Category: INTERMEDIATE
Intermediate Courses… Guidelines to Students
విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరాలి? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో మన విద్యార్ధుల కోసం తెలియజేస్తున్నాం. పదవ తరగతి తరువాత ….ఇంటర్మీడియట్సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, ఇంటర్మీడియట్తోనే మొదలవుతుంది. ఇంటర్లో ఏయే గ్రూపులు ఉంటాయి? ఏ గ్రూపు చదివితే ఎలాంటి ఫలితం ఉంటుంది? గ్రూపులను ఎలా ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత ఏం చేయాలి?”…గ్రూపు ఎంపికలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేందుకు అందిస్తున్న పూర్తి సమాచారమిది.• విద్యార్థులు కాస్త తక్కువస్థాయిలోనైనా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి ఐటీఐ, దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులు…
Read Moreసీఈసీ ఇంటర్
ఇంటర్లో సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు బీకాం రెగ్యులర్, బీకాం కంప్యూటర్స్తో పాటు బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి కొంత కష్టమైనా ప్రొఫెషనల్ కోర్సులైన చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), సీఎంఏ వంటివి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ముఖ్యంగా కంపెనీల్లో, వ్యాపార వాణిజ్య రంగాలలో ఉజ్వల అవకాశాలున్న కోర్సు చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ). ఈ కోర్సును ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, అన్ని ప్రధాన నగరాల్లో శాఖలు ఉన్నారుు. సీఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్ (ఐపీసీసీ), సీఏ ఫైనల్స్ స్థారుులు ఉంటారుు. ప్రణాళిక ప్రకారం చదివితే నిర్ణీత వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఈ కోర్సు చేసినవారు ట్యాక్స్…
Read MoreAfter M.P.C
ఇంజనీరింగ్ vs డిగ్రీ పస్తుతం బీటెక్, బ్యాచిలర్ డిగ్రీలో ఏది బెస్ట్ అంటే.. జాబ్ మార్కెట్ కోణంలో బీటెక్కే తొలి ప్రాధాన్యం అని చెప్పొచ్చు. బీటెక్లో మీరు ఎంపిక చేసుకునే బ్రాంచ్ కూడా కెరీర్ పరంగా కీలకం. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బీటెక్లో సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచ్ల విద్యార్థులకు జాబ్ మార్కెట్లో కొంత ప్రాధాన్యం ఉంటోంది. ఈ బ్రాంచ్ల విద్యార్థులు అకడమిక్స్కే పరిమితం కాకుండా.. తాజా ట్రెండ్స్కు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. బీటెక్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3-డి డిజైన్ ప్రింటింగ్ తదితర అంశాలపై అవగాహన పొందాలి. ఇలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. బీటెక్లో ఏ బ్రాంచ్లో చేరినా ఉద్యోగం పొందడం సులభమే. ఈ విద్యా సంవత్సరంలో బీటెక్లో చేరాలనుకుంటే.. సీఎస్ఈ…
Read Moreకెరీర్ ఆఫ్టర్ 10.. ప్లస్ టు
మెడిసిన్ మధ్యలోనే మానేసి.. సింగర్గా మారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారున్నారు.. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదువు వదిలేసి.. లాలో చేరి గొప్ప లాయర్లుగా పేరు గడించినవారున్నారు.. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మనలో చాలా మంది టెన్త్ అయ్యాక బైపీసీ కాకుండా ఎంపీసీలో చేరాల్సింది… ఎంపీసీ కాకుండా సీఈసీలో చేరాల్సింది.. హెచ్ఈసీ కాకుండా ఎంఈసీలో చేరాల్సింది అని బాధపడుతుంటారు… ఈ కోర్సు కాకుండా ఇంకో కోర్సులో చేరాల్సింది… ఈ జాబ్ కాకుండా మరో జాబ్ కోసం ట్రై చేయాల్సింది అని..! ఎందుకు అలా చేశారు… మీకు నచ్చిన కోర్సులో ఎందుకు చేరలేదు. ఇష్టమైన కెరీర్ను ఎందుకు ఎంచుకోలేదు.. అని అడిగితే నూటికి 99 శాతం మంది చెప్పే సమాధానం ఒక్కటే…అదే సరైన గెడైన్స్ లేకపోవడం. సో! టెన్త్, ఇంటర్ పూర్తయ్యాక తీసుకునే నిర్ణయం ఎంతో కీలకం.. అందుకే…
Read Moreగ్రేట్ కెరీర్కు కేరాఫ్ ఎంపీసీ
జియాలజిస్టుగా విలువైన గనులను కనుక్కోవాలనుందా? ఐఫోన్ సృష్టికర్త స్టీవ్జాబ్స్ను మించిన గుర్తింపును కోరుకుంటున్నారా? ప్రపంచంలోనే అపర కుబేరుడిగా కీర్తికెక్కిన బిల్గేట్స్లా పేరు తెచ్చుకోవాలనుందా? లేదా సివి రామన్లా నోబెల్ బహుమతిని పొందాలనుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘ఎస్’ అయితే మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూపును ఎంచుకోవాలి.పదో తరగతి తర్వాత… ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే ఎన్నో కోర్సులు.. ఐటీఐ, పాలిటెక్నిక్, హోటల్ మేనేజ్మెంట్, సెట్విన్ కోర్సులు, స్వయం ఉపాధినందించే వివిధ కోర్సులు పదో తరగతి పాసైన విద్యార్థికి స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కువ మంది చూపు మాత్రం ఇంటర్మీడియెట్లో చేరి ఎంపీసీ గ్రూప్ను ఎంచుకోవడం. ఈ గ్రూప్కు ఉన్నటువంటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మరే గ్రూప్కు లేవంటే అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలో ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ను తీసుకున్న విద్యార్థికి ఉండే అవకాశాల విశ్లేషణ..ఎంపీసీ గ్రూప్…
Read Moreఇంటర్ తర్వాత దారులెన్నో..!
ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్ కీలక దశ. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తొలి అడుగులు పడేది ఇక్కడే. ఇటీవలే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. రెండేళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ పూర్తి చేసిన వారిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్ వైపు.. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మెడిసిన్ వైపు ఆసక్తి చూపుతున్నారు. కామర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ వంటి కోర్సులు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. సదరు కోర్సులో మెరుగ్గా రాణించి మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. చక్కటి కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్లో గ్రూప్ల వారీగా భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ.. ఎంపీసీతో..ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ చదివిన…
Read More
You must be logged in to post a comment.