ్ఙానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు కవి, సినిమా గేయ రచయిత నారాయణ రెడ్డి. ఈయన 1931 నవంబర్ 15వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జన్మించారు. ఉస్యానియా యూనివర్శిటీలో విద్యాభ్యాసం సాగించి ‘‘ఆధునికాంధ్ర కవితత్త్వం పై పరిశోధనలు జరిపి ధీసిస్ వ్రాసినందువలన డాక్టరేట్ బిరుదు లభించినది. 1954సం .లోఈయన రచించిన నవ్వని పువ్వు 1954లో అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు, నాగార్జునా సాగరము, రామప్ప వంటి సంగీత రూపకాలు, దివ్వెల మువ్వలు, విశ్వనాధుడు వంటి …

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే) Read More »

రాయ్రపోలు సుబ్బారావు

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని’’అనే సుప్రసిద్ధ గేయాన్ని వ్రాసిన రాయ్రపోలు సుబ్బారావు 1914 సం.లో శాంతినికేతనంలో రవీంద్రనాథ్ టాగోర్ అంతేవాసిగా చదువుకున్నాడు. భావకవిత్వం ప్రారంభించి అశువుగా చెప్పసాగాడు. భజగోవిందం శ్లోకాలను, సౌందర్యలహరి శ్లోకాలను తెలుగులోనికి అనువదించాడు.ఉమర్ ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషు నుండి మధుకలశంగా తెలుగులోనికి అనువాదం చేశారు. ఈయన చేతిలో గోల్డ్ స్మిత్ రచన హెర్మిట్ ను లలిత గానూ టెనిసన్ రచన డోరాను అనుమతి గానూ తెలుగు కావ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. తృణకంకణం …

రాయ్రపోలు సుబ్బారావు Read More »

తెలుగు సామెతలు

ఆడి తప్పరాదు, పలికి బొంక రాదుఅడవి కాచిన వెన్నలమొరిగే కుక్క కరవదుఆడలేక మద్దెల ఒడినట్టుయధారాజ తథా ప్రజఇచే వాడ్ని చూస్తే, చచ్చేవాడైనా లేచుఇదుగో పులి అంటే, అదుగో తోక అన్నట్టుఇల్లలక గానే పండుగ కాదుఇంట గెలిచి, రచ్చ గెలవాలిఉన్న మాటంటే ఉలికి పడ్డట్టుఎలుకకు పిల్లి సాక్షిఏ పాటు తప్పినా సాపాటు తప్పదుఏ పుట్టలో ఏ పామున్నదోఒకే దెబ్బకు రెండు పిట్టలుఓడలు బండ్లు, బండ్లు ఓడలగునుకంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునాకడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువబూడిదలో పోసిన పన్నీరుకథకు కాళ్లు …

తెలుగు సామెతలు Read More »

మొల్ల

అతుకూరి మొల్ల (1440-1530) కవయుత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును వ్రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శైలి చాలా సరళమైనదని మరియు రమణీయమైనదని ప్రసిద్ధి. కడపజిల్లా గోపవరం ప్రాంతానికి చెందినదని అంటారు. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఇక్కడ ఉన్నది. గ్రామస్తులు ఈ బండకు పూజలు కూడా చేస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరు గ్రామానికి చెందివుందటారని అంటారు. మొల్ల …

మొల్ల Read More »

అన్నమయ్య

అన్నమయ్య లేక తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదట వాగ్గేయకారుడు. వాగ్గేకారుడుకి అర్థం సాధారణ భాషలో గేయాలను కూర్చేవాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య జివితకాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో …

అన్నమయ్య Read More »

బమ్మెర పోతన

బమ్మెర పోతన 15వ శతాబ్ధంలో వరంగల్‌ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ, కేశన దంపతులకు జన్మించాడు. వ్యవసాయం చేసేవాడు. ప్రధమ రచన భోగినీ దండకం. సింగభూపాలుడు అనే రాజుకు అంకితం చేశాడు. తరువాత తన రచనలన్నీ భగవతర్పణం గావించాడు. బమ్మెర పోతనపోతన కవి, కవిసార్వభౌముడైన శ్రీనాధుని బంధువని అంటారు. శ్రీరాముని ఆనతి మేరకు సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతాన్ని ”ఆంధ్రమహాభాగవతము” అనే పేరున తెనిగించాడు. పోతన ఇతర రచనలు వీరభద్ర విజయము, నారాయణ శతకం మొదలగునవి. …

బమ్మెర పోతన Read More »

శ్రీనాధుడు

శ్రీనాధ మహాకవి (1365-1441) 15వ శతాబ్ధంలో కాల్పట్టణం అనే గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు భీమాంబ, మారయ్య దంపతులు. కవిత్రయం తరువాత సమకాలికుడైన కవి. కొండవీటి రాజైన పెదకోమటి వేమారెడ్డి దగ్గర విద్యాశాఖాధికారిగా పని చేశాడు. ప్రధమార్థంలో చాలా విలాసవంతమైన జీవితం గడిపాడు చివరి దశలో బీదరికంతో బాధపడ్డాడు. విజయనగర రాజైన రెండవ దేవరాయల కాలంలో డిండిమభట్టు అనే పండితునితో వాదించి నెగ్గి కవిసార్వభౌమ అనే బిరుదు పొందాడు. శ్రీనాధుని రచనలు శృంగారనైషధం, పల్నాటి వీరచరిత్రము, నందనందన చరిత్రము, …

శ్రీనాధుడు Read More »

ఎఱ్ఱన

ఎఱ్ఱన 14వ శతాబ్ధంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు పోతమ్మ సూరన్న దంపతులు. కవిత్రయంలో చివరివాడు. నన్నయ్య వదలివేసిన అరణ్యపర్వంను పూర్తిచేశాడు. రెడ్డిరాజయిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో (1325-1353) కవిగా ఉన్నాడు. సంస్కత గంథ్రాలైన హరివంశము, రామాయణములను తెలుగులో వ్రాసి తన రాజైన ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. నరసింహపురాణమును రచించాడు. ఎఱ్ఱనను ఎఱ్ఱాప్రగడ అని కూడా పిలుస్తారు.

తిక్కన

తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకడు. క్రీ.శ. 1205 నుండి 1288 వరకు జీవించాడు. తిక్కన నన్నయ మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మహాభారతంలోని అరణ్యపర్యమును వదలి మిగతా 15 పర్యాలు రచించాడు. జన్మస్ధలం గుంటూరు (గుంటూరు జిల్లా). కాకతీయుల కాలం నాటివాడు. అప్సటి నెల్లూరు రాజు మనుమసిద్ధి దగ్గర ముఖ్యమంత్రిగా చేశాడు. దాయాదుల వలన రాజ్యం కోల్పోయిన మనుమ సిద్ధికి, కాకతీయ మహారాజు గణపతిదేవుని సహాయంతో తిరిగి రాజ్యాన్ని కట్టబెట్టాడు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే …

తిక్కన Read More »

నన్నయ

పంచమ వేదమైన వ్యాసభారతాన్ని తెలుగులో వ్రాయుటకు పూనుకొని అందులోని ఆదిసభా పర్యాలను పూర్తి చేసి అరణ్య పర్వంలోని చతుర్థాశ్యాసంలో 141వ పద్యం వరకు మాత్రమే పూర్తిచేసి పరమపదించాడు. ఆ తరువాత భాగాలను తిక్కన, ఎఱ్ఱనలు పూర్తి చేసారు. అందుకే వీరి ముగ్గురిని కవిత్రయం అంటారు. నన్నయ జన్మస్థలం పశ్చిమ గోదావరిలోని తణుకు. చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని (క్రీ. శ. 1022-1063) ఆస్థానకవి. నన్నయకు ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలవు. ఇతర రచనలు ఆంధ్రశబ్ధ చింతామణి.

తెనాలి రామలింగ కవి (రామకృష్ణ)

ఇతని స్వస్థలం తూములూరు(పెరిగిన ఊరు) తెనాలి (గుంటూరు జిల్లా) తల్లి లక్ష్మమ్మ. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధుడు. తొలుత సామాన్య వ్యక్తి అయిన ఇతడు కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరుడు అయ్యాడు. హాస్యకవిగా, వికటకవిగా పేరు పొందాడు. సత్తెనపల్లి మండలానికి చెందిన లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్యాంబ దంపతులు ఇతని తల్లితండ్రులు. తాత, సుదక్షిణా పరిణయం వ్రాసిన అప్పన్నకవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడులోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ …

తెనాలి రామలింగ కవి (రామకృష్ణ) Read More »

దూర్జిటి (పెద దూర్జటి)

దూర్జటి పేరుతో ఇంకో నలుగురున్నారు. అందువలన ఇతనిని పెద దూర్జటి అని కూడా అంటారు. దూర్జటి (పొత్తసీమ) ప్రస్తుతం చిత్తూజిల్లా శ్రీకాళహస్తి నివాసి. తల్లి దండ్రులు నారాయణ, సింగమ్మ దంపతులు. తాత జక్కయ నారాయణ. దూర్జటి కాళహస్తీశ్వర భక్తుడు. భక్తి ప్రబంధమైన శ్రీ కాళహస్తీర మహాత్యం మరియు శ్రీకాళహస్తీశ్యర శతకం దూర్జటి యొక్క ప్రధాన రచనలు. దూర్జటి చెప్పినవి, మరియు చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నవి. క్రీ.శ. 1480 నుండి 1545 వరకు జీవించాడని …

దూర్జిటి (పెద దూర్జటి) Read More »

పింగళి సూరన

తెలుగు సాహిత్యమును ఏలిన కవులలో పింగళి సూరన ఒకరు. సూరన రాఘవ పాండవీయము అనే ఒక అత్యుద్భుతమైన శ్లేష కావ్యమును రచించెను. ఈ కావ్యంలోని ప్రతి పద్యమును రామాయణంలోని కధకు, భారతంలోని కధకు ఒకేసారి అన్వయించుకోవచ్చును. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొది నవలగా భావిస్తారు. మరియు తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి కావ్యంగా పరిగణిస్తారు. కళాపూర్ణోదయము ప్రేమకావ్యము. ఇతని తల్లి అబ్బమాంబ తండ్రి అమరన్న. ఇతను నంద్యాలలోని కనాల గ్రామములో నివసించేవాడని భావిస్తున్నారు. …

పింగళి సూరన Read More »

మాదయ్య గారి మల్లన

ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్తావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్న. లగ్నము పెట్టటం దగ్గరనుండి గృహప్రవేశము వరకు 75 గద్య పద్యములలో ఆనాటి పెళ్ళితంతు గురించి తన ”రాజశేఖర చరిత్రలో” వర్ణించాడు. ఇతను 516 గద్య పద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అనే కావ్యమును రాయల ఆస్థానములో చేరక ముందే రచించినాడు. తన కావ్యమును వినుకొండ-గుత్తిసీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పన మంత్రికి అంకితమిచ్చాడు. అప్పన మంత్రి తిమ్మరుసు మేనల్లుడు మరియు అల్లుడు కూడా. …

మాదయ్య గారి మల్లన Read More »

రామరాజ భూషణుడు (భట్టుమూర్తి)

రామరాజ భూషణుడుగా పేరుగాంచిన భట్టుమూర్తి తెలుగు కవి మరియు సంగీత విద్యాంసుడు.శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళీయ రామరాయలు ఆస్థానమునకు ఆభరణము వలె ఉండుట వలన ”రామరాజ భూషణుడు” అనే పేరు వచ్చినది. భట్టుమూర్తి నెల్లూరు ప్రాంతమునకు చెందినవాడుగా భావించుచున్నారు. ఇతని రచనలు వసుచరిత్రము, నలోపాఖ్యానము మరియు సరస భూపాలీయము (కావ్యాలంకార సంగ్రహము మరోపేరు) అనే కావ్యములు. వసుచరిత్ర వీటన్నిలోని ప్రసిద్ధమైనది. కావ్యాలంకార సంగ్రహము భట్టుమూర్తి రచించిన మొది గ్రంధము. సరసభూపాలీయమని దీనికి మరోపేరు. కావ్యధ్వని రసాలంకారములను గురించి, నాయికా …

రామరాజ భూషణుడు (భట్టుమూర్తి) Read More »

అయ్యలరాజు రామభద్రుడు

ఈయన కడప జిల్లాకు చెందిన వాడు. క్రీ.శ 1500 నుండి క్రీ.శ 1565 కాలానికి చెందినవాడుగా భావిస్తున్నారు. అయ్యaరాజు వంశానికి చెందిన అయ్యరాజు తిప్పయ్యగారి మనుమడుని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పగారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన ”రామాభ్యుదయాన్ని” శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అళీయ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. రామాభ్యుదయము ఎనిమిది ఆశ్యాశాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం. ఈ …

అయ్యలరాజు రామభద్రుడు Read More »

నందితిమ్మన

నంది తిమ్మనను ముక్కుతిమ్మన అనికూడా అంటారు. ముక్కు పెద్దదిగా ఉండటం వలన మరియు కవితలలో ముక్కును చక్కగా వర్ణించడం వలన ఇలా పిలుస్తారు.తిమ్మన, రాయలు భార్య తిరుమలదేవితో అరణంగా వచ్చినవాడు. ఇతను అనంతపురానికి చెందినవాడని అంటారు. తల్లిదండ్రులు సింగన్న, తిమ్మాంబ దంపతులు. తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడు. ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (మలయ మారుత కవి) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయ ఆస్థానంలో ఉండేవారు. తిమ్మన తన …

నందితిమ్మన Read More »

అల్లసాని పెద్దన

15-16 శతాబ్డాల మధ్య కాలంలో ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఆగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత గండపెండేరం తొడిగించుకున్నవాడు. పెద్దన రచించిన మనుచరిత్ర ప్రధమ ప్రబంధంగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో రాయలవారికి సలహాలు ఇచ్చేవాడు. అందుచేత ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా పిలుస్తారు. పెద్దన రచనలు : మనుచరిత్ర (స్వారోచిపమనుసంభవము)లభ్యంకాని రచనలు : హరికథా సారము, …

అల్లసాని పెద్దన Read More »

గురజాడ అప్పారావు

ఈయన ఆ రోజు ల్లో చక్కటి భాషలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం సాహితీ లోకం లో ఒక ప్రత్యేకమైనది. ఈ కన్యాశుల్కం నాటకం ఎంత గానో ప్రసిద్ధి చెందినది. ఇది నిజంగా సుస్థిర స్థానం దక్కించుకుంది నిజంగా ఈ నాటకం లో గిరీశం మధురవాణి రామప్పంతులు వంటి పాత్రలు ఎంత గానో ప్రఖ్యాతి చెందాయి.   ఈయన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం లో జన్మించారు. …

గురజాడ అప్పారావు Read More »

కుక్కతోక వంకర

 పూర్వం కుక్కలకి తోక వంకరగా ఉండేది కాదు(ట)!.. సాఫీగా, కర్రలా ఉండేది, దాని తోక వంకరవడానికి ఒక కథ వుంది.  ఒక అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిలో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలుండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది. అడవికి రాజైన సింహం.. కుక్కలోని ప్రతిభని గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో …

కుక్కతోక వంకర Read More »

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, …

తాళ్ళపాక అన్నమాచార్యులు Read More »