Yanam History ( యానాం చరిత్ర )
ఇది ఎప్పటి చరిత్రో. 16 వ శతాబ్దంలో తొలిసారిగా డచ్ పాలకులు తమ రాజ్యాన్ని విస్తరించే యోచనతో భారతదేశంలో కాలనీలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా కోరమండల్, మలబార్, బెంగాల్ తీర ప్రాంతాలు అందులో ప్రధానమైనవి. కోరమండల్ తీర ప్రాంతానికి పులికాట్ అధికార కేంద్రం. అలాగే తెలుగు నేలపై భీమునిపట్నం, కాకినాడ, పాలకొల్లు, మచిలీపట్నం మొదలైన ఊర్లు ముఖ్యమైనవి. ఈ ఊర్లకు దరీ దగ్గర ఎక్కడ తమకు ఎక్కువగా నీరు, వసతి, రవాణా సౌకర్యం లభిస్తుందో అలాంటి ప్రదేశాలను డచ్ వారు కాలనీల కోసం ఎంపిక చేసుకున్నారు. అక్కడే నిర్మాణాలు చేసుకోసాగారు. తగ్గిపోయిన డచ్ వారి ప్రాబల్యం అలా డచ్ వారు తెలుగు నేలపై ఏర్పాటు చేసుకున్న కాలనీలలో ఒక్కటే యానాయోన్. అదే కాలక్రమేణా యానాంగా మారింది. యానాంలో కార్యకలాపాలు చేస్తున్న డచ్ వారికి విజయనగర రాజుల సహకారం ఉండేది.…
Read More
You must be logged in to post a comment.