అ. దేహదారుడ్యాన్ని పెంచే వాళ్ళు ఈ పచ్చి గుడ్లను ఎక్కువ తీసుకుంటారు. అలా తీసుకోవడం వలన ఎక్కువ పోషకాలు వస్తాయి అని నిపుణులు చెపుతున్నారు.
ఆ. ఈ పచ్చి గుడ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన హృదయానికి సంబందించిన జబ్బులు వస్తాయి అని కూడా నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే పచ్చి గుడ్ల లో ఎక్కువ బాక్టీరియా ఉంటుంది.
2.ఉడికించిన గుడ్లు
అ. మన నిత్య జీవితం లో ఎక్కువ శాతం మంది ఉడికించిన గుడ్లును తింటారు.
ఆ . ఈ ఉడికించిన గుడ్లులో కూడా బాగా పోషకాలు ఉంటాయి. వైద్య నిపుణులు కూడా రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు.
ఇ . ఉడికించిన గుడ్లును నెమ్ము ఉన్న వాళ్ళు రోజుకి రెండు గుడ్లు తింటే చాలా వరకు నెమ్ము తగ్గుతుంది.
3.నూనెలో వేయించిన గుడ్లు
ఈ రకం గుడ్లు మనం రుచి కోసం మరియు కొంచెం కారం తినడం ఇష్ట పడేవాళ్ళు ఇలాంటివి చేసుకోని తింటారు. పైన రెండు రకాల తో పోలిస్తే దీనిలో కొంచం పోషకాలు తక్కువ గా ఉంటాయి.
పచ్చి గుడ్లలో పోషకాలు చాలా ఎక్కువ గా ఉంటాయి, కానీ బాక్టీరియా కూడా ఉంటుంది. అది కూడా నాటు కోడి గుడ్లు అయితే తినవచ్చు. ఇప్పుడు వచ్చే గుడ్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఈ రకం గుడ్లను మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది.
ఉడికించిన గుడ్లు అయితే ఆరోగ్యానికి మంచిది . ఈ ఉడికించిన గుడ్లు చిన్న పిల్లలకి రోజు కి ఒక గుడ్డు తినిపిస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటారు.
తెలుపు, బ్రౌన్ కలర్ గుడ్డు
సాధారణంగా కోడి గుడ్లను మనం ఎక్కువగా తీసుకుంటుంటాం. ఇందులో బ్రాయిలర్, నాటు కోడి గుడ్లు ముఖ్యమైనవి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే, వీటికితోడు బ్రౌన్ (గోధుమ రంగు) గుడ్లు కూడా మనకు లభిస్తున్నాయి. ఇవి తెల్లటి గుడ్లకంటే మంచివని అంతా భావిస్తుంటారు. వాస్తవానికి రంగుతో సంబంధం లేకుండా, గుడ్డు ఏదైనా సరే పోషకాలు మాత్రం ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండు రకాల గుడ్లలో విటమిన్లు, మినరల్స్తో పాటు శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రుచి విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లలో కొద్ది తేడా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం సమానమే. నిజానికి కోడి గుడ్డు పెంకు ఏ రంగులో ఉన్నా వాటిల్లోని పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి.
ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్.. కేలరీలు, ప్రొటీన్స్, కొలెస్ట్రాల్ విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లు సమానంగా ఉంటాయి. బ్రౌన్ గుడ్లలో మాత్రం ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద తేడా కాదని నిపుణులు చెబుతున్నారు. తెల్లవైనా, బ్రౌన్వి అయినా 100 గ్రాముల గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కానీ బ్రౌన్ ఎగ్స్ను సేంద్రియ పద్ధతి(ఆర్గానిక్)లో ఉత్పత్తి చేయడం వల్ల అందులో పోషకాలు అధికంగా ఉంటాయన్న అపోహతోనే వినియోగదారులు వీటిని కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి బ్రౌన్ ఎగ్స్ ఉత్పత్తి తక్కువ కాబట్టే డిమాండ్ ఎక్కువని, అందుకే అవి అధిక ధర పలుకుతున్నాయని నిపుణులు అంటున్నారు.
కోళ్లను బట్టి సైజు… గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, బ్రౌన్వి కాస్త చిన్నగా ఉంటాయి. గుడ్డు పరిమాణం కోడి సైజును బట్టి ఉంటుంది. అలాగే వేసవిలో పెట్టే గుడ్లు చిన్నవిగానూ, చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగానూ ఉంటాయి.
కావల్సినవి రొయ్యలు- 250 గ్రాములు ఉల్లిపాయలు- రెండు టొమాటోలు – రెండు వెల్లుల్లి రేకలు – 10 అల్లం ముక్క – చిన్నది గరం మసాలా- అరచెంచా పసుపు – అరచెంచా పచ్చిమిర్చి – రెండు కాయలు కారం – చెంచా ధనియాలు – చెంచా నెయ్యి – రెండు చెంచాలు నీళ్లు- రెండు కప్పులు ఉప్పు – తగినంత తయారు చేసే విధానం రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లీ, ధనియాలు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక మెత్తగా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, తగినంత ఉప్పూ, గరంమసాలా, కారం, పసుపు వేయాలి. పచ్చివాసన పోయాక కప్పు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు కాస్త మరిగాక టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి మిగిలిన నీళ్లు పోసి, మూత పెట్టాలి. రొయ్యలు కూడా ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి.
Prawns Fry / రొయ్యల వేపుడు
కావల్సినవి రొయ్యలు – పావుకేజీ నూనె- మూడు చెంచాలు దాల్చినచెక్క – చిన్నముక్క జీలకర్ర – చెంచా యాలకులు – రెండు ఉల్లిపాయ – ఒకటి పెద్దది పచ్చిమిర్చి – ఒకటి కరివేపాకు – రెండు రెబ్బలు అల్లం, వెల్లుల్లి పేస్టు – చెంచా కారం – చెంచా ధనియాల పొడి – చెంచా పసుపు – పావు చెంచా గరంమసాలా – అర చెంచా మిరియాల పొడి – అర చెంచా టొమాటోలు – రెండు ఉప్పు – తగినంత నీళ్లు – అర కప్పు మసాలా కోసం: అల్లం వెల్లులి ముద్ద – చెంచా, కారం – చెంచా, ధనియాల పొడి – రెండు చెంచాలు, పసుపు – అరచెంచా, గరం మసాలా – అర చెంచా, మిరియాల పొడి – చెంచా, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం ఒక గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలపై మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. పది నిమిషాలయ్యాక పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె పోయాలి. అందులో రొయ్యలు వేసి వేయించి తీసుకోవాలి. అదే నూనెలో దాల్చినచెక్కా, యాలకులూ, జీలకర్ర వేయించి ఉల్లిపాయముక్కలూ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. తరువాత అల్లం,వెల్లులి ముద్దా, తగినంత ఉప్పూ, కారం, ధనియాలపొడీ, పసుపూ, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో టొమాటో ముక్కలు వేసి కాసిని నీళ్లు పోయాలి. టొమాటో ముక్కలు ఉడికాక ముందుగా వేయించిపెట్టుకున్న రొయ్యలు వేసి మంట తగ్గించాలి. అవి ఉడికాక దింపేస్తే చాలు.
Prawns Fry / రొయ్యలు, మునగాకు వేపుడు
కావల్సినవి రొయ్యలు- పావుకేజీ మునగాకులు – మూడు చెంచాలు పసుపు- పావు చెంచా అల్లం, వెల్లుల్లి ముద్ద – చెంచా కారం- చెంచా ఉప్పు – తగినంత ధనియాల పొడి – అర చెంచా గరంమసాలా – అరచెంచా నూనె- రెండు చెంచాలు చింతపండు గుజ్జు- చెంచా తయారు చేసే విధానం గిన్నెలో శుభ్రం చేసుకున్న రొయ్యలకు పసుపు, అల్లం, వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. అరగంట అయ్యాక పొయ్యిమీద బాణలి పెట్టి అరచెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక మునగాకు వేసి బాగా వేయించి విడిగా తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి రొయ్యలు వేసి వేయించుకోవాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక మునగాకూ, చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి మంట తగ్గి్గంచాలి. రొయ్యలు ఉడికాక కావాలనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసి దింపేయాలి.
Prawns Curry / రొయ్యల కర్రీ
కావల్సినవి రొయ్యలు – పెద్ద సైజువి 15 ఆవనూనె- నాలుగు చెంచాలు లవంగాలు – మూడు బిర్యానీ ఆకులు – మూడు ఉల్లిపాయ – ఒకటి అల్లం తరుగు – చెంచా వెల్లుల్లి రేకలు – రెండు పచ్చిమిర్చి – రెండు కొబ్బరి తురుము -పావుకప్పు కారం – చెంచా కొబ్బరిపాలు – అరకప్పు నీళ్లు- అర కప్పు పసుపు – అర చెంచా ఉప్పు – తగినంత కొత్తిమీర తరుగు – చెంచా క్రీం – రెండు చెంచాలు తయారు చేసే విధానం రొయ్యల్ని ఒక గిన్నెలో తీసుకుని పసుపూ, ఉప్పు కలిపి పావుగంట సేపు నానబెట్టాలి. ఇంతలో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలూ, పచ్చిమిర్చీ, కొబ్బరి తురుమూ, కాసిని నీళ్లు తీసుకుని మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి రెండు చెంచాల ఆవనూనె వేసి రొయ్యల్ని వేసి వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి లవంగాలూ, బిర్యానీ ఆకులు వేయించి ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. పచ్చివాసన పోయాక కారం, చక్కెర, ఉప్పూ, కొబ్బరిపాలూ పోయాలి. పాలు ఉడికాక రొయ్యలు వేయాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. అప్పుడు కొత్తిమీర తరుగూ, క్రీం వేసి దింపేయాలి.
Spicy Prawns Curry / మసాలా రొయ్యల కూర
కావల్సినవి రొయ్యలు – పావుకేజీ పప్పునూనె- రెండు చెంచాలు మిరియాల పొడి – చెంచా కారం – చెంచా పసుపు – అరచెంచా ధనియాల పొడి – చెంచా యాలకులు – రెండు సోంపు – చెంచా కరివేపాకు – మూడు రెబ్బలు ఉల్లిపాయలు – రెండు టొమాటోలు – రెండు అల్లం, వెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు ఉప్పు- తగినంత కొత్తిమీర తరుగు – 2 చెంచాలు పొదీనా తరుగు : 2 చెంచాలు తయారు చేసే విధానం అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక సోంపూ, యాలకులూ, కరివేపాకు వేయాలి. అవి వేగాక ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. ఎర్రగా వేగాక టొమాటో ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్దా, ధనియాల పొడీ, మిరియాల పొడీ, పసుపూ, కారం, ఉప్పు వేసి మరోసారి వేయించుకోవాలి. టొమాటో ముక్కలు ఉడికి నూనె పైకి తేలాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. రొయ్యలు మెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగు, పొదీనా తరుగు వేసి దింపేయాలి.
Chintakaya-Prawn curry / చింతకాయలతో రొయ్యల కూర
కావల్సినవి చింతకాయలు- పావుకిలో పచ్చిరొయ్యలు- అరకిలో పసుపు- కొద్దిగా కారం- రెండు చెంచాలు నూనె- తగినంత ఉల్లిపాయలు – 2 అల్లం- కొద్దిగా ఉప్పు- తగినంత తయారు చేసే విధానం ముందుగా చింతకాయల్ని కొద్దిగా దంచి అందులోని గింజలను తీసివేయాలి . వీటిని రోట్లోకానీ మిక్సీలో కానీ వేసి పసుపు, ఉప్పు వేసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయల ముక్కలు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన పచ్చిరొయ్యలని అందులో వేసి మగ్గించుకోవాలి. దంచిన అల్లం కూడా వేసుకుని బాగా కలిపి అందులో నూరిన చింతకాయ మిశ్రమాన్ని వేసి కలియ తిప్పాలి. కాసేపటికి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం కూడా వేసి కొద్దిగా నీరు పోసుకుని మూత పెట్టేయాలి. చింత పులుపు రొయ్యలకు పట్టి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్లు కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు.
రొయ్యల ఇగురు కావలసినవి: ప్రాన్స్ – 500 గ్రా; ఉల్లితరుగు – రెండు కప్పులు ఏలకులు – ఆరు; దాల్చినచెక్క – కొద్దిగా; నూనె – కప్పు పచ్చిమిర్చి – ఆరు (పొడవుగా కట్ చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు జీడిపప్పు – 10 పలుకులు; కొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లుపసుపు – చిటికెడు; గరంమసాలా – రెండు టీ స్పూన్లు గ్రేవీ కోసం:గసగసాలు – రెండు టీ స్పూన్లు; జీడిపప్పు – 10 పలుకులుపుచ్చపప్పు – రెండు టీ స్పూన్లు; కొబ్బరిముక్కలు – అర కప్పు వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
తయారి: ►ముందుగా ప్రాన్స్ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ►స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగావేయించాలి ►అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి ►ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపిమిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి ►ఇప్పుడు సర్వింగ్బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ప్రాన్స్ మంచూరియా కావలసినవి: ప్రాన్స్ – 200 గ్రా; అజినమోటో – టీ స్పూన్ఉప్పు – తగినంత; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లుకోడిగుడ్డు – ఒకటి; కార్న్ఫ్లోర్ – అర కప్పు; మైదాపిండి – పావు కప్పునూనె – డీప్ ఫ్రైకి సరిపడా; పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు అల్లంవెల్లుల్లి తరుగు –నాలుగు టీ స్పూన్లు; పసుపు – చిటికెడుకారం – టీ స్పూన్; కొత్తిమీర – కట్ట (సన్నగా తరగాలి)
తయారి: ►ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి ►ఒక గిన్నెలో అర టీ స్పూన్ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగా కలుపుకోవాలి ►ఆ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్ వేసి కలపాలి ►పాన్లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి ►ఇప్పుడువేరొక పాన్ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ అజినమోటో, అర టీ స్పూన్ మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్పకోడీని కూడా కలిపి తక్కువ సెగ మీద అయిదారు నిమిషాలు తిప్పి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రాన్స్ మంచూరియా రెడీ.
థాయ్ ప్రాన్ కేక్ కావలసినవి: రొయ్యలు – 300 గ్రా.పండు మిరప పేస్ట్ – 2 టీ స్పూన్లు లెమన్ గ్రాస్ – 3 టీ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్లు కారం – 2 టీ స్పూన్లు నిమ్మరసం – 2 టీ స్పూన్లు ఉప్పు – 2 టీ స్పూన్లు ఫిష్ సాస్ – 2 టీ స్పూన్లు తులసి ఆకులు – 2 టీ స్పూన్లునూనె – 2 టీ స్పూన్లు చిల్లీ ఆయిల్ – 2 టీ స్పూన్లుఉల్లికాడలు – 25 గ్రా.కార్న్ ఫ్లోర్– 30 గ్రా.అల్లం పేస్ట్ – 2 టీ స్పూన్లు నిమ్మ ఆకులు – 2
తయారి: ►రొయ్యలను శుభ్రపరిచాలి ►చిల్లీపేస్ట్, లెమన్ గ్రాస్, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, ఫిష్ సాస్, తులసి ఆకులు,చిల్లీ ఆయిల్, ఉల్లికాడలు, కార్న్ఫ్లోర్, అల్లంపేస్ట్ రొయ్యలలో వేసి కలపాలి ►తర్వాత చిన్న చిన్న ముద్దలుచేసి, చేత్తో అదమాలి ►వీటినినాన్స్టిక్ పాన్పై కొద్దిగానూనె వేసి, వేడయ్యాక రెండు వైపులా కాల్చి, తీయాలి ►గార్లిక్ సాస్తో తయారుచేసుకున్న థాయ్ ప్రాన్కేక్లను వేడి వేడిగా సర్వ్చేయాలి.
చెట్టినాడు ప్రాన్స్ కావలసినవి: రొయ్యలు (తోక ఉంచాలి) – 8; ధనియాల పొడి– 25 గ్రా.; జీలకర్ర పొడి – 20గ్రా.; మిరియాల పొడి – 16 గ్రా.; స్టార్ అనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) – 25 గ్రా.; కల్పసి (మార్కెట్లో లబిస్తుంది) – టీ స్పూన్; మరాఠీమొగ్గ్గ (మార్కెట్లో లభిస్తుంది) – చిటికెడు;జాజికాయ – 1 (పొడి చేయాలి); ఏలకులు – 2 (పొడి చేయాలి);దాల్చిన చెక్క – చిన్న ముక్క (పొడి చేయాలి); లవంగాలు – 3 (పొడి చేయాలి); సోంపు (వేయించి పొడి చేయాలి) – 8 గ్రా.; హంగ్ కర్డ్ (ఒక పలుచనివస్త్రంలో పెరుగు వేసి, వడకట్టి, నీరు తీసేసినది) – 50 గ్రా.; నిమ్మకాయ – 1; పసుపు– చిటికెడు; ఆవనూనె – టీ స్పూన్; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ఉప్పు – తగినంత
చేపల వేపుడుకు బొచ్చె చేపలు, వంజిరం చేపలు, పండుగప్ప లేక కొంచెం పెద్ద చేపలు బాగుంటాయి. చేప తోకముక్కలు, చిన్నచేపలు ముళ్ళతో ఉండి తినటానికి అసౌకర్యంగా ఉంటుంది.
కావలిసినవి చేపముక్కలు : కిలో కారం : 2 టీస్పూన్లు ధనియాల పొడి : టీ స్పూను మెంతిపొడి : అరస్పూను అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒకటేబుల్ స్పూన్ ఉప్పు: తగినంత పసుపు : టీస్పూను నిమ్మరసం : 4 టీస్పూన్లు నూనె : వేయించటానికి సరిపడినంత తీసుకోవాలి. కొత్తిమీర : కొద్దిగా
బజారు నుండి కొనుగోలు చేసిన చేపముక్కలను అలాగా వండరాదు. వాటిని ఉప్పు కొద్దిగా మజ్జిగ కలిపి శుభ్రం చేసుకోవాలి తరువాతవాటిని చక్కగా కడిగాలి.
ఒక పాత్రలో కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, మిరియాలపొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నీరు పోసీ వీటన్నిటినీ పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించి ఓ స్టీల్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో ఓ గంటసేపు ఉంచాలి. తరువాత బయటకు తీసి కొంచెంసేపు ఉంచితే చల్లదనం తగ్గి మాములుగా ఉంటాయి.
స్టవ్ మీద వెడల్పాటి పాన్ లేక నాన్ స్టిక్ కుక్ వేర్ కానీ పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత మంట సిమ్ లో ఉంచి చేపముక్కలను పరవాలి. ఓ అయిదు నిమిషాల తరువాత చేపముక్కలను రెండవపక్కకు త్రిప్పాలి. మంటను మీడియంలో పెట్టి చేపేముక్కలను రెండుప్రక్కలా బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించి దించుకొని నిమ్మరసం, కొత్తిమీర చల్లుకొని కొద్దిగా ఆరిన తరువాత వడ్డించాలి.
తయారు చేసే విధానం చేపముక్కలను శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుగుకోవాలి. ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్రలో నూనె వేసి వేడెక్కిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దనియాల పొడి, జీలకర్రపొడి, కరివేపాకు వేసికొద్దిగా వేగిన తరువాత చేపముక్కలు వేసి అందులో చింతపండు గుజ్జు కలపాలి. తగానంత ఉప్పు, పసుపు కూడా వేసి అన్నీ కలిసేటట్లు నెమ్మదిగా గరిటతో కలపాలి. కొద్దిగా నీరుపోసి చేప ముక్కలు ఉడికాక దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి. కారం ఎక్కువగా తినేవారు ఇంకొద్దిగా కారం కలుపుకోవచ్చు. చేపల పులుసుకు బొచ్చెలు, కొరమీనులు, వంజిరం, పులస చేపలు, పండుకప్ప, చందువాలు పెద్దముక్కలు బాగుంటాయి.
బొమ్మిడాయిల పులుసు
కావలిసినవి బొమ్మిడాయిలు : కిలో ఉల్లిపాయలు : 2 పెద్దవి పచ్చిమిర్చి : 4 కాయలు టమాటోలు : 4 మీడియం సైజ్ వి చింతపండు : 50 గ్రాములు పసుపు : ఒక స్పూన్ కారం : 3 స్పూన్లు కరివేపాకు రెబ్బలు : నాలుగు కొత్తిమీర : కొద్దిగా నూనె : 4 టేబుల్ స్పూన్లు పుల్ల మామిడి కాయ : చిన్నది
తయారు చేసే విధానం బొమ్మిడాయిలను శుభ్రం చేసుకోవాలి. చింతపండును వేడినీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరుగుకోవాలి.
పాన్ లో గానీ, వెడల్పాటి పాత్రలో గానీ నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు వేసి ఇవన్నీ బాగా మెత్తబడేవరకు ఉంచాలి. తరువాత చేప ముక్కలను మామిడి ముక్కలు ఉప్పు, కారం పసుపు వేసి చక్కగా కలపాలి. తరువాత చింతపండు గుజ్జును వేసి మరొకసారి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కలిపి చక్కగా ఉడికిన తరువాత దించేముందు కొత్తిమీర చల్లి వడ్డించాలి.
Kerala fish – Nethili fish fry / నెత్తిలి చేపల ఫ్రై
Kerala fish – Nethili fish fry / నెత్తిలి చేపల ఫ్రై కావలిసినవి నెత్తిలి చేపలు – పావుకేజీ నూనె – వేయించేందుకు సరిపడా. మసాలా కోసం: చిన్న ఉల్లిపాయలు – ఎనిమిది వెల్లుల్లి- నాలుగు రెబ్బలు అల్లం ముక్కలు – రెండు కారం – చెంచా పసుపు – చిటికెడు మిరియాల పొడి – పావు చెంచా మైదా – మూడు చెంచాలు గుడ్డు – ఒకటి ఉప్పు – తగినంత. ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి. అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
Kerala Spicy Fish Fry / కేరళ స్పైసీ ఫిష్ ఫ్రై
చేపల వేపుడుకు బొచ్చె చేపలు, వంజిరం చేపలు, పండుగప్ప లేక కొంచెం పెద్ద చేపలు బాగుంటాయి. చేప తోకముక్కలు, చిన్నచేపలు ముళ్ళతో ఉండి తినటానికి అసౌకర్యంగా ఉంటుంది. చేపలు – అరకేజీ, కారం – నాలుగు చెంచాలు పసుపు- పావు చెంచా అల్లంముక్క- చిన్నది మిరియాలు – చెంచా కరివేపాకు- నాలుగు రెబ్బలు ఉప్పు – తగినంత నూనె- వేయించేందుకు సరిపడా ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి. అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
Fish cutlets….బొచ్చెచేపలతో కట్ లెట్స్
కావలిసినవి బొచ్చె చేప ముక్కలు – 10 తాజా అల్లం వెల్లుల్లి రెబ్బలు : 4 టీ స్పూన్ల పేస్ట్ పుదీనా ఆకు – ఒక కట్ట పచ్చిమిర్చి – పది కాయలు పొద్దుతిరుగుడు నూనె – అరకప్పు తాజా కొబ్బరి తురుము – వంద గ్రా ఉప్పు – సరిపడా పసుపు – అరస్పూను అరటిఆకులు – పెద్దవి నాలుగు
తయారు చేసే విధానం ముందుగా పుదీనా ఆకులు, అల్లం తరుగు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తీసుకుని నీళ్లు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి.
బొచ్చె చేప ముక్కలను బ్రెడ్ స్లైసులలాగా వెడల్పాటి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పడు మందుగా తయారు చేసుకున్న మషాలాను ఒక్కోచేపముక్కకు పట్టించి ఒక గంటసేపు ఉంచాలి. తరువాత అరటి ఆకులను కొంచెం వెడల్పుగా కత్తిరించికొని వాటికి పైభాగంలో నూనె రాసి ఒకో దాంట్లో ఒకో చేపముక్కను ఉంచి అరటి ఆకుల అంచులను మడచి ఊడిపోకుండా దారంతో కట్టాలి. వీటిని ఆవిరి మీద (ఇడ్లీ పాత్రలో) షుమారు 20 నుండి 25 నిమిషాల సేపు ఉడికించుకొని దించుకోవాలి. దీని వల్ల ఎక్కువగా నూనె వాడాల్సిన అవసరం ఉండదు. నిమ్మరసం, కొత్తిమీర తురుము చల్లుకోవచ్చు. వేడిగా తింటే రుచిగా ఉంటాయి
కావలిసినవి మటన్ : అరకిలో బాస్మతి బియ్యం : 1 కిలో (అరగంటసేపు నానబెట్టుకోవాలి) పెరుగు : 2 స్పూన్లు శొంఠి పొడి : టీ స్పూన్ యాలకుల పొడి : పావు స్పూను కుంకుమపువ్వు : 2 గ్రాములు కారం : 2 స్పూన్లు గరం మషాలా : రెండు స్పూన్లు ఉప్పు : రుచికి సరిపడా వేసుకోవాలి
తయారు చేయువిధానం ఒక వెడల్పాటి పాన్ లో నెయ్యువేసి వేడెక్కిన తరువాత మటన్ ముక్కలు, ఇంగువ వేసి రెండునిమిషాల పాటు వేయించాలి. తరువాత పెరుగు కలిపి మరలా కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పలావు ఆకు ఒకటి వేసి వేయించాలి. ఉడకటానికి కొద్దిగా నీరు కలపవచ్చు. గరమ్ మషాలా కూడా వేసి మటన్ కొద్దిగా మెత్తబడేదాకా ఉంచి యాలకుల పొడి,శొంఠిపొడి, కుంకుమపువ్వు, కారం, తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి కొద్దిసేపు ఉంచాలి. ఇలా తయారైన మటన్ ను వేరుగా ఒకగిన్నెలోకి తీసికోవాలి, అదే పాన్లో రెండు లీటర్ల నీరుపోసి కొద్దిగా సోంప్ పొడి స్పూన్ గరం మషాలపొడి పలచని గుడ్డలో మూటకట్టి నీళ్లలో వేయాలి. తరువాత బాస్మతీ బియ్యం కూడా వేసి సిమ్ లో బియ్యం పూర్తిగా కాకుండా సగం దాకా ఉడకనివ్వాలి. ఇది కూడా వేరుగా తీసుకొని (నీరు ఎక్కువగా ఉంటే వంపేయాలి.) అదే పాన్లో అన్నము కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మటన్ ముక్కలు కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మరలా అన్నం, అన్నంపైన మటన్ ముక్కలు ఇలా అంతా అయిపోయేదాకా వేయాలి. ఇపుడు సిమ్ లో పూర్తిగా అన్నం, మటన్ ఉడికేదాకా ఉంచి దించేటపుడు (అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవాలి) సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.
మటన్ ఫ్రై
కావలసినవి మటన్ : అరకిలో పెరుగు : 1 కప్పు ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి గరం మషాలా : 1 స్పూను మిరియాలు : అరస్పూను వెల్లుల్లి రెబ్బలు : ఆరు ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు కరివేపాకు : 2 రెమ్మలు నూనె : 1 కప్పు ఉప్పు : రుచికి సరిపడా వేయాలి పసుపు : అర స్పూను కారం : 2 స్పూన్లు కొత్తిమీర : కొద్దిగా సన్నగా తరుగుకోవాలి తయారు చేయు విధానం అల్లం, వెల్లుల్లి, మిరియాలు, అన్నీ కలిపి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని మటన్ ముక్కలు, టేబుల్ స్పూన్ నూనె, పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి రెండుగంటలు నాననివ్వాలి. స్టౌ వెలిగించి బాణాలి లేక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు రుబ్బినవి వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తరువాత అందులో నానబెట్టిన మటన్ కూడా వేసి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, గరం మషాలా వేసి బాగా వేగనిచ్చి దింపుకోవాలి.
మటన్ కర్రీ
కావలసినవి మటన్ : అరకిలో ఉల్లిపాయ : 1 పెద్దది టమాటోలు : 3 మీడియం సైజువి మిరియాలు : అరస్పూను వెల్లుల్లి రెబ్బలు : ఆరు ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు కరివేపాకు : 2 రెమ్మలు నూనె : 2 టీ స్పూన్లు ఉప్పు : రుచికి సరిపడా వేయాలి
పసుపు : అర స్పూను కారం : 2 స్పూన్లు కొత్తిమీర : కొద్దిగా సన్నగా తరుగుకోవాలి మంచినీళ్లు : 2 కప్పులు తయారు చేయు విధానం మోటోలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, అన్నీ కలిపి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్లో మటన్ ముక్కలు వేసి రెండు కప్పులు నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత ఓపెన్ చేయాలి. పాన్ లో 2 స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయలు, గ్రైండ్ చేసిన మిశ్రమం, ధనియాల పొడి వేసి మంచి కలర్ (గోల్డ్ బ్రౌన్ కలర్) వచ్చేదాకా వేయించుకోవాలి. ఇష్టమున్నవారు గరమ్ మషాలా ఒకస్పూన్ వేసుకోవచ్చు. తరువాత మటన్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీరు పోసి బాగా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి.
Keema curry – కీమా కూర
కావలిసినవి కీమా: పావుకిలో టొమాటోలు: రెండు ఉల్లిపాయలు: రెండు పచ్చిమిర్చి : 2 నిలువుగా చీల్చుకోవాలి దనియాలపొడి: 2 టీస్పూన్లు నూనె: అరకప్పు పసుపు: చిటికెడు బంగాళాదుంపలు: రెండు గరంమసాలాపొడి: టీస్పూను కారం: 1 చెంచాలు ఉప్పు: తగినంత అల్లంవెల్లుల్లిముద్ద: 2 చెంచాలు కొత్తిమీర: కట్ట తయారు చేయువిధానం బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. . తరువాత గరంమసాలా పొడి వేయాలి పసుపు, కారం, దనియాలపొడి వేసి కలపాలి. ఇప్పుడు కీమా వేసి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. తరువాత ముక్కలుగా కోసిన బంగాళాదుంప, టొమాటోముక్కలు, ఉప్పు వేసి కలిపి మరో పావుగంటసేపు ఉడికించి, దించేముందు కొత్తిమీర చల్లాలి.
Gongura Mutton / గోంగూర మటన్
కావలసినవి మటన్ చిన్న ముక్కలు: అరకిలో ఉల్లిపాయలు: పావుకిలో అల్లం,వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్స్పూన్లు కారం: టేబుల్స్పూను పసుపు: టీస్పూను కొత్తిమీర: కట్ట పుల్లగోంగూరకట్టలు: ఐదు పచ్చిమిర్చి: ఎనిమిది నూనె: 50గ్రా. ఉప్పు: తగినంత. తయారు చేయు విధానం మటన్ ముక్కల్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. వెడల్పాటి పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత ఉడికిన మటన్ ముక్కలు అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిసేపు ఉడికించాలి వేరొక పాత్రలో బాణలిలో గోంగూరను వేసి ఉడికించి మెత్తని ముద్దలా చేసి, ఈ ముద్దను వేయిస్తోన్న మటన్లో వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించాక కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి.
ముందుగా గోధుమరవ్వ, పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర పప్పులను విడివిడిగా కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి. రాత్రి నానపెట్టుకోవడం కుదరనివారు కనీసం రెండు గంటలైనా నానపెట్టాలి. తరువాత మటన్ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు, గరం మసాల వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని దానిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలపాటు నెయ్యిలో మటన్ వేగిన తరువాత దానిలో రెండు కప్పులు నీళ్లుపోయాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి పది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.
మటన్ ఉడికిన తరువాత చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నాన పెట్టుకున్న అన్ని రకాల పప్పులను ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. ఇవి ఉడుకుతుండగానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, జీలకర్ర, సాజిరా వేసి దానిలో పది కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తరువాత వీటన్నింటిని మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని ఎర్రగా వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని దానిలో మూడు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తరువాత దానిలో ఉడికించి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మటన్ను వేసి రెండు–మూడు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత గోధుమ రవ్వ, పప్పులన్నింటిని కలిపి గ్రైండ్ చేసిన ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి పైకి నెయ్యి తేలినప్పుడు దానిలో ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి కలిపితే హలీమ్ తయారైనట్లే. స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పలుకులను పైన చల్లి వడ్డిస్తే హలీమ్ చాలా రుచిగా ఉంటుంది.
కావల్సినవి చికెన్ : అరకిలో అల్లం, వెల్లుల్లి : 5 టీస్పూన్లు కారం : 5 టీ స్పూన్లు ఉప్పు : తగినంత నూనె : 4 టీస్పూన్లు ఉల్లిముక్కలు : 2 కప్పులు టమాటో గుజ్జు : 1 కప్పు పచ్చిమిర్చి : నాలుగు కరివేపాకు : 2 రెబ్బలు ధనియాల పొడి : 2 టీస్పూన్లు మిరియాల పొడి : అర స్పూను కొత్తిమీర : కొద్దిగా మసాలకోసం : జీలకర్ర : టీ స్పూను, సోంపు అర టీస్పూను, లవంగాలు 4, యాలకులు : రెండు, దాల్చిన చెక్క: చిన్నముక్క గసగసాలు : ఒక టేబుల్ స్పూన్
తయారు చేయువిధానం : చికెన్ ముక్కలను బాగా కడిగి 4 టీస్పూన్ల కారం, 4 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు పట్టించి అరగంటసేపు నానబెట్టాలి. పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి. బాణాలిలో కొద్దిగా నూనెవేసి మసాలా దినుసులను వేయించి దించుకోవాలి. చల్లారాక వీటిని పొడి చేసుకోవాలి.
బాణాలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి కరివేపాకు, మిగిలిన అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. తరువాత చికెన్ ముక్కలు., గరం మసాలా మిగిలిన కారం, దనియాలపొడి వేసి బాగా కలపాలి. నాలుగైదు నిమిషాలపాడు ఉడికిన తరువాత టమాటో గుజ్జువేసి నూనె తేలే వరకు ఉడికించాలి. తరువాత ఒక కప్పు నీరుపోసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాసేపు ఉడికించి దించబోయే ముందు కొత్తిమీర తురుము చల్లి దించుకోవాలి.
Butter Chicken / బటర్ చికెన్
కావల్సినవి ఎముకల్లేని చికెన్ – అరకేజీ చిక్కని పెరుగు – పావుకప్పు వెన్న – అరకప్పు వెల్లుల్లి రెబ్బలు – ఆరు అల్లం – పెద్ద ముక్క నూనె – టేబుల్స్పూను ఉప్పు – తగినంత గరంమసాలా – చెంచా టొమాటోలు – నాలుగు యాలకులు – ఏడు దాల్చినచెక్క – చిన్నముక్క లవంగాలు – నాలుగు మెంతిపొడి – చెంచా పచ్చిమిర్చి – రెండు జీడిపప్పు – పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి) కసూరీమేథీ – చెంచా క్రీం – పావుకప్పు
తయారు చేసే విధానం ఓ గిన్నెలో పెరుగూ, నూనె, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్దలా చేసి, సగం పెరుగులో వేసేయాలి. చికెన్ ముక్కలపై ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి.. ఫ్రిజ్లో కనీసం నాలుగుగంటలు పెట్టాలి (అయితే దీన్ని ముందురోజు చేసుకుంటే కూర ఇంకా రుచిగా వస్తుంది).
సాస్ తయారు చేసుకోవాలి. టొమాటోలను మిక్సీజారులోకి తీసుకుని గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెన్నను ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టి.. యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్క వేయాలి. వెన్న కరిగాక మెంతిపొడీ, పచ్చిమిర్చి ముక్కలూ, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసేయాలి. తరవాత టొమాటో గుజ్జు వేసి మంట తగ్గించాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. ఇందులో జీడిపప్పు ముద్దా, కప్పు నీళ్లూ పోయాలి.. తరవాత చికెన్ ముక్కలూ, కసూరీమేథీ, గరంమసాలా వేసి మంట తగ్గించాలి. చికెన్ ఉడికిందనుకున్నాక క్రీం, మరికొంచెం ఉప్పూ కలిపి దింపేయాలి.
Pudina Chicken…పుదీనా చికెన్
కావల్సినవి చికెన్- అరకేజీ పుదీనా – కట్ట పావుకప్పు కొత్తిమీర చిన్న కొబ్బరిముక్క ఉల్లిపాయలు : 1 పెద్దది పచ్చిమిర్చి : 5 పసుపు : 1 స్పూన్ ఉప్పు : తగినంత కారం : రెండు స్పూన్ లు గరం మసాలా పొడి 1 స్పూన్ ధనియాల పొడి : 1 స్పూన్ తయారు చేసే విధానం ముందుగా చికెన్ ని మారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇందుకోసం ముందుగా చికెన్ లో కొద్దిగా పసుపు, చెంచా కారం, చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్, చెంచా ధనియాల పొడి, రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో రెండు పెద్ద చెంచాల నూనె వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. సన్నగా తరిగిన పచ్చి మిర్చి, చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించి మారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత పుదీనా వేస్ట్ వేసి బాగా కలిపి మళ్లీ మూతపెట్టుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత దీనికి కొద్దిగా గరంమసాలాపొడి, ధనియాల పొడి వేసి కలిపి దింపుకోవాలి.
Methi Chicken….మేథి చికెన్
కావల్సినవి చికెన్- అర కిలో మెంతికూర- రెండు కట్టలు కొత్తిమీర కట్ట ధనియాల పొడి- చెంచా పసుపు- చెంచా పచ్చిమిర్చి- 6 అల్లం వెల్లుల్లిపేస్ట్- రెండు చెంచాలు ఉల్లిపాయలు- రెండు టమాటాలు- నాలుగు జీలకర్ర- చెంచా పెరుగు- మూడు చెంచాలు గరంమసాలా- రెండు చెంచాలు కారం- రెండు స్పూన్లు ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం
వెడల్పాటి పాత్రలో నూనెవేసి వేడెక్కాక ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తరువాత జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ధనియాలపొడి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, చికెన్, పెరుగు వేసి తగినంత నీరు, ఉప్పు పోసి మూతపెట్టాలి. చికెన్ మ్తొతం ఉడికిన తర్వాత దీనికి మెంతి ఆకులు, కొత్తిమీర కలుపుకోవాలి. మెంతికూర ఉడికిన తర్వాత దింపుకోవాలి.