యమ్. విశ్వేశ్వరయ్య (1861-1962) / M Visweswaraiah
భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వీరు తెలుగువారు. వీరి పూర్వులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. విశ్వేశ్వరయ్య మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ,., పూణే సైన్స్ కాలేజ్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులయ్యారు.బొంబాయి ప్రజాపనుల శాఖలో చేరి ఆ తరువాత, విశ్వేశ్వరయ్య భారత నీటి పారుదల కమీషన్ లో చేరారు. ఈయన దక్కన్ ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందిచారు. ఆనకట్టలలో ఏర్పరచటానికి ఆటోమేటిక్ వరద గేట్లను ఈయన రూపకల్పన చేశారు. వీటిని 1903లో మొదటిసారిగా పూణే సమీపంలోని ఖడక్ వాస్లా వద్ద ఏర్పరచారు. ఆ తరువాత ఇటువంటి గేట్లనే గ్వాలియర్, మైసూర్ వద్ద గల కృష్ణరాజసాగర్ ఆనకట్టలలో కూడా నిర్మించారు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించే నీటిపారుదల వ్యవస్థను నిర్మించటంతో ఆయనకు గొప్ప పేరు ప్రతిష్టలు లభించాయి.…
Read More
You must be logged in to post a comment.